Political News

మిధున్ రెడ్డికి షాక్… బెయిల్ ఇవ్వలేమన్న హైకోర్టు

వైసీపీ కీలక నేత, లోక్ సభలో ఆ పార్టీ పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి గురువారం భారీ షాక్ తగిలింది. మద్యం కుంభకోణంలో తనను సీఐడీ పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఇప్పటికే ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను ముగించగా… తాజాగా గురువారం ఈ వ్యవహారంపై కోర్టు తన తుది తీర్పును వెలువరించింది. సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

ఢిల్లీలో ఆప్ సర్కారును కూల్చేసిన లిక్కర్ స్కాంను మించిన స్థాయిలో వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని, దీనికి కర్త, కర్మ, క్రియ అంతా మిథున్ రెడ్డేనని కూటమి పార్టీలకు చెందిన నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఏపీలో మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవమేనని మొన్నటిదాకా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించిన వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా ఇటీవలి సీఐడీ విచారణలో తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తాన్ని కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని కూడా ఆయన తెలిపారు. కసిరెడ్డి వెనుక మిథున్ రెడ్డి ఉన్నారని, మిథున్ రెడ్డి చెప్పినట్టే కసిరెడ్డి నడుచుకున్నారన్న దిశగా సీఐడీ అధికారులు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సీఐడీ విచారణను క్లోజ్ గా పరిశీలిస్తున్న మిథున్ రెడ్డి… తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును చాలా రోజుల క్రితమే ఆశ్రయించారు. మిథున్ రెడ్డి బెయిల్ పై ఇప్పటికే రెండు పర్యాయాలు విచారణ చేపట్టిన కోర్టు… సీఐడీ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంది. మిథున్ రెడ్డి వాదనల కంటే సీఐడీ వాదనలే బలంగా ఉన్నాయన్న భావనతో కోర్టు… మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తాజాగా తీర్పు చెప్పింది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదంటే… మిథున్ రెడ్డికి ఈ కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లుగా సీఐడీ ఆధారాలు చూపినట్లే కదా అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. దీంతో ఈ కేసులో మిథున్ రెడ్ది అరెస్టు ఖాయమేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

This post was last modified on April 3, 2025 3:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

39 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago