దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా… జమిలి ఎన్నికలు వస్తాయా? రావా? అన్న దిశగా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. అంతేకాకుండా కేంద్రంలో అదికారంలో ఉన్న ఎన్డీఏ జమిలి ఎన్నికలకు అనుకూలంగా పకడ్బందీగా పావులు కదుపుతున్న నేపథ్యంలో జమిలి జరిగితే పరిస్థితి ఎలా ఉంటాయన్న దిశగానూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, భారత మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్సేనని ఆయన వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలకు తూట్లు పొడిచిన కాంగ్రెస్…ఇప్పుడు జమిలి ప్రతిపాదనకు వ్యతిరేకంగా సాగుతోందని ఆయన విమర్శించారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రాముఖ్యత-సవాళ్లు-ప్రభావం’ పేరిట విజయవాడలో శనివారం ఓ కీలక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. స్వతంత్ర భారతావనిలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయని ఆయన గుర్తు చేశారు. నాడు పార్లమెంటు ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి… అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న జమిలి ఎన్నికలే జరిగాయని ఆయన తెలిపారు. అప్పటి నుంచి 15 ఏళ్ల పాటు… అంటే 1952 ఎన్నికలతో కలుపుకుంటే 4 సార్వత్రిక ఎన్నికలు జమిలి పద్దతిలోనే జరిగాయని ఆయన గుర్తు చేశారు.
అయితే నాడు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ నేత ఇందిరా గాంధీ… దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రభుత్వాల్లో తనకు నచ్చని ప్రభుత్వాలను నిర్ధీత కాలం కంటే ముందుగానే రద్దు చేసుకుంటూ వెళ్లిపోయారని వెంకయ్య ఆరోపించారు. అలా ప్రభుత్వాలు రద్దు అయిపోయిన రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు ముందే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఆ పరిస్థితి అలా కొనసాగుతూనే రాగా… జమిలి ఎన్నికల మాటే వినిపించలేదన్నారు. వెరసి జమిలి అనేది కొత్త పద్దతి కాదన్న వెంకయ్య… దేశంలో ఆది నుంచి అదే పద్దతి కొనసాగిందని గుర్తు చేశారు. నాడు జమిలి ఎన్నికల పద్ధతికి తూట్లు పొడిచింది కాంగ్రెస్సేనని ఆరోపించిన వెంకయ్య… ఇప్పుడు అదే పద్ధతి తీసుకొస్తామంటే అదే పార్టీ అడ్డుకుంటూ ఉండటం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on March 30, 2025 10:13 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…