వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మై నారిటీ ముస్లింలు.. చర్చ చేస్తున్నారు. దీనిలో వాస్తవం ఎంత? అనేదానిపై వారు దృష్టి పెట్టారు. అయితే.. ఈ విషయంపై వైసీపీ ఎదురు దాడి చేసింది. తాము పూర్తిగా మైనారిటీలకు అనుకూలమేనని.. లోక్సభలో ఈ మేరకు ఓటింగుకు కూడా దూరంగా ఉండి.. వ్యతిరేకంగా ఓటేశామని చెప్పింది. కానీ, రాజ్యసభకు వచ్చే సరికి.. మాత్రం.. వైసీపీ సభ్యుడు నత్వానీఅనుకూలంగా ఓటేశారు.
దీనిని టీడీపీ హైలెట్ చేసింది. అయితే.. ఇది తమకు డ్యామేజీగా మారుతుందని భావించిన వైసీపీ వెంట నే ఎదురు దాడి ప్రారంభించినా.. అది పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు ఏంచేయాలన్న అంశంపై వైసీపీ అంతర్మథనం చెందుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వివరణల మీద వివరణలు ఇచ్చి నా.. దీనిని నమ్మే పరిస్థితి లేకపోవడం గమనార్హం. మరోవైపు వక్ఫ్ బిల్లుకు తాము మద్దతు ప్రకటించినప్ప టికీ.. మైనారిటీలకు అన్యాయం జరక్కుండా సవరణలు ప్రతిపాదించి సక్సెస్ అయ్యామని టీడీపీ చెబుతోంది.
ఈ మొత్తం పరిణామాలు వైసీపీపై ఒత్తిడిని పెంచుతున్నాయి. బిల్లు విషయంలో వైసీపీది ద్వంద్వ వైఖరి అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో కామెంట్లు కూడా పడుతున్నాయి. అంతేకాదు.. మరికొందరు జగన్ మార్క్ డబుల్ గేమ్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి లోక్సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగినప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారని ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆ పార్టీ నలుగురు ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని కూడా సోషల్ మీడియాలో చెబుతున్నప్పటికీ.. దీనికి పెద్దగా స్పందన అయితే కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ ఇప్పుడు కింకర్తవ్యం అంటూ.. తల పట్టుకుంది. మైనారిటీ ఓటు బ్యాంకుపై ఈ పార్టీ బారీ ఆశలు పెట్టుకోవడం.. గత ఎన్నికల సమయంలోనూ బీజేపీ చేతులు చాపినా స్నేహ హస్తం అందించకపోవడానికి కూడా ఇదే కారణమన్న విషయం తెలిసిందే. అధికారం కోల్పోయేందుకు కూడా వెనుకాడని వైసీపీ మైనారిటీలను వదులుకునేది లేదని తేల్చి చెప్పింది. అలాంటిది.. ఇప్పుడు ఏకంగా.. వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేసిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుండడంతో అంతర్మథనంలో పడిపోయింది. దీని నుంచి బయట పడేందుకు ఉన్న మార్గాలపై అన్వేషణ ప్రారంభించింది. మరి ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on April 7, 2025 10:45 am
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…