Political News

రాప్తాడుకు త్వరలో వస్తా: వైఎస్ జగన్

వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మరో కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. టీడీపీకి కంచుకోటగానే కాకుండా టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అడ్డాగా పేరున్న రాప్తాడులో ఆయన త్వరలోనే పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని మంగళవారం స్వయంగా జగనే వెల్లడించారు. త్వరలోనే రాప్తాడు వస్తానని… రాప్తాడు మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవలే మరణించిన పార్టీ కార్యకర్త లింగమయ్య కుమారుడితో జగన్ చెప్పారు. వచ్చే మంగళవారం ఈ పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాప్తాడు ఎమ్మెల్యేగా ప్రస్తుతం పరిటాల రవీంద్ర సతీమణి, మాజీ మంత్రి పరిటాల సునీత కొనసాగుతున్నారు. ఇక వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గత ఐదేళ్లుగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఓ రేంజిలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఎంపీపీ పదవిని దక్కించుకునే నిమిత్తం వైసీపీకి చెందిన ఎంపీటీసీలను తమ వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ విఫల యత్నాలు చేసిందని తోపుదుర్తి ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణులపైకి తోపుదుర్తి దూసుకువెళ్లిన వీడియోలు ఇటీవల పెను కలకలమే రేపాయి.

ఈ గొడవల నేపథ్యంలోనే పాపిరెడ్డిపల్లికి చెందిన లింగమయ్యపై దాడి జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లింగమయ్య ఆ తర్వాత చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ దాడి చేసింది టీడీపీ నేతలేనని, పరిటాల శ్రీరామ్ చిన్నాన్న కుటుంబమే స్వయంగా ఈ దాడిలో పాలుపంచుకుందని తోపుదుర్తి ఆరోపిస్తున్నారు. అయితే ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తాజాగా మంగళవారం సునీత ఓ బహిరంగ ప్రకటన చేశారు. కుటుంబతగాదాల నేపథ్యంలో లింగమయ్యపై దాడి జరిగితే..తోపుదుర్తి కావాలనే దానికి రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే…లింగమయ్యపై జరిగిన దాడి టీడీపీ పనేనని సోమవారం జగన్ ఆరోపిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా మంగళవారం ఉదయం ఆయన నేరుగా లింగమయ్య కుమారుడికి ఫోన్ చేసి పరామర్శించారు. లింగమయ్య మృతి బాధాకరమన్న జగన్.. మీకు అండగా ఉంటాయని ఆయన కుమారుడికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణ హానీ ఉందని బాధితుడు తెలపగా… త్వరలోనే తానే స్వయంగా వస్తానని, భయపడాల్సిన అవసరం లేదని, అందరం అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కాల్ తర్వాత రాప్తాడుకు జగన్ వస్తున్న విషయాన్ని తోపుదుర్తి కూడా ధ్రువీకరించారు.

This post was last modified on April 1, 2025 12:21 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

42 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

53 minutes ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

1 hour ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago