రాజకీయాలు.. రాజకీయ నేతలు అన్నంతనే ఒకలాంటి భావన మనసులో ఉంటుంది. అయితే.. కొందరు నేతలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం గౌరవాన్ని ఇవ్వటం.. తొందరపడి మాట అనే సాహసం చేసే అపురూప వ్యక్తిత్వం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు సొంతం. తెలుగు రాజకీయాల్లో అసమాన్య వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నేతల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారన్న సంగతి తెలిసిందే. సాధారణంగా తాను రాజకీయంగా బలంగా ఉండే ప్రాంతంలో ఇంకెవరైనా ఎదుగుతున్నా
రంటే ఒకలాంటి ఉడుకుమోతుతనాన్ని ప్రదర్శించటం.. వారితో వైరం సాగుతుంది.
అందుకు భిన్నంగా ఉంటుంది అశోక్ గజపతిరాజు వ్యవహారం. తాను ఉండే విజయనగరం లోక్ సభా స్థానానికి ఎంపీగా వ్యవహరిస్తున్న టీడీపీనేత అప్పలనాయుడి విషయంలో ఆయన ప్రదర్శించిన ఉదారత.. పెద్ద మనసు గురించి తెలిస్తే ఆయన మీద గౌరవం రెట్టింపు కాక మానదు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడికి అశోక్ గజపతిరాజు తాజాగా ఒక అపురూపమైన బహుమతిని ఇచ్చారు. దాదాపు 20 ఏళ్ల క్రితం పలువురు కార్యకర్తలు తనకు ఇచ్చిన ఒక సైకిల్ ను ఆయనకు ఇచ్చారు.
పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లే ఎంపీగా గుర్తింపు పొందిన కలిశెట్టి.. తాను ప్రాతినిధ్యం వహించే టీడీపీ మీద ఉన్న అభిమానం కారణంగా.. పసుపురంగు సైకిల్ మీద రాకపోకలు సాగిస్తూ ఉంటారు. తాజాగా ఆయనకు అశోక్ గజపతి రాజు సైకిల్ ను బహుకరించారు. స్థానికంగా తిరిగేందుకు ఈ సైకిల్ వినియోగించేందుకు వీలుగా ఉండనుంది. నిజానికి ఈ సైకిల్ మీదనే అప్పట్లో అశోక్ గజపతి రాజు తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోని భాగమైన మన్యంతో పాటు చీపురుపల్లి ప్రాంతాల్లో పర్యటించేవారు. ఇప్పుడు ఆ సైకిల్ ను అప్పలనాయుడికి బహుమతిగా ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
This post was last modified on April 1, 2025 9:57 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…