తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ఆదివారం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ చేపట్టారన్న ఆరోపణలపై కాకాణిపై పోలీసులు ఇటీవలే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది పాత కేసే అయినప్పటికీ… కాకాణి ప్రమేయాన్నికూడా నిర్ధారించుకున్న పోలీసులు ఆయన పేరును తాజాగా ఈ కేసులో జత చేశారు. ఈ కేసులో సోమవారం విచారణకు రావాలంటూ పోలీసులు ఉగాది రోజున ఆయనకు నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నోటీసులు తీసుకుని తన ఇంటికి వస్తున్నారన్న సమాచారం అందుకున్న కాకాణి… పోలీసులు వచ్చేలోగానే తన ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారట. తీరా పోలీసులు అక్కడికి వచ్చేసరికి కాకాణి ఇంటికి తాళం ఉండటం చూసి పోలీసులు షాక్ తిన్నారట. అయితే ఫోన్ చేసి చూద్దామన్న భావనతో ఆయన మొబైైల్ కు ఫోన్ చేయగా… అది స్విచ్చాఫ్ అని వచ్చిందట. ఆ తర్వాత కాకాణి పీఏకు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అనే సందేశమే వచ్చిందట.
దీంతో కాసేపు అక్కడే వేచి చూసిన పోలీసులు… కాకాణికి అందించేందుకు తీసుకువచ్చిన నోటీసులను కాకాణి ఇంటి గేటుకు అంటించారట. ఈ నోటీసుల ప్రకారం అక్రమ మైనింగ్ కేసులో సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరులోని డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు కాకాణి హాజరుకావాల్సి ఉందట. మరి నోటీసులు తీసుకునేందుకే వెనుకాడిన కాకాణి.. సోమవారం విచారణకు హాజరవుతారా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని మొన్నటికి మొన్న ఒకింత ఘనంగానే ప్రకటన చేసిన కాకాణి…ఒక్క కేసు నోటీసులు తీసుకునేందుకే ఇలా జడుసుకున్నామేరిటీ? అన్న దిశగా టీడీపీ శ్రేణుల నుంచి సెటర్డు పడిపోతున్నాయి.
This post was last modified on March 31, 2025 7:12 am
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…