వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మై నారిటీ ముస్లింలు.. చర్చ చేస్తున్నారు. దీనిలో వాస్తవం ఎంత? అనేదానిపై వారు దృష్టి పెట్టారు. అయితే.. ఈ విషయంపై వైసీపీ ఎదురు దాడి చేసింది. తాము పూర్తిగా మైనారిటీలకు అనుకూలమేనని.. లోక్సభలో ఈ మేరకు ఓటింగుకు కూడా దూరంగా ఉండి.. వ్యతిరేకంగా ఓటేశామని చెప్పింది. కానీ, రాజ్యసభకు వచ్చే సరికి.. మాత్రం.. వైసీపీ సభ్యుడు నత్వానీఅనుకూలంగా ఓటేశారు.
దీనిని టీడీపీ హైలెట్ చేసింది. అయితే.. ఇది తమకు డ్యామేజీగా మారుతుందని భావించిన వైసీపీ వెంట నే ఎదురు దాడి ప్రారంభించినా.. అది పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు ఏంచేయాలన్న అంశంపై వైసీపీ అంతర్మథనం చెందుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వివరణల మీద వివరణలు ఇచ్చి నా.. దీనిని నమ్మే పరిస్థితి లేకపోవడం గమనార్హం. మరోవైపు వక్ఫ్ బిల్లుకు తాము మద్దతు ప్రకటించినప్ప టికీ.. మైనారిటీలకు అన్యాయం జరక్కుండా సవరణలు ప్రతిపాదించి సక్సెస్ అయ్యామని టీడీపీ చెబుతోంది.
ఈ మొత్తం పరిణామాలు వైసీపీపై ఒత్తిడిని పెంచుతున్నాయి. బిల్లు విషయంలో వైసీపీది ద్వంద్వ వైఖరి అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో కామెంట్లు కూడా పడుతున్నాయి. అంతేకాదు.. మరికొందరు జగన్ మార్క్ డబుల్ గేమ్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి లోక్సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగినప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారని ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆ పార్టీ నలుగురు ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని కూడా సోషల్ మీడియాలో చెబుతున్నప్పటికీ.. దీనికి పెద్దగా స్పందన అయితే కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ ఇప్పుడు కింకర్తవ్యం అంటూ.. తల పట్టుకుంది. మైనారిటీ ఓటు బ్యాంకుపై ఈ పార్టీ బారీ ఆశలు పెట్టుకోవడం.. గత ఎన్నికల సమయంలోనూ బీజేపీ చేతులు చాపినా స్నేహ హస్తం అందించకపోవడానికి కూడా ఇదే కారణమన్న విషయం తెలిసిందే. అధికారం కోల్పోయేందుకు కూడా వెనుకాడని వైసీపీ మైనారిటీలను వదులుకునేది లేదని తేల్చి చెప్పింది. అలాంటిది.. ఇప్పుడు ఏకంగా.. వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేసిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుండడంతో అంతర్మథనంలో పడిపోయింది. దీని నుంచి బయట పడేందుకు ఉన్న మార్గాలపై అన్వేషణ ప్రారంభించింది. మరి ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on April 7, 2025 10:45 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…