తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ఆదివారం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ చేపట్టారన్న ఆరోపణలపై కాకాణిపై పోలీసులు ఇటీవలే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది పాత కేసే అయినప్పటికీ… కాకాణి ప్రమేయాన్నికూడా నిర్ధారించుకున్న పోలీసులు ఆయన పేరును తాజాగా ఈ కేసులో జత చేశారు. ఈ కేసులో సోమవారం విచారణకు రావాలంటూ పోలీసులు ఉగాది రోజున ఆయనకు నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నోటీసులు తీసుకుని తన ఇంటికి వస్తున్నారన్న సమాచారం అందుకున్న కాకాణి… పోలీసులు వచ్చేలోగానే తన ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారట. తీరా పోలీసులు అక్కడికి వచ్చేసరికి కాకాణి ఇంటికి తాళం ఉండటం చూసి పోలీసులు షాక్ తిన్నారట. అయితే ఫోన్ చేసి చూద్దామన్న భావనతో ఆయన మొబైైల్ కు ఫోన్ చేయగా… అది స్విచ్చాఫ్ అని వచ్చిందట. ఆ తర్వాత కాకాణి పీఏకు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అనే సందేశమే వచ్చిందట.
దీంతో కాసేపు అక్కడే వేచి చూసిన పోలీసులు… కాకాణికి అందించేందుకు తీసుకువచ్చిన నోటీసులను కాకాణి ఇంటి గేటుకు అంటించారట. ఈ నోటీసుల ప్రకారం అక్రమ మైనింగ్ కేసులో సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరులోని డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు కాకాణి హాజరుకావాల్సి ఉందట. మరి నోటీసులు తీసుకునేందుకే వెనుకాడిన కాకాణి.. సోమవారం విచారణకు హాజరవుతారా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని మొన్నటికి మొన్న ఒకింత ఘనంగానే ప్రకటన చేసిన కాకాణి…ఒక్క కేసు నోటీసులు తీసుకునేందుకే ఇలా జడుసుకున్నామేరిటీ? అన్న దిశగా టీడీపీ శ్రేణుల నుంచి సెటర్డు పడిపోతున్నాయి.
This post was last modified on March 31, 2025 7:12 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…