కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు దిగువ సభ లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం లోక్ సభలో ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టగా.. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ చేపట్టారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓకే చెప్పగా… బిల్లుకు వ్యతిరేకంగా 232 మంది ఓటేశారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపినట్లు ఓం బిర్లా ప్రకటించారు.
చాలా రోజుల క్రితమే వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ప్రతిపాదించగా… అందులోని కొన్ని అంశాలపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయగా… బిల్లు సవరణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని కేంద్రం నియమించింది. ఈ క్రమంలో దఫ దఫాలుగా జేపీసీ భేటీలు నిర్వహించి…బిల్లుకు ఆయా పార్టీలు సూచించిన పలు మార్పులను అంగీకరించింది. ఇందులో టీడీపీ ప్రతిపాదించిన నాలుగు మార్పుల్లో మూడింటికి అనుమతి లభించగా… ఓ మార్పునకు ఆమోదం లభించలేదు.
వక్ఫ్ సవరణ బిల్లుకు అదికార పక్షానికి చెందిన ఎన్డీఏ పక్షాలన్నీ అనుకూలంగానే ఓటేశాయి. లోక్ సభలో ఎలాగూ ఎన్డీఏకు విస్పష్ట మెజారిటీ ఉన్న నేపథ్యంలో వక్ఫ్ బిల్లుకు ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. అయితే మొన్నటిదాకా ఎన్డీఏకు అనుకూలంగా సాగిన వైసీపీ… ఈ దఫా మాత్రం ఎన్డీఏకు వ్యతిరేకంగా సాగింది. వక్ఫ్ బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా ఓటేసింది. దీంతో బీజేపీకి ఆ పార్టీ వ్యతిరేకంగా తన ప్రయాణాన్ని ప్రారంభించినట్టైంది.
This post was last modified on April 3, 2025 10:05 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…