వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్ని నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించి ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా అరెస్టు తధ్యమని చెప్పిన ఆయన… ఏ క్షణంలో అయినా ఆమె అరెస్టు కావొచ్చంటూ ఆయన జోస్యం చెప్పారు. ఆడుదాం ఆంధ్రా పేరిట జరిగిన క్రీడా పోటీల్లో రోజా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న రవి నాయుడు.. ఈ వ్యవహారం నుంచి రోజాను ఎవరూ కాపాడలేరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ.119 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డ రోజా ఈ కేసు నుంచి తప్పించుకకోవడం దుస్సాధ్యమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆడుదాం ఆంధ్రాలో అసలు అవినీతే జరగలేదంటూ రోజా వివరణ ఇచ్చిన మరునాడే రవి నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన రోజా… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన రోజా… ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తాము నిబంధనలకు అనుగుణంగానే… పక్కా ప్రణాళికతోనే నిర్వహించామని తెలిపారు. అయినా ఈ వ్యవహారంలో ఏదో తప్పు జరిగిపోయిందంటూ టీడీపీ ఆరోపణలు చేయడం తగదని కూడా ఆమె అన్నారు. నాడు శాప్ చైర్మన్ గా ఉన్న యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇందులో పాత్ర లేదని, అయినా ఆయనను కూడా అరెస్టు చేస్తామంటూ కూటమి సర్కారు ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. అయినా అవినీతి జరిగితే కదా… ఎవరినైనా అరెస్టు చేసేది… అక్రమాలే జరగని ఆడుదాం ఆంధ్రాలో తనను అయినా, సిద్ధార్థ రెడ్డిని అయినా ఎలా అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించారు.
రోజా వ్యాఖ్యలు విన్నంతనే రవి నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్రాపై ఇప్పటికే తమ కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ విచారణ విషయం తెలిసినంతనే తీవ్ర భయాందోళనకు గురైన రోజా నెల రోజుల పాటుగా ఎక్కడో దాక్కున్నారని ఆయన ఆరోపించారు. అయితే జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిల సూచనతో ఆమె బుధవారం మీడియా ముందుకు వచ్చారన్నారు. ఈ సందర్భంగా ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరగలేదని రోజా చెబుతున్నా… తాను తప్పు చేశానని, తన అరెస్టు తప్పదన్న భయం ఆమె ముఖంలోనే స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఓ వైపు ఆడుదాం ఆంధ్రాపై విచారణ జరుగుతుంటే… తిరుమల దర్శనాల ద్వారా రోజా వెనకేసుకున్న నిధులపైనా విచారణ జరుగుతోందని, నగరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపైనా విచారణ జరుగుతోందని రవి నాయుడు అన్నారు. ఈ అన్నింటిలోనూ రోజా అరెస్టు కావడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.
This post was last modified on April 3, 2025 2:07 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…