Political News

వైసీపీ వ‌దులుకుంది.. టీడీపీ ప‌ట్టుకుంటోంది ..!

రాష్ట్రంలో ముస్లింల‌కు అత్యంత ప‌విత్ర‌మైన పండుగ రంజాన్‌. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ముస్లింలను అక్కున చేర్చుకున్న విష‌యం తెలిసిందే. మైనారిటీ ముస్లింల‌కు.. పింఛ‌న్లు ఇవ్వ‌డంతోపాటు పాస్ట‌ర్ల‌కు రూ.5000 చొప్పున నెల‌నెలా భ‌త్యాలు కూడా ఇచ్చింది. ఇక, వారు మ‌క్కా యాత్ర‌ల‌కు వెళ్తే.. అక్క‌డ కూడా ఏర్పాట్లు చేసింది. రూ.ల‌క్ష వ‌ర‌కు రాయితీ ఇచ్చింది. అయితే.. మైనారిటీల‌కు ఇంత చేసినా.. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌ను ఓడించార‌న్న ఆవేద‌న వైసీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే వైసీపీ అధికారం నుంచి దిగిపోయిన త‌ర్వాత‌.. వ‌చ్చిన తొలి రంజాన్ వేడుక‌ల‌ను మొక్కుబడిగా నిర్వ‌హించారు. విజ‌య‌వాడ‌లో రెండు రోజుల కింద‌ట నిర్వ‌హించిన ఇప్తార్ విందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ సంద‌డి లేకుండా పోయింది. దీనికి కార‌ణం.. మైనారిటీ నాయ‌కులు కూడా మౌనంగా ఉన్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇది.. ఆయా వర్గాల్లో ఒకింత అసంతృప్తిని లేవ‌నెత్తుతోంది. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీ పుంజుకుంది.

రాష్ట్రంలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీ ఒక్క‌టే మైనారిటీ ముస్లింల వైపు ఉందన్న సంకేతాలు వ‌స్తున్నాయి. జ‌న‌సేన ఒక‌ప్పుడు.. మైనారిటీ ముస్లింల‌కు అండ‌గానే ఉంది. కానీ, స‌నాత‌న ధ‌ర్మం పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ యాత్ర‌లు, దీక్ష‌లుచేయ‌డంలో ఈ వ‌ర్గం ఆ పార్టీకి దూర‌మైంది. నిజానికి ఒక‌రిద్ద‌రు వైసీపీ మైనారిటీ నాయ‌కులు జ‌న‌సేన‌లో చేరేందుకు సిద్ధ‌ప‌డి కూడా ఆగిపోయారు. ఆ త‌ర్వాత‌.. పార్టీ పూర్తిగా స‌నాత‌నం వైపు మ‌ళ్లింది. దీంతో ముస్లింలు దూర‌మ‌య్యారు.

ఈ గ్యాప్‌ను అంటే.. అటు వైసీపీ, ఇటు జ‌న‌సేన‌లు సృష్టించిన గ్యాప్‌ను టీడీపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. దీనిలో భాగంగా ముస్లింల‌కు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు ఇస్తోంది. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్‌విందు ఇచ్చారు. ఆ త‌ర్వాత‌.. ఇప్పుడు జిల్లాల స్థాయిలో శుక్ర‌వారం ప్ర‌భుత్వ‌మే ఇఫ్తార్ ఇచ్చింది. దీనిలో ఎంతో మంది నాయ‌కులు పాల్గొన్నారు. అంతేకాదు.. శ‌నివారం కూడా మండ‌ల‌స్థాయిలో ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. సో.. ఎలా చూసుకున్నా.. వైసీపీ వ‌దిలేసిన‌.. ముస్లింల‌ను టీడీపీ అందిపుచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 29, 2025 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

2 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

6 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

7 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

7 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

7 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

8 hours ago