ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. P-4 అంటూ సరికొత్త మోసానికి చంద్రబాబు తెరతీశారని జగన్ ఆరోపించారు. సూపర్-6…లేదు సూపర్-7 లేదని, హామీలు అమలు చేయకుండా తమ తప్పును కప్పిబుచ్చుకునేందుకు ఇలా పీ-4 అంటూ కొత్త కార్యక్రమాలకు తెర తీస్తున్నారని విమర్శలు గుప్పించారు.
హామీల అమలు చేయకపోగా వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాష్ట్రం అప్పుల పాలైందని కుంటి సాకులు చెబుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేందుకే అప్పులపై అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలో వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ తరఫున ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, బెదిరింపులకు దిగినా వైసీపీ మెజారిటీ సీట్లు సాధించిందని, అందుకు కారణమైన పార్టీ కేడర్ కు సెల్యూట్ అని జగన్ అన్నారు. గెలిచేందుకు సరిపడినన్ని స్థానాలు లేకున్నా టీడీపీ దౌర్జన్యంగా గెలిచే ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. కుప్పంలో కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటించుకున్నారని ఆరోపించారు. 50 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 39 స్థానాలు వైసీపీ గెలిచిందన్నారు. పోలీసుల అండతో భయాందోళనలకు గురి చేసి ఉప ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ చూసిందని జగన్ ఆరోపించారు. ప్రజల్లో ఎప్పుడూ లేని వ్యతిరేకత కనిపిస్తోందని, హామీల అమలుపై టీడీపీని వారు నిలదీస్తున్నారని చెప్పారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కోవిడ్ తో పాటు పలు కారణాలతో కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోయానని జగన్ అంగీకరించారు. ఇకపై జగన్ 2.0 చూస్తారని, కార్యకర్తలతో మమేకమై వారికి అండగా నిలిచేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నానని జగన్ హామీనిచ్చారు. ఏ ఒక్క వైసీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా పార్టీ అండగా నిలుస్తుందని ప్రకటించారు.
This post was last modified on April 2, 2025 7:24 pm
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…