Political News

అమరావతికి మరో గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి రూ.750 కోట్లు విడుదల

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి నిధుల కష్టాలు తొలగిపోయాయి. అమరావతిలోని ప్రధాన భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, అసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రూ.15,000 కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల నిధుల మంజూరు అయ్యాయి. అదే సమయంలో కేంద్రం తన వాటా కింద అమరావతికి రూ.1,500 కోట్ల నిధులను ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిధులు… ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల రుణాల్లో కలిసే ఉంటాయి. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు తన తొలి విడత రుణం రూ.3,535 కోట్లను ఇప్పటికే విడుదల చేయగా… తాజాగా కేంద్రం తన వాటాగా ఒప్పుకున్న రూ.1,500 కోట్ల నుంచి తొలి విడత నిధుల కింద రూ.750 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు చేరాయి. వెరసి ఇప్పటిదాకా అమరావతికి రూ.4,285 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి.

టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికార పగ్గాలు చేపట్టినంతనే… అమరావతి నిర్మాణాన్ని ఈ ఐదేళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనే పూర్తి చేసి తీరాలన్న ఉక్కు సంకల్పంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ వ్యూహంతో రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను కలిసిన చంద్రబాబు… అమరావతి నిర్మాణాన్ని తాము ఓ అంతర్జాతీయ స్థాయి నగరం స్థాయిలో చేపడుతున్నామని తెలిపారు. చంద్రబాబు ప్రజెంటేషన్ తో ప్రపంచ బ్యాంకు కొంతమేర సానుకూలత వ్యక్తం చేయగా… చంద్రబాబు నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లారు. ప్రపంచ బ్యాంకు రుణం గురించి ఆయన మోదీతో చర్చించారు. అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు ఇవ్వదలచిన రుణానికి గ్యారెంటీ ఇచ్చేందుకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందానికి తెలియజేశారు.

చంద్రబాబు ప్రతిపాదనలు, అమరావతి రుణానికి కేంద్రం గ్యారెంటీ ఇవ్వనున్న విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ బ్యాంకు… తనతో పాటు అమరావతికి రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకును కూడా ఒప్పించింది. ఈ క్రమంలో మొత్తంగా రూ.15 వేల కోట్ల రుణాన్ని అమరావతికి ఇచ్చేందుకు ఆ రెండు బ్యాంకులు ఒప్పుకుని… అందులో 10 శాతం నిధులు అంటే.. రూ.1,500 కోట్లను కేంద్రం ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా దశలవారీగా అనుమతులన్నీ వచ్చేయగా… ఇటీవలే ప్రపంచ బ్యాంకు తన రుణంలోని తొలి విడత నిధుల కింద రూ.3,535 కోట్లను ఇటీవలే విడుదల చేసింది. ఇదే విషయాన్ని ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ క్రమంలో కేంద్రం తన వాటాలోని రూ.750 కోట్లను కూడా ప్రపంచ బ్యాంకు నిధులకు జత చేస్తూ మొత్తం రూ.4,285 కోట్లను రాష్ట్ర ఖాతాలోకి జమ చేసింది. ఇక ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి తొలి విడత రుణం విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, కేంద్రం వాటా నిధులు ఏపీకి విడుదలైన నేపథ్యంలో అతి త్వరలోనే ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం నిధులు కూడా అమరావతికి అందనున్నాయి.

This post was last modified on April 7, 2025 12:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

33 minutes ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

46 minutes ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

7 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

9 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

9 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

10 hours ago