నిజమే… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే… ఆ గ్రామాల పూర్తి స్వరూప స్వభావాలే సమూలంగా మారిపోతాయని చెప్పక తప్పదు. పవన్ సొంతూరు మొగల్తూరుతో పాటుగా దానికి సమీపంలోని పెనుగొండల్లో ఇప్పుడు అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. రెండు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు కోట్ల కొలది నిధులు మంజూరయ్యాయి. తాజాగా ఈ రెండు గ్రామాలను చెత్త సమస్య నుంచి అధికార యంత్రాంగం పూర్తిగా దూరం చేయనుంది.
మొగల్తూరు, పెనుగొండల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను ఎత్తివేసే కార్యక్రమం ఇప్పుడు ముమ్మరంగా సాగుతోంది. గురువారం సాయంత్రం నాటికే ఈ చెత్త తరలింపు కార్యక్రమం కూడా పూర్తి కానున్నట్లు సమాచారం. మొగల్తూరులో 9 ఏళ్లుగా 200 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. అదే సమయంలో పెనుగొండలో పదేళ్లుగా ఏకంగా 400 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఈ రెండు గ్రామాల్లో బుధవారం చెత్తను చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలకు తరలించే కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో స్థానిక అదికారులు తలమునకలై ఉన్నారు. ఈ చెత్త తరలింపు పూర్తి కాగానే…చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమంతో పాటుగా స్థానికంగానే చెత్త సేకరణ, శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు సాగుతున్నాయి.
ఈ రెండు గ్రామాలకు పవన్ కల్యాణ్ స్వయంగా సందర్శించలేదు. అలాగని వాటి గురించి ఆయనకు తెలియనిదేమీ కాదు. తన యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి పంపిన పవన్… ఆ రెండు గ్రామాల్లోని సమస్యలను వెలికి తీయించారు. ఇందులో భాగంగా రెండు గ్రామాల్లోని ఉన్నత పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలుసుకుని… విద్యా శాఖ మంత్రిగా ఉన్న లోకేశ్ తో మాట్లాడి… పెనుగోండ స్కూల్ కు రూ.2.05 కోట్లు, మొగల్తూరు స్కూల్ కు రూ.1.71 కోట్లను మంజూరు చేయించారు. ఈ నిధులు అందేలోగానే అక్కడ చేయాల్సిన పనులకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఆ పనులను అలా కొనసాగిస్తూనే…గ్రామాలను చెత్త నుంచి విముక్తి చేసే పనులకు శ్రీకారం చుట్టారు. సమీప భవిష్యత్తులోనే ఈ రెండు గ్రామాలు రాష్ట్రంలోనే మోడల్ గ్రామాలుగా అభివృద్ది చెందడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on April 2, 2025 10:08 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…