Political News

అమరావతీ ఊపిరి పీల్చుకో.. డబ్బులొచ్చేశాయి

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని పురిట్లోనే చిదిమేయాలని వైసీపీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయని యత్నమంటూ లేదు. నాడు టీడీపీ సర్కారు ఎంపిక చేసిన అమరావతి తనకూ సమ్మతమేనని నమ్మ బలికిన జగన్… ఆ తర్వాత అమరావతికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపితే… నిలుస్తుందో, లేదో తెలియని అమరావతికి నిధులెలా ఇస్తారంటూ ఆ సంస్థకు ఫిర్యాదులు చేశారు. ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్లేలా చేశారు. ఇది జరిగింది 2018లో. అప్పటి నుంచి జగన్ అమరావతి చుట్టూ బిగిస్తున్న బంధనాలను తెంచుకుని దాదాపుగా ఆరేళ్లకు గానీ అమరావతి ప్రపంచ బ్యాంకు నిధులను అందుకోలేకపోయింది. వరల్డ్ బ్యాంకు నిధులు బుధవారం అమరావతి పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో చేరిపోయాయి.

అమరావతి నిర్మాణానికి కంకణబద్దులై సాగుతున్న టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏపీకి రెండో దఫా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినంతనే.. అమరావతికి నిధులు రాబట్టే పనిని ప్రారంభించారు. కేంద్రం వద్ద తనకున్న పరపతిని ఆయన ప్రయోగించారు. ఈ క్రమంలో వరల్డ్ బ్యాంకు రుణానికి గ్యారెంటీ ఇచ్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అంగీకరించింది. ఇంకేముంది… వరల్డ్ బ్యాంకు తనతో పాటు ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రతినిధులను వెంటేసుకుని అమరావతిలో పర్యటించింది. ఈ పర్యటన తర్వాత అమరావతి నిర్మాణానికి రూ.13 వేల కోట్ల మేర రుణాన్ని ఇచ్చేందుకు తాము సిద్ధమేనని తెలిపింది. అందులో సగాన్ని తాను, మిగిలిన సగాన్ని ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు ఇస్తుందని తెలిపింది. ఈ దశగా దశలవారీగా ఉన్న అనుమతుల ప్రక్రియను పూర్తి చేసింది.

ఇప్పటికే ఆ అనుమతుల జారీ ప్రక్రియ ముగిసిపోగా… తొలి విడత రుణ నిధుల విడుదల కింద బుధవారం రూ.3,535 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఈ పరిణామాన్ని అమరావతి నిర్మాణంలో కీలక అడుగుగానే పరిగణించాలి. ఎందుకంటే… అమరావతి నిరోధకుడిగా పరిణమించిన జగన్ సృష్టించిన ప్రతిబంధకాలను దాటుకుని మరీ అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు రావడానికి దీనిని తొలి మెట్టుగానే పరిగణిస్తున్నారు. ఇకపై ఏ అంతర్జాతీయ సంస్థ అమరావతికి వచ్చినా… తొలుత వరల్డ్ బ్యాంకు రాజధానికి నిధులు ఇచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకునే నిధుల విడుదలకు అక్కడికక్కడే సిద్ధపడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. వరల్డ్ బ్యాంకు తన తొలి విడత నిధులను విడుదల చేయగా… త్వరలోనే ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి కూడా తొలి విడత రుణ నిధులు విడుదల కానున్నాయి. వెరసి అమరావతికి ఇక నిధుల కొరత అన్నది రాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

8 minutes ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

22 minutes ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

27 minutes ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

1 hour ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

1 hour ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

2 hours ago