Political News

కిం క‌ర్త‌వ్యం.. వ‌క్ఫ్‌పై చిక్కుల్లో వైసీపీ ..!

వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటేసింద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీనిపై మై నారిటీ ముస్లింలు.. చ‌ర్చ చేస్తున్నారు. దీనిలో వాస్త‌వం ఎంత‌? అనేదానిపై వారు దృష్టి పెట్టారు. అయితే.. ఈ విషయంపై వైసీపీ ఎదురు దాడి చేసింది. తాము పూర్తిగా మైనారిటీల‌కు అనుకూల‌మేన‌ని.. లోక్‌స‌భ‌లో ఈ మేర‌కు ఓటింగుకు కూడా దూరంగా ఉండి.. వ్య‌తిరేకంగా ఓటేశామని చెప్పింది. కానీ, రాజ్య‌స‌భ‌కు వ‌చ్చే స‌రికి.. మాత్రం.. వైసీపీ స‌భ్యుడు న‌త్వానీఅనుకూలంగా ఓటేశారు.

దీనిని టీడీపీ హైలెట్ చేసింది. అయితే.. ఇది త‌మ‌కు డ్యామేజీగా మారుతుంద‌ని భావించిన వైసీపీ వెంట నే ఎదురు దాడి ప్రారంభించినా.. అది పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు ఏంచేయాల‌న్న అంశంపై వైసీపీ అంత‌ర్మ‌థ‌నం చెందుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. వివరణల మీద వివరణలు ఇచ్చి నా.. దీనిని న‌మ్మే ప‌రిస్థితి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు వ‌క్ఫ్ బిల్లుకు తాము మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినప్ప టికీ.. మైనారిటీల‌కు అన్యాయం జరక్కుండా సవరణలు ప్రతిపాదించి సక్సెస్‌ అయ్యామని టీడీపీ చెబుతోంది.

ఈ మొత్తం ప‌రిణామాలు వైసీపీపై ఒత్తిడిని పెంచుతున్నాయి. బిల్లు విషయంలో వైసీపీది ద్వంద్వ వైఖరి అంటూ సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో కామెంట్లు కూడా ప‌డుతున్నాయి. అంతేకాదు.. మ‌రికొంద‌రు జగన్ మార్క్ డబుల్ గేమ్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మ‌రోసారి లోక్‌సభలో వక్ఫ్‌ బిల్లుపై చర్చ జరిగినప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారని ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆ పార్టీ నలుగురు ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని కూడా సోష‌ల్ మీడియాలో చెబుతున్న‌ప్ప‌టికీ.. దీనికి పెద్ద‌గా స్పంద‌న అయితే క‌నిపించ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలోనే వైసీపీ ఇప్పుడు కింక‌ర్త‌వ్యం అంటూ.. త‌ల ప‌ట్టుకుంది. మైనారిటీ ఓటు బ్యాంకుపై ఈ పార్టీ బారీ ఆశ‌లు పెట్టుకోవ‌డం.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ బీజేపీ చేతులు చాపినా స్నేహ హ‌స్తం అందించ‌క‌పోవ‌డానికి కూడా ఇదే కార‌ణ‌మ‌న్న విష‌యం తెలిసిందే. అధికారం కోల్పోయేందుకు కూడా వెనుకాడ‌ని వైసీపీ మైనారిటీల‌ను వ‌దులుకునేది లేద‌ని తేల్చి చెప్పింది. అలాంటిది.. ఇప్పుడు ఏకంగా.. వ‌క్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేసింద‌న్న ప్ర‌చారం విస్తృతంగా సాగుతుండ‌డంతో అంత‌ర్మ‌థ‌నంలో ప‌డిపోయింది. దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఉన్న మార్గాల‌పై అన్వేష‌ణ ప్రారంభించింది. మ‌రి ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on April 7, 2025 10:45 am

Share
Show comments
Published by
Satya
Tags: waqf billYCP

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

56 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago