Political News

రాజధాని లేకున్నా… విశాఖలో ‘రియల్’ బూమ్

ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం విశాఖను ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా చేస్తారన్న ప్రచారం సాగేది. అంతేనా…రిషికొండ ను తొలిచి మరీ వందల కోట్ల నిధులు ఖర్చు పెట్టి అధునాతన సౌకర్యాలతో కూడిన రాజమహల్ లాంటి భవనాన్ని కూడా జగన్ సర్కారు నిర్మించింది. గతంలో మాట ఎలా ఉన్నా… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తిరిగి గెలిచి ఉంటే మాత్రం జగన్ ఈ రాజ మహల్ నుంచే పాలన సాగించేవారు. రాజధానిగా మారుతుందన్న వాదనలు ఉన్నప్పుడు కూడా విశాఖలో పెద్దగా రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిన దాఖలా లేదనే చెప్పాలి. కాని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత… రాజధానిగా మారే అవకాశం విశాఖకు లేదని తెలిసిన తర్వాత విశాఖలో రియల్ దరలు ఆకాశాన్నంటేశాయి.

విశాఖ నగరంలో రియల్ ధరలు నిజంగానే సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిపోయాయి. పోనీ నగర శివారులో ఇల్లు కొందామన్నా కూడా అక్కడి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఎప్పుడైతే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం మొదలైందో విశాఖ చుట్టుపక్కల పరిధిలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. అదే సమయంలో పెద్ద ఎత్తున సాగు భూములు, నిరుపయోగంగా ఉన్న భూములన్నీ రెసిడెన్షియల్, కమర్షియల్ అపార్ట్మెంట్లుగా మారిపోతున్నాయి. ఈ తరహా కార్యకలాపాలు విశాఖ నలుదిక్కులా జెట్ స్పీడుతో జరుగు తున్నాయి. వెరసి విశాఖకు ఏ దిక్కున వెళ్లి ఇల్లు కొనాలన్నా…ధరలు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం విశాఖకు ఓ చివర ఉన్న యారాడలో ఓ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ కొనాలంటే ఏకంగా రూ.2 కోట్ల మేర పెడితే తప్పించి ఇల్లు దొరకడం లేదట. కూటమి సర్కారు అదికారంలోకి రాకముందు ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇల్లు రూ.1.2 కోట్లకు లభిస్తే… అదే ఇల్లు ఇప్పుడు ఏకంగా రూ.1.9 కోట్లకు పెరిగిందట. అంటే… ఈ 10 నెలల కాలంలోనే దాదాపు గా 50 శాతం మేర ధరలు పెరిగాయి. ఇక ఇప్పటి సరకొత కల్చర్ అయిన విల్లాల విషయానికి వస్తే… విశాఖకు ఏ మూల వెళ్లినా హీనపక్షం రూ.6 కోట్లు పెడితే తప్పించి విల్లా దొరకడం లేదట. ఈ ధరలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలకు థీటుగా ఉన్నాయన్న మాట కూడా వినిపిస్తోంది. కోకాపేట లాంటి ప్రాంతంలో రూ.6 కోట్ల కంటే తక్కువకే విల్లా దొరుకు తుంటే… అదే విశాఖలో మాత్రం నగర శివారులోనూ ఆ ధరకు విల్లా దొరకడం లేదు. వెరసి అతి త్వరలోనే రియల్ రంగంలో హైదరాబాద్ ను దాటేసి విశాఖ దూసుకెళ్లిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on March 30, 2025 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago