ఏపీలో భారీ ఎత్తున జరిగిందని భావిస్తున్న మద్యం కుంభకోణంలో గురువార ఓ కీలక పరిణామం చోటుచేసుకోగా… ఆ మరునాడు శుక్రవారం కూడా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న నాటి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. మద్యం కుంభకోణంలో విచారణకు రావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను కొట్టి వేయాలంటూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గురువారం ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న మిథున్ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణకు చెందిన కసిరెడ్డి… జగన్ తో తనకున్న సంబంధాలతో వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ సలహాదారు పదవిని పొందారు. ప్రభుత్వ సలహాదారు పదవి ద్వారా చేయాల్సిన పనిని పక్కనపెట్టేసిన కసిరెడ్డి..మద్యంలో ఆదాయం ఎలా సాధించాలి? దానిని ఎలా జేబుల్లో వేసుకోవాలి? ఎలా దేశాలు దాటించాలి? మద్యం కంపెనీల నుంచి నిధులను ఎలా రాబట్టాలి? ఇలా మొత్తం మద్యం కుంభకోణానికి ప్లాన్ చేశారట. ఇందుకోసం ఆయన ఏకంగా ఓ ప్రత్యేక నెట్ వర్క్ నే ఏర్పాటు చేసి ఐధేళ్ల పాటు దానిని పకడ్బందీగా నిర్వహించారట.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారం దిగిపోగానే…మద్యం కుంభకోణం వెలుగు చూసింది. కసిరెడ్డి ప్లాన్ వేస్తే… ఆయన వెనకుండి వైసీపీ కీలక నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తతంగాన్ని నడిపించారట. ఈ విషయాలను అటు సీఐడీ అదికారులతో పాటు సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిలు బయటపెట్టారు. మద్యం కుంభకోణం మొత్తం కసిరెడ్డి చేతుల మీదుగానే జరిగిందని సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ సీఐడీ అదికారులు కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసులను కసిరెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. తనకు సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు…కసిరెడ్డి వాదనను తోసిపుచ్చింది. అంతేకాకుండా సీఐడీ అదికారులకు సహకరించాలని, విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచిస్తూ కసిరెడ్డి పిటిషన్ ను కొట్టేసింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని కూడా హైకోర్టు కసిరెడ్డికి తేల్చి చెప్పింది. ఫలితంగా సీఐడీ జారీ చేసిన నోటీసుల మేరకు కసిరెడ్డి విచారణకు హాజరుకాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి..
This post was last modified on April 4, 2025 4:16 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…