వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. కాకాణి సొంత జిల్లా నెల్లూరు పరిధిలో అక్రమ మైనింగ్ జరిగిందన్న ఆరోపణలపై గతంలోనే ఓ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితులంతా కాకాణి అనుచరులే ఉండగా… తాజాగా కాకాణికి కూడా ఈ కేసులో ప్రమేయం ఉందన్న ఆధారాలతో పోలీసులు ఆయన పేరును ఏ4 గా చేర్చారు.
ఈ క్రమంలో విచారణకు రావాలంటూ కాకాణికి పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన ఈ నోటీసులను తీసుకోలేదు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నా అడ్రెస్ లేకుండాపోయారు. దీంతో కాకాణి ఆచూకి కోసం పోలీసులు వేట మొదలుపెట్టి…ఎట్టకేలకు ఆయనకు సోమవారం నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
అక్రమ మైనింగ్ కేసులో విచారణకు రావాలని కోరుతూ ఆదివారం కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే ఇంటికి తాళం వేసి ఉండటం.. ఫోన్ చేయగా కాకాణి మొబైల్ స్వీచ్ఛాఫ్ అని రావడంతో ఆయన ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. అయితే సోమవారం నిర్దేశిత సమయం ముగిసినా కాకాణి అడ్రెస్ కనిపించలేదు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాకాణి కోసం ఆరా తీశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరులో కాకుండా హైదరాబాద్ లో ఉన్నారన్న సమాచారంతో నెల్లూరు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా కాకాణి ఆచూకీని పోలీసులు గుర్తించారు. సోమవారం ఎలాగూ విచారణకు రాలేదు కదా… కనీసం మంగళవారమైనా విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు రాకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వారు ఆయనను హెచ్చరించారు.
అయితే విచారణకు వెళితే… ఎక్కడ తనను అరెస్టు చేస్తారోనన్న భయంతో కాకాణి పోలీసులకు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లుగా వార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో మాజీ మంత్రి పేర్ని నాని బెయిల్ వచ్చేదాకా ఎలాగైతే తప్పించుకుని తిరిగారో… ఇప్పుడు కాకాణి కూడా అదే రీతిన వ్యవహరిస్తున్నారన్న వాదనలూ లేకపోలేదు. ఇప్పటికే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కాకాణి హైకోర్టును ఆశ్రయించగా… ఆయన పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. దీంతో తన బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టి.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యేదాకా పోలీసులకు కనిపించకూడదన్న భావనతో కాకాణి తిరుగుతున్నట్లుగా సమాచారం.
అయితే కాకాణి ఆచూకీని ఎట్టకేలకు పట్టేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలంటే నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా విచారణకు హాజరుకాని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఆయనకు పోలీసులు ఒకింత సీరియస్ వార్నింగే ఇచ్చినట్లు సమాచారం. మరి మంగళవారం నాటి విచారణకు కాకాణి హాజరవుతారా? లేదా? అన్న దానిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on March 31, 2025 1:21 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…