Political News

వైసీపీ వ‌దులుకుంది.. టీడీపీ ప‌ట్టుకుంటోంది ..!

రాష్ట్రంలో ముస్లింల‌కు అత్యంత ప‌విత్ర‌మైన పండుగ రంజాన్‌. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ముస్లింలను అక్కున చేర్చుకున్న విష‌యం తెలిసిందే. మైనారిటీ ముస్లింల‌కు.. పింఛ‌న్లు ఇవ్వ‌డంతోపాటు పాస్ట‌ర్ల‌కు రూ.5000 చొప్పున నెల‌నెలా భ‌త్యాలు కూడా ఇచ్చింది. ఇక, వారు మ‌క్కా యాత్ర‌ల‌కు వెళ్తే.. అక్క‌డ కూడా ఏర్పాట్లు చేసింది. రూ.ల‌క్ష వ‌ర‌కు రాయితీ ఇచ్చింది. అయితే.. మైనారిటీల‌కు ఇంత చేసినా.. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌ను ఓడించార‌న్న ఆవేద‌న వైసీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే వైసీపీ అధికారం నుంచి దిగిపోయిన త‌ర్వాత‌.. వ‌చ్చిన తొలి రంజాన్ వేడుక‌ల‌ను మొక్కుబడిగా నిర్వ‌హించారు. విజ‌య‌వాడ‌లో రెండు రోజుల కింద‌ట నిర్వ‌హించిన ఇప్తార్ విందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ సంద‌డి లేకుండా పోయింది. దీనికి కార‌ణం.. మైనారిటీ నాయ‌కులు కూడా మౌనంగా ఉన్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇది.. ఆయా వర్గాల్లో ఒకింత అసంతృప్తిని లేవ‌నెత్తుతోంది. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీ పుంజుకుంది.

రాష్ట్రంలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీ ఒక్క‌టే మైనారిటీ ముస్లింల వైపు ఉందన్న సంకేతాలు వ‌స్తున్నాయి. జ‌న‌సేన ఒక‌ప్పుడు.. మైనారిటీ ముస్లింల‌కు అండ‌గానే ఉంది. కానీ, స‌నాత‌న ధ‌ర్మం పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ యాత్ర‌లు, దీక్ష‌లుచేయ‌డంలో ఈ వ‌ర్గం ఆ పార్టీకి దూర‌మైంది. నిజానికి ఒక‌రిద్ద‌రు వైసీపీ మైనారిటీ నాయ‌కులు జ‌న‌సేన‌లో చేరేందుకు సిద్ధ‌ప‌డి కూడా ఆగిపోయారు. ఆ త‌ర్వాత‌.. పార్టీ పూర్తిగా స‌నాత‌నం వైపు మ‌ళ్లింది. దీంతో ముస్లింలు దూర‌మ‌య్యారు.

ఈ గ్యాప్‌ను అంటే.. అటు వైసీపీ, ఇటు జ‌న‌సేన‌లు సృష్టించిన గ్యాప్‌ను టీడీపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. దీనిలో భాగంగా ముస్లింల‌కు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు ఇస్తోంది. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్‌విందు ఇచ్చారు. ఆ త‌ర్వాత‌.. ఇప్పుడు జిల్లాల స్థాయిలో శుక్ర‌వారం ప్ర‌భుత్వ‌మే ఇఫ్తార్ ఇచ్చింది. దీనిలో ఎంతో మంది నాయ‌కులు పాల్గొన్నారు. అంతేకాదు.. శ‌నివారం కూడా మండ‌ల‌స్థాయిలో ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. సో.. ఎలా చూసుకున్నా.. వైసీపీ వ‌దిలేసిన‌.. ముస్లింల‌ను టీడీపీ అందిపుచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 29, 2025 2:43 pm

Share

Recent Posts

అమ్మాయిల ప్రైవేటు పార్ట్స్ మీద కొడితే సారి చెప్పరా

జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…

15 minutes ago

హ్యాట్రిక్ ముద్ర కోసం ఫ్లాపుని మర్చిపోవాలా

చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…

50 minutes ago

నాగార్జున అసలు పాయింట్ మిస్సయ్యారు

ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…

1 hour ago

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

6 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

6 hours ago

సూర్యతో కూడా… హడావుడి లేని అట్లూరి

సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…

6 hours ago