Political News

అమరావతీ ఊపిరి పీల్చుకో.. డబ్బులొచ్చేశాయి

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని పురిట్లోనే చిదిమేయాలని వైసీపీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయని యత్నమంటూ లేదు. నాడు టీడీపీ సర్కారు ఎంపిక చేసిన అమరావతి తనకూ సమ్మతమేనని నమ్మ బలికిన జగన్… ఆ తర్వాత అమరావతికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపితే… నిలుస్తుందో, లేదో తెలియని అమరావతికి నిధులెలా ఇస్తారంటూ ఆ సంస్థకు ఫిర్యాదులు చేశారు. ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్లేలా చేశారు. ఇది జరిగింది 2018లో. అప్పటి నుంచి జగన్ అమరావతి చుట్టూ బిగిస్తున్న బంధనాలను తెంచుకుని దాదాపుగా ఆరేళ్లకు గానీ అమరావతి ప్రపంచ బ్యాంకు నిధులను అందుకోలేకపోయింది. వరల్డ్ బ్యాంకు నిధులు బుధవారం అమరావతి పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో చేరిపోయాయి.

అమరావతి నిర్మాణానికి కంకణబద్దులై సాగుతున్న టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏపీకి రెండో దఫా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినంతనే.. అమరావతికి నిధులు రాబట్టే పనిని ప్రారంభించారు. కేంద్రం వద్ద తనకున్న పరపతిని ఆయన ప్రయోగించారు. ఈ క్రమంలో వరల్డ్ బ్యాంకు రుణానికి గ్యారెంటీ ఇచ్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అంగీకరించింది. ఇంకేముంది… వరల్డ్ బ్యాంకు తనతో పాటు ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రతినిధులను వెంటేసుకుని అమరావతిలో పర్యటించింది. ఈ పర్యటన తర్వాత అమరావతి నిర్మాణానికి రూ.13 వేల కోట్ల మేర రుణాన్ని ఇచ్చేందుకు తాము సిద్ధమేనని తెలిపింది. అందులో సగాన్ని తాను, మిగిలిన సగాన్ని ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు ఇస్తుందని తెలిపింది. ఈ దశగా దశలవారీగా ఉన్న అనుమతుల ప్రక్రియను పూర్తి చేసింది.

ఇప్పటికే ఆ అనుమతుల జారీ ప్రక్రియ ముగిసిపోగా… తొలి విడత రుణ నిధుల విడుదల కింద బుధవారం రూ.3,535 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఈ పరిణామాన్ని అమరావతి నిర్మాణంలో కీలక అడుగుగానే పరిగణించాలి. ఎందుకంటే… అమరావతి నిరోధకుడిగా పరిణమించిన జగన్ సృష్టించిన ప్రతిబంధకాలను దాటుకుని మరీ అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు రావడానికి దీనిని తొలి మెట్టుగానే పరిగణిస్తున్నారు. ఇకపై ఏ అంతర్జాతీయ సంస్థ అమరావతికి వచ్చినా… తొలుత వరల్డ్ బ్యాంకు రాజధానికి నిధులు ఇచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకునే నిధుల విడుదలకు అక్కడికక్కడే సిద్ధపడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. వరల్డ్ బ్యాంకు తన తొలి విడత నిధులను విడుదల చేయగా… త్వరలోనే ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి కూడా తొలి విడత రుణ నిధులు విడుదల కానున్నాయి. వెరసి అమరావతికి ఇక నిధుల కొరత అన్నది రాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 3, 2025 3:10 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

6 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago