ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం విశాఖను ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా చేస్తారన్న ప్రచారం సాగేది. అంతేనా…రిషికొండ ను తొలిచి మరీ వందల కోట్ల నిధులు ఖర్చు పెట్టి అధునాతన సౌకర్యాలతో కూడిన రాజమహల్ లాంటి భవనాన్ని కూడా జగన్ సర్కారు నిర్మించింది. గతంలో మాట ఎలా ఉన్నా… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తిరిగి గెలిచి ఉంటే మాత్రం జగన్ ఈ రాజ మహల్ నుంచే పాలన సాగించేవారు. రాజధానిగా మారుతుందన్న వాదనలు ఉన్నప్పుడు కూడా విశాఖలో పెద్దగా రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిన దాఖలా లేదనే చెప్పాలి. కాని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత… రాజధానిగా మారే అవకాశం విశాఖకు లేదని తెలిసిన తర్వాత విశాఖలో రియల్ దరలు ఆకాశాన్నంటేశాయి.
విశాఖ నగరంలో రియల్ ధరలు నిజంగానే సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిపోయాయి. పోనీ నగర శివారులో ఇల్లు కొందామన్నా కూడా అక్కడి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఎప్పుడైతే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం మొదలైందో విశాఖ చుట్టుపక్కల పరిధిలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. అదే సమయంలో పెద్ద ఎత్తున సాగు భూములు, నిరుపయోగంగా ఉన్న భూములన్నీ రెసిడెన్షియల్, కమర్షియల్ అపార్ట్మెంట్లుగా మారిపోతున్నాయి. ఈ తరహా కార్యకలాపాలు విశాఖ నలుదిక్కులా జెట్ స్పీడుతో జరుగు తున్నాయి. వెరసి విశాఖకు ఏ దిక్కున వెళ్లి ఇల్లు కొనాలన్నా…ధరలు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం విశాఖకు ఓ చివర ఉన్న యారాడలో ఓ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ కొనాలంటే ఏకంగా రూ.2 కోట్ల మేర పెడితే తప్పించి ఇల్లు దొరకడం లేదట. కూటమి సర్కారు అదికారంలోకి రాకముందు ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇల్లు రూ.1.2 కోట్లకు లభిస్తే… అదే ఇల్లు ఇప్పుడు ఏకంగా రూ.1.9 కోట్లకు పెరిగిందట. అంటే… ఈ 10 నెలల కాలంలోనే దాదాపు గా 50 శాతం మేర ధరలు పెరిగాయి. ఇక ఇప్పటి సరకొత కల్చర్ అయిన విల్లాల విషయానికి వస్తే… విశాఖకు ఏ మూల వెళ్లినా హీనపక్షం రూ.6 కోట్లు పెడితే తప్పించి విల్లా దొరకడం లేదట. ఈ ధరలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలకు థీటుగా ఉన్నాయన్న మాట కూడా వినిపిస్తోంది. కోకాపేట లాంటి ప్రాంతంలో రూ.6 కోట్ల కంటే తక్కువకే విల్లా దొరుకు తుంటే… అదే విశాఖలో మాత్రం నగర శివారులోనూ ఆ ధరకు విల్లా దొరకడం లేదు. వెరసి అతి త్వరలోనే రియల్ రంగంలో హైదరాబాద్ ను దాటేసి విశాఖ దూసుకెళ్లిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 30, 2025 4:12 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…