Political News

కాకాణికి ఖాకీల నోటీసులు!… రేపు ఎంక్వైరీకి వస్తారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. కాకాణి సొంత జిల్లా నెల్లూరు పరిధిలో అక్రమ మైనింగ్ జరిగిందన్న ఆరోపణలపై గతంలోనే ఓ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితులంతా కాకాణి అనుచరులే ఉండగా… తాజాగా కాకాణికి కూడా ఈ కేసులో ప్రమేయం ఉందన్న ఆధారాలతో పోలీసులు ఆయన పేరును ఏ4 గా చేర్చారు.

ఈ క్రమంలో విచారణకు రావాలంటూ కాకాణికి పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన ఈ నోటీసులను తీసుకోలేదు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నా అడ్రెస్ లేకుండాపోయారు. దీంతో కాకాణి ఆచూకి కోసం పోలీసులు వేట మొదలుపెట్టి…ఎట్టకేలకు ఆయనకు సోమవారం నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

అక్రమ మైనింగ్ కేసులో విచారణకు రావాలని కోరుతూ ఆదివారం కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే ఇంటికి తాళం వేసి ఉండటం.. ఫోన్ చేయగా కాకాణి మొబైల్ స్వీచ్ఛాఫ్ అని రావడంతో ఆయన ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. అయితే సోమవారం నిర్దేశిత సమయం ముగిసినా కాకాణి అడ్రెస్ కనిపించలేదు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాకాణి కోసం ఆరా తీశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరులో కాకుండా హైదరాబాద్ లో ఉన్నారన్న సమాచారంతో నెల్లూరు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా కాకాణి ఆచూకీని పోలీసులు గుర్తించారు. సోమవారం ఎలాగూ విచారణకు రాలేదు కదా… కనీసం మంగళవారమైనా విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు రాకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వారు ఆయనను హెచ్చరించారు.

అయితే విచారణకు వెళితే… ఎక్కడ తనను అరెస్టు చేస్తారోనన్న భయంతో కాకాణి పోలీసులకు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లుగా వార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో మాజీ మంత్రి పేర్ని నాని బెయిల్ వచ్చేదాకా ఎలాగైతే తప్పించుకుని తిరిగారో… ఇప్పుడు కాకాణి కూడా అదే రీతిన వ్యవహరిస్తున్నారన్న వాదనలూ లేకపోలేదు. ఇప్పటికే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కాకాణి హైకోర్టును ఆశ్రయించగా… ఆయన పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. దీంతో తన బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టి.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యేదాకా పోలీసులకు కనిపించకూడదన్న భావనతో కాకాణి తిరుగుతున్నట్లుగా సమాచారం.

అయితే కాకాణి ఆచూకీని ఎట్టకేలకు పట్టేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలంటే నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా విచారణకు హాజరుకాని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఆయనకు పోలీసులు ఒకింత సీరియస్ వార్నింగే ఇచ్చినట్లు సమాచారం. మరి మంగళవారం నాటి విచారణకు కాకాణి హాజరవుతారా? లేదా? అన్న దానిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on March 31, 2025 1:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

26 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago