Political News

అమెరికా టారిఫ్‌… కేంద్రానికి చంద్ర‌బాబు లేఖ‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ప్ర‌పంచ దేశాల దిగుమ‌తుల‌పై భారీఎత్తున సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తున్న విష‌యం తెలిసిందే. త‌న-మ‌న అన్న తేడా లేకుండా.. అన్ని  దేశాల‌పైనా ఆయ‌న సుంకాల కొర‌డా ఝ‌ళి పిస్తున్నారు. దీంతో భార‌త దేశంపైనా భారీఎత్తున ప్ర‌భావం ప‌డుతోంది. కానీ.. ఈ విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న కూడా ఉంది. అమెరికాతో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని చెబుతున్నా.. అవి సాకారం కావ‌డం లేదు. మ‌రోవైపు.. ఈ సుంకాల కార‌ణంగా ఏపీపై తీవ్ర ప్ర‌భావం పడుతోంది.

గ‌త రెండు రోజుల్లోనే అమెరికా పెంచిన సుంకాల కార‌ణంగా.. రొయ్య‌ల రంగం తీవ్రంగా దెబ్బ‌తింది. స‌ముద్ర ఉత్ప‌త్తుల‌కు కూడా గిరాకీ ప‌డిపోయింది. ఏపీ నుంచి రొయ్య‌లు, పీత‌లు, ఇత‌ర స‌ముద్ర ఉత్ప‌త్తులు విరివిగా అమెరికాకు ఎగుమ‌తి అవుతుంటాయి. ఈ క్ర‌మంలో అమెరికా పెంచిన టారిఫ్ కార‌ణంగా.. ఏపీ రొయ్యల సాగు రంగం తీవ్రంగా దెబ్బ‌తింది. దీనిపై మీడియా కూడా పెద్ద ఎత్తున ఫోక‌స్ చేసింది. ప్ర‌స్తుతం అమెరికా 27 శాతం మేర‌కు రొయ్య‌ల‌పై సుంకాలు విధించింది. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు కేంద్రానికి ఆదివారం ఓ లేఖ రాశారు. దీనిలో ఆయ‌న అమెరికా సుంకాల‌పై జోక్యం చేసుకోవాల‌ని కోరారు.

ఈ మేర‌కు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాసిన లేఖ‌లో.. ఏపీలో ఎంత మంది మ‌త్స్య‌కారులు ఆక్వా సాగుపై ఆధార‌ప‌డి ఉన్నార‌న్న విష‌యాన్ని వివ‌రించారు. అంతేకాదు.. అమెరికా పెంచిన సుంకాలు.. త‌ద్వారా ఏర్ప‌డుతున్న న‌ష్టం వంటివాటిని కూడా పేర్కొన్నారు. ఏపీ ఆక్వారంగాన్ని ఆదుకోవాలని,  అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా అగ్ర‌రాజ్యంతో కేంద్రం చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఆయ‌న విన్న‌వించారు.

రాష్ట్ర త‌ల‌స‌రి ఆదాయంలో ఆక్వా రంగం కీల‌కంగా ఉంద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం లో చిక్కుకునే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని.. దీని నుంచి బ‌య‌ట ప‌డేయ‌క‌పోతే.. ల‌క్ష‌లాది మంది ఉపా ధి కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని వివ‌రించారు. ఆక్వాపై 27 శాతం మేర‌కు(100కు 27 రూపాయ‌లు) సుంకాలు విధించ‌డం ద్వారా ఆక్వా కోలుకోలేని విధంగా దెబ్బ‌తింటుంద‌న్నారు. అధిక సుంకాల వల్ల ఏపీ ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక‌, ఆక్వా సాగు ఎలా ఉన్నా.. వీటి ఉత్ప‌త్తుల‌ను నిల్వ చేసుకునే స‌దుపాయాలు పెద్ద‌గా లేవ‌ని.. వీటికి కూడా కేంద్రం స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విన్న‌వించారు.

This post was last modified on April 6, 2025 11:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

36 minutes ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

1 hour ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

1 hour ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

2 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

3 hours ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

4 hours ago