Political News

కాకాణికి ఖాకీల నోటీసులు!… రేపు ఎంక్వైరీకి వస్తారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. కాకాణి సొంత జిల్లా నెల్లూరు పరిధిలో అక్రమ మైనింగ్ జరిగిందన్న ఆరోపణలపై గతంలోనే ఓ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితులంతా కాకాణి అనుచరులే ఉండగా… తాజాగా కాకాణికి కూడా ఈ కేసులో ప్రమేయం ఉందన్న ఆధారాలతో పోలీసులు ఆయన పేరును ఏ4 గా చేర్చారు.

ఈ క్రమంలో విచారణకు రావాలంటూ కాకాణికి పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన ఈ నోటీసులను తీసుకోలేదు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నా అడ్రెస్ లేకుండాపోయారు. దీంతో కాకాణి ఆచూకి కోసం పోలీసులు వేట మొదలుపెట్టి…ఎట్టకేలకు ఆయనకు సోమవారం నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

అక్రమ మైనింగ్ కేసులో విచారణకు రావాలని కోరుతూ ఆదివారం కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే ఇంటికి తాళం వేసి ఉండటం.. ఫోన్ చేయగా కాకాణి మొబైల్ స్వీచ్ఛాఫ్ అని రావడంతో ఆయన ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. అయితే సోమవారం నిర్దేశిత సమయం ముగిసినా కాకాణి అడ్రెస్ కనిపించలేదు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాకాణి కోసం ఆరా తీశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరులో కాకుండా హైదరాబాద్ లో ఉన్నారన్న సమాచారంతో నెల్లూరు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా కాకాణి ఆచూకీని పోలీసులు గుర్తించారు. సోమవారం ఎలాగూ విచారణకు రాలేదు కదా… కనీసం మంగళవారమైనా విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు రాకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వారు ఆయనను హెచ్చరించారు.

అయితే విచారణకు వెళితే… ఎక్కడ తనను అరెస్టు చేస్తారోనన్న భయంతో కాకాణి పోలీసులకు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లుగా వార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో మాజీ మంత్రి పేర్ని నాని బెయిల్ వచ్చేదాకా ఎలాగైతే తప్పించుకుని తిరిగారో… ఇప్పుడు కాకాణి కూడా అదే రీతిన వ్యవహరిస్తున్నారన్న వాదనలూ లేకపోలేదు. ఇప్పటికే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కాకాణి హైకోర్టును ఆశ్రయించగా… ఆయన పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. దీంతో తన బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టి.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యేదాకా పోలీసులకు కనిపించకూడదన్న భావనతో కాకాణి తిరుగుతున్నట్లుగా సమాచారం.

అయితే కాకాణి ఆచూకీని ఎట్టకేలకు పట్టేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలంటే నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా విచారణకు హాజరుకాని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఆయనకు పోలీసులు ఒకింత సీరియస్ వార్నింగే ఇచ్చినట్లు సమాచారం. మరి మంగళవారం నాటి విచారణకు కాకాణి హాజరవుతారా? లేదా? అన్న దానిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on March 31, 2025 1:21 pm

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

23 minutes ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

3 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

3 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

3 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

4 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

4 hours ago