ఏపీలో భారీ ఎత్తున జరిగిందని భావిస్తున్న మద్యం కుంభకోణంలో గురువార ఓ కీలక పరిణామం చోటుచేసుకోగా… ఆ మరునాడు శుక్రవారం కూడా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న నాటి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. మద్యం కుంభకోణంలో విచారణకు రావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను కొట్టి వేయాలంటూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గురువారం ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న మిథున్ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణకు చెందిన కసిరెడ్డి… జగన్ తో తనకున్న సంబంధాలతో వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ సలహాదారు పదవిని పొందారు. ప్రభుత్వ సలహాదారు పదవి ద్వారా చేయాల్సిన పనిని పక్కనపెట్టేసిన కసిరెడ్డి..మద్యంలో ఆదాయం ఎలా సాధించాలి? దానిని ఎలా జేబుల్లో వేసుకోవాలి? ఎలా దేశాలు దాటించాలి? మద్యం కంపెనీల నుంచి నిధులను ఎలా రాబట్టాలి? ఇలా మొత్తం మద్యం కుంభకోణానికి ప్లాన్ చేశారట. ఇందుకోసం ఆయన ఏకంగా ఓ ప్రత్యేక నెట్ వర్క్ నే ఏర్పాటు చేసి ఐధేళ్ల పాటు దానిని పకడ్బందీగా నిర్వహించారట.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారం దిగిపోగానే…మద్యం కుంభకోణం వెలుగు చూసింది. కసిరెడ్డి ప్లాన్ వేస్తే… ఆయన వెనకుండి వైసీపీ కీలక నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తతంగాన్ని నడిపించారట. ఈ విషయాలను అటు సీఐడీ అదికారులతో పాటు సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిలు బయటపెట్టారు. మద్యం కుంభకోణం మొత్తం కసిరెడ్డి చేతుల మీదుగానే జరిగిందని సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ సీఐడీ అదికారులు కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసులను కసిరెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. తనకు సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు…కసిరెడ్డి వాదనను తోసిపుచ్చింది. అంతేకాకుండా సీఐడీ అదికారులకు సహకరించాలని, విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచిస్తూ కసిరెడ్డి పిటిషన్ ను కొట్టేసింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని కూడా హైకోర్టు కసిరెడ్డికి తేల్చి చెప్పింది. ఫలితంగా సీఐడీ జారీ చేసిన నోటీసుల మేరకు కసిరెడ్డి విచారణకు హాజరుకాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి..
This post was last modified on April 4, 2025 4:16 pm
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…