Political News

బంగారు కుటుంబాల‌ను ఎంపిక చేసిన చంద్ర‌బాబు.. వారికి పండ‌గే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పీ-4 విధానాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఇరువురుక‌లిసి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ప‌బ్లిక్‌-ప్రైవేటు-ప‌బ్లిక్ – పార్ట‌న‌ర్‌షిప్‌గా పేర్కొనే పీ-4 ద్వారా పేద‌రికాన్ని నిర్మూలించాల‌న్న ల‌క్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ విధానంలో స‌మాజంలోని ఉన్న‌త వ‌ర్గాలు.. పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకుని.. వారిని అన్ని విధాలా పైకి తీసుకురావాల‌ని ఆయ‌న సూచించారు. ఈ కార్యక్ర‌మంలో రెండు ల‌బ్ది పొందే కుటుంబాల‌ను చంద్ర‌బాబు ఎంపిక చేశారు.

వీరిలో మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబం, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయెల్‌ కుటుంబాన్ని పీ-4 విధానానికి తొలిగా ఎంపిక చేశారు. వీరిని బంగారు కుటుంబాలుగా పేర్కొన్న చంద్ర‌బాబు.. వీరిని ద‌త్త‌త తీసుకునేందుకు త్వ‌ర‌లోనే మార్గ‌ద‌ర్శ‌కుల‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్టు చెప్పారు. పేద‌ల‌కు సాయం చేసే ఉన్న‌త కుటుంబాల‌ను మార్గ‌ద‌ర్శ‌కులుగా పేర్కొన్నారు. వీరు నిస్వార్థంగా పేద‌ల కుటుంబాల‌ను ఆదుకుంటార‌ని.. అన్ని విధాలా వారిని పైకి తీసుకువ‌స్తార‌ని చెప్పారు.

ఇక‌, ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు త‌న విజ‌న్‌ను ఆవిష్క‌రించారు. సుమారు గంటా 20 నిమిషాల సేపు మాట్లాడిన చంద్ర‌బాబు పేద‌రికం బాధేంటో త‌న‌కు తెలుసున‌ని చెప్పారు. 1995 నుంచి కూడా పేద‌రికాన్ని నిర్మూలించాల‌న్న సంక‌ల్పంతో తాను అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. ఇప్పుడు చేప‌ట్టిన పీ-4 కార్య‌క్ర‌మం.. మ‌హోన్న‌త‌మైంద‌న్నారు. ఇది స‌క్సెస్ చేయాల ని.. అధికారులు, ప్ర‌భుత్వ సిబ్బందికి చెప్పిన‌ట్టు తెలిపారు. దీనిని స‌క్సెస్ చేయ‌డం ద్వారా వ‌చ్చే నాలుగేళ్ల‌లో రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేస్తామ‌ని చెప్పారు. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించామ‌న్నారు.

అదే నా కోరిక‌!

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పుకొచ్చారు. పేద‌లు లేని స‌మాజ స్థాప‌నే త‌న కోరిక అని తెలిపారు. తాను అనేక ప‌ద‌వులు అనుభవించాన‌ని.. అధికారంపై వ్యామోహం లేద‌న్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల‌న్న త‌ప‌న‌తోనే కూట‌మి క‌ట్టి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువ చ్చామ‌ని.. ప్ర‌జ‌లు కూడా అర్ధం చేసుకుని భారీ విజ‌యం అందించార‌ని తెలిపారు. ఇప్పుడు స‌మాజాన్ని బాగు చేయ‌డ‌మే త‌న కోరిక‌ని తెలిపారు. “నేను ఏ తప్పూ చేయలేదు.. భవిష్యత్‌లో చేయను. పని చేయడం తప్ప నాకు మరేమీ తెలియదు. 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా జీవించా.” అని చంద్ర‌బాబు ఉద్ఘాటించారు.

This post was last modified on March 31, 2025 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

53 minutes ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

60 minutes ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

1 hour ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

2 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

2 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

4 hours ago