దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా… జమిలి ఎన్నికలు వస్తాయా? రావా? అన్న దిశగా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. అంతేకాకుండా కేంద్రంలో అదికారంలో ఉన్న ఎన్డీఏ జమిలి ఎన్నికలకు అనుకూలంగా పకడ్బందీగా పావులు కదుపుతున్న నేపథ్యంలో జమిలి జరిగితే పరిస్థితి ఎలా ఉంటాయన్న దిశగానూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, భారత మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్సేనని ఆయన వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలకు తూట్లు పొడిచిన కాంగ్రెస్…ఇప్పుడు జమిలి ప్రతిపాదనకు వ్యతిరేకంగా సాగుతోందని ఆయన విమర్శించారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రాముఖ్యత-సవాళ్లు-ప్రభావం’ పేరిట విజయవాడలో శనివారం ఓ కీలక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. స్వతంత్ర భారతావనిలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయని ఆయన గుర్తు చేశారు. నాడు పార్లమెంటు ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి… అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న జమిలి ఎన్నికలే జరిగాయని ఆయన తెలిపారు. అప్పటి నుంచి 15 ఏళ్ల పాటు… అంటే 1952 ఎన్నికలతో కలుపుకుంటే 4 సార్వత్రిక ఎన్నికలు జమిలి పద్దతిలోనే జరిగాయని ఆయన గుర్తు చేశారు.
అయితే నాడు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ నేత ఇందిరా గాంధీ… దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రభుత్వాల్లో తనకు నచ్చని ప్రభుత్వాలను నిర్ధీత కాలం కంటే ముందుగానే రద్దు చేసుకుంటూ వెళ్లిపోయారని వెంకయ్య ఆరోపించారు. అలా ప్రభుత్వాలు రద్దు అయిపోయిన రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు ముందే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఆ పరిస్థితి అలా కొనసాగుతూనే రాగా… జమిలి ఎన్నికల మాటే వినిపించలేదన్నారు. వెరసి జమిలి అనేది కొత్త పద్దతి కాదన్న వెంకయ్య… దేశంలో ఆది నుంచి అదే పద్దతి కొనసాగిందని గుర్తు చేశారు. నాడు జమిలి ఎన్నికల పద్ధతికి తూట్లు పొడిచింది కాంగ్రెస్సేనని ఆరోపించిన వెంకయ్య… ఇప్పుడు అదే పద్ధతి తీసుకొస్తామంటే అదే పార్టీ అడ్డుకుంటూ ఉండటం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on March 30, 2025 10:13 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…