కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు దిగువ సభ లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం లోక్ సభలో ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టగా.. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ చేపట్టారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓకే చెప్పగా… బిల్లుకు వ్యతిరేకంగా 232 మంది ఓటేశారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపినట్లు ఓం బిర్లా ప్రకటించారు.
చాలా రోజుల క్రితమే వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ప్రతిపాదించగా… అందులోని కొన్ని అంశాలపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయగా… బిల్లు సవరణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని కేంద్రం నియమించింది. ఈ క్రమంలో దఫ దఫాలుగా జేపీసీ భేటీలు నిర్వహించి…బిల్లుకు ఆయా పార్టీలు సూచించిన పలు మార్పులను అంగీకరించింది. ఇందులో టీడీపీ ప్రతిపాదించిన నాలుగు మార్పుల్లో మూడింటికి అనుమతి లభించగా… ఓ మార్పునకు ఆమోదం లభించలేదు.
వక్ఫ్ సవరణ బిల్లుకు అదికార పక్షానికి చెందిన ఎన్డీఏ పక్షాలన్నీ అనుకూలంగానే ఓటేశాయి. లోక్ సభలో ఎలాగూ ఎన్డీఏకు విస్పష్ట మెజారిటీ ఉన్న నేపథ్యంలో వక్ఫ్ బిల్లుకు ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. అయితే మొన్నటిదాకా ఎన్డీఏకు అనుకూలంగా సాగిన వైసీపీ… ఈ దఫా మాత్రం ఎన్డీఏకు వ్యతిరేకంగా సాగింది. వక్ఫ్ బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా ఓటేసింది. దీంతో బీజేపీకి ఆ పార్టీ వ్యతిరేకంగా తన ప్రయాణాన్ని ప్రారంభించినట్టైంది.
This post was last modified on April 3, 2025 10:05 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…