తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ఆదివారం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ చేపట్టారన్న ఆరోపణలపై కాకాణిపై పోలీసులు ఇటీవలే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది పాత కేసే అయినప్పటికీ… కాకాణి ప్రమేయాన్నికూడా నిర్ధారించుకున్న పోలీసులు ఆయన పేరును తాజాగా ఈ కేసులో జత చేశారు. ఈ కేసులో సోమవారం విచారణకు రావాలంటూ పోలీసులు ఉగాది రోజున ఆయనకు నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నోటీసులు తీసుకుని తన ఇంటికి వస్తున్నారన్న సమాచారం అందుకున్న కాకాణి… పోలీసులు వచ్చేలోగానే తన ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారట. తీరా పోలీసులు అక్కడికి వచ్చేసరికి కాకాణి ఇంటికి తాళం ఉండటం చూసి పోలీసులు షాక్ తిన్నారట. అయితే ఫోన్ చేసి చూద్దామన్న భావనతో ఆయన మొబైైల్ కు ఫోన్ చేయగా… అది స్విచ్చాఫ్ అని వచ్చిందట. ఆ తర్వాత కాకాణి పీఏకు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అనే సందేశమే వచ్చిందట.
దీంతో కాసేపు అక్కడే వేచి చూసిన పోలీసులు… కాకాణికి అందించేందుకు తీసుకువచ్చిన నోటీసులను కాకాణి ఇంటి గేటుకు అంటించారట. ఈ నోటీసుల ప్రకారం అక్రమ మైనింగ్ కేసులో సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరులోని డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు కాకాణి హాజరుకావాల్సి ఉందట. మరి నోటీసులు తీసుకునేందుకే వెనుకాడిన కాకాణి.. సోమవారం విచారణకు హాజరవుతారా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని మొన్నటికి మొన్న ఒకింత ఘనంగానే ప్రకటన చేసిన కాకాణి…ఒక్క కేసు నోటీసులు తీసుకునేందుకే ఇలా జడుసుకున్నామేరిటీ? అన్న దిశగా టీడీపీ శ్రేణుల నుంచి సెటర్డు పడిపోతున్నాయి.
This post was last modified on March 31, 2025 7:12 am
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…