Political News

వైసీపీ వ‌దులుకుంది.. టీడీపీ ప‌ట్టుకుంటోంది ..!

రాష్ట్రంలో ముస్లింల‌కు అత్యంత ప‌విత్ర‌మైన పండుగ రంజాన్‌. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ముస్లింలను అక్కున చేర్చుకున్న విష‌యం తెలిసిందే. మైనారిటీ ముస్లింల‌కు.. పింఛ‌న్లు ఇవ్వ‌డంతోపాటు పాస్ట‌ర్ల‌కు రూ.5000 చొప్పున నెల‌నెలా భ‌త్యాలు కూడా ఇచ్చింది. ఇక, వారు మ‌క్కా యాత్ర‌ల‌కు వెళ్తే.. అక్క‌డ కూడా ఏర్పాట్లు చేసింది. రూ.ల‌క్ష వ‌ర‌కు రాయితీ ఇచ్చింది. అయితే.. మైనారిటీల‌కు ఇంత చేసినా.. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌ను ఓడించార‌న్న ఆవేద‌న వైసీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే వైసీపీ అధికారం నుంచి దిగిపోయిన త‌ర్వాత‌.. వ‌చ్చిన తొలి రంజాన్ వేడుక‌ల‌ను మొక్కుబడిగా నిర్వ‌హించారు. విజ‌య‌వాడ‌లో రెండు రోజుల కింద‌ట నిర్వ‌హించిన ఇప్తార్ విందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ సంద‌డి లేకుండా పోయింది. దీనికి కార‌ణం.. మైనారిటీ నాయ‌కులు కూడా మౌనంగా ఉన్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇది.. ఆయా వర్గాల్లో ఒకింత అసంతృప్తిని లేవ‌నెత్తుతోంది. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీ పుంజుకుంది.

రాష్ట్రంలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీ ఒక్క‌టే మైనారిటీ ముస్లింల వైపు ఉందన్న సంకేతాలు వ‌స్తున్నాయి. జ‌న‌సేన ఒక‌ప్పుడు.. మైనారిటీ ముస్లింల‌కు అండ‌గానే ఉంది. కానీ, స‌నాత‌న ధ‌ర్మం పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ యాత్ర‌లు, దీక్ష‌లుచేయ‌డంలో ఈ వ‌ర్గం ఆ పార్టీకి దూర‌మైంది. నిజానికి ఒక‌రిద్ద‌రు వైసీపీ మైనారిటీ నాయ‌కులు జ‌న‌సేన‌లో చేరేందుకు సిద్ధ‌ప‌డి కూడా ఆగిపోయారు. ఆ త‌ర్వాత‌.. పార్టీ పూర్తిగా స‌నాత‌నం వైపు మ‌ళ్లింది. దీంతో ముస్లింలు దూర‌మ‌య్యారు.

ఈ గ్యాప్‌ను అంటే.. అటు వైసీపీ, ఇటు జ‌న‌సేన‌లు సృష్టించిన గ్యాప్‌ను టీడీపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. దీనిలో భాగంగా ముస్లింల‌కు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు ఇస్తోంది. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్‌విందు ఇచ్చారు. ఆ త‌ర్వాత‌.. ఇప్పుడు జిల్లాల స్థాయిలో శుక్ర‌వారం ప్ర‌భుత్వ‌మే ఇఫ్తార్ ఇచ్చింది. దీనిలో ఎంతో మంది నాయ‌కులు పాల్గొన్నారు. అంతేకాదు.. శ‌నివారం కూడా మండ‌ల‌స్థాయిలో ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. సో.. ఎలా చూసుకున్నా.. వైసీపీ వ‌దిలేసిన‌.. ముస్లింల‌ను టీడీపీ అందిపుచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 29, 2025 2:43 pm

Share

Recent Posts

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

4 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

5 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

6 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

7 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

7 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

8 hours ago