అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి పగ్గాలు చేపట్టిన తర్వాత.. ప్రపంచ దేశాల దిగుమతులపై భారీఎత్తున సుంకాలు (టారిఫ్లు) విధిస్తున్న విషయం తెలిసిందే. తన-మన అన్న తేడా లేకుండా.. అన్ని దేశాలపైనా ఆయన సుంకాల కొరడా ఝళి పిస్తున్నారు. దీంతో భారత దేశంపైనా భారీఎత్తున ప్రభావం పడుతోంది. కానీ.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న వాదన కూడా ఉంది. అమెరికాతో చర్చలు జరుపుతామని చెబుతున్నా.. అవి సాకారం కావడం లేదు. మరోవైపు.. ఈ సుంకాల కారణంగా ఏపీపై తీవ్ర ప్రభావం పడుతోంది.
గత రెండు రోజుల్లోనే అమెరికా పెంచిన సుంకాల కారణంగా.. రొయ్యల రంగం తీవ్రంగా దెబ్బతింది. సముద్ర ఉత్పత్తులకు కూడా గిరాకీ పడిపోయింది. ఏపీ నుంచి రొయ్యలు, పీతలు, ఇతర సముద్ర ఉత్పత్తులు విరివిగా అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. ఈ క్రమంలో అమెరికా పెంచిన టారిఫ్ కారణంగా.. ఏపీ రొయ్యల సాగు రంగం తీవ్రంగా దెబ్బతింది. దీనిపై మీడియా కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ప్రస్తుతం అమెరికా 27 శాతం మేరకు రొయ్యలపై సుంకాలు విధించింది. దీనిని గమనించిన చంద్రబాబు కేంద్రానికి ఆదివారం ఓ లేఖ రాశారు. దీనిలో ఆయన అమెరికా సుంకాలపై జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు రాసిన లేఖలో.. ఏపీలో ఎంత మంది మత్స్యకారులు ఆక్వా సాగుపై ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని వివరించారు. అంతేకాదు.. అమెరికా పెంచిన సుంకాలు.. తద్వారా ఏర్పడుతున్న నష్టం వంటివాటిని కూడా పేర్కొన్నారు. ఏపీ ఆక్వారంగాన్ని ఆదుకోవాలని, అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా అగ్రరాజ్యంతో కేంద్రం చర్చలు జరపాలని ఆయన విన్నవించారు.
రాష్ట్ర తలసరి ఆదాయంలో ఆక్వా రంగం కీలకంగా ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం లో చిక్కుకునే ప్రమాదం ఏర్పడిందని.. దీని నుంచి బయట పడేయకపోతే.. లక్షలాది మంది ఉపా ధి కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. ఆక్వాపై 27 శాతం మేరకు(100కు 27 రూపాయలు) సుంకాలు విధించడం ద్వారా ఆక్వా కోలుకోలేని విధంగా దెబ్బతింటుందన్నారు. అధిక సుంకాల వల్ల ఏపీ ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఆక్వా సాగు ఎలా ఉన్నా.. వీటి ఉత్పత్తులను నిల్వ చేసుకునే సదుపాయాలు పెద్దగా లేవని.. వీటికి కూడా కేంద్రం సహకరించాలని ఆయన విన్నవించారు.
This post was last modified on April 6, 2025 11:10 pm
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…