Political News

రాప్తాడుకు త్వరలో వస్తా: వైఎస్ జగన్

వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మరో కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. టీడీపీకి కంచుకోటగానే కాకుండా టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అడ్డాగా పేరున్న రాప్తాడులో ఆయన త్వరలోనే పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని మంగళవారం స్వయంగా జగనే వెల్లడించారు. త్వరలోనే రాప్తాడు వస్తానని… రాప్తాడు మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవలే మరణించిన పార్టీ కార్యకర్త లింగమయ్య కుమారుడితో జగన్ చెప్పారు. వచ్చే మంగళవారం ఈ పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాప్తాడు ఎమ్మెల్యేగా ప్రస్తుతం పరిటాల రవీంద్ర సతీమణి, మాజీ మంత్రి పరిటాల సునీత కొనసాగుతున్నారు. ఇక వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గత ఐదేళ్లుగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఓ రేంజిలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఎంపీపీ పదవిని దక్కించుకునే నిమిత్తం వైసీపీకి చెందిన ఎంపీటీసీలను తమ వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ విఫల యత్నాలు చేసిందని తోపుదుర్తి ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణులపైకి తోపుదుర్తి దూసుకువెళ్లిన వీడియోలు ఇటీవల పెను కలకలమే రేపాయి.

ఈ గొడవల నేపథ్యంలోనే పాపిరెడ్డిపల్లికి చెందిన లింగమయ్యపై దాడి జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లింగమయ్య ఆ తర్వాత చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ దాడి చేసింది టీడీపీ నేతలేనని, పరిటాల శ్రీరామ్ చిన్నాన్న కుటుంబమే స్వయంగా ఈ దాడిలో పాలుపంచుకుందని తోపుదుర్తి ఆరోపిస్తున్నారు. అయితే ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తాజాగా మంగళవారం సునీత ఓ బహిరంగ ప్రకటన చేశారు. కుటుంబతగాదాల నేపథ్యంలో లింగమయ్యపై దాడి జరిగితే..తోపుదుర్తి కావాలనే దానికి రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే…లింగమయ్యపై జరిగిన దాడి టీడీపీ పనేనని సోమవారం జగన్ ఆరోపిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా మంగళవారం ఉదయం ఆయన నేరుగా లింగమయ్య కుమారుడికి ఫోన్ చేసి పరామర్శించారు. లింగమయ్య మృతి బాధాకరమన్న జగన్.. మీకు అండగా ఉంటాయని ఆయన కుమారుడికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణ హానీ ఉందని బాధితుడు తెలపగా… త్వరలోనే తానే స్వయంగా వస్తానని, భయపడాల్సిన అవసరం లేదని, అందరం అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కాల్ తర్వాత రాప్తాడుకు జగన్ వస్తున్న విషయాన్ని తోపుదుర్తి కూడా ధ్రువీకరించారు.

This post was last modified on April 1, 2025 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

28 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago