ముందు వచ్చేది హరిహర వీరమల్లునే అయినా అభిమానులు ఎదురు చూస్తోంది మాత్రం ఓజి కోసమనేది ఓపెన్ సీక్రెట్. డిప్యూటీ సిఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ దీని నినాదంతో హోరెత్తిస్తున్నారు. ఒకదశలో పవన్ అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భాలు చాలానే కనిపిస్తున్నాయి. ఓజి గోల ఆపమంటూ ఆయనే వేడుకున్నా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఓజిని పూర్తి చేసి హమ్మయ్య అనుకోవాలని పవన్ భావిస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఏప్రిల్, మే నెలలో వీలుని బట్టి తగినన్ని డేట్లు ఇచ్చి త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేలా చూడాలని నిర్మాతకు సమాచారమిచ్చారట.
దానికి తగ్గట్టే దర్శకుడు సుజిత్, నిర్మాత డివివి దానయ్యలు సెప్టెంబర్ రిలీజ్ సాధ్యాసాధ్యాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు టాక్. ఒకవేళ అన్నీ అనుకూలంగా జరిగిపోతే ఓజి దర్శనం త్వరగానే ఉంటుంది. దీనివెనుక ఇంకో కారణం ఉంది. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఓటిటి డీల్ ప్రకారం ఓజి ఈ ఏడాదిలోనే థియేట్రికల్ రిలీజ్ జరిగిపోవాలి. లేదంటే ముందు ఇస్తామన్న భారీ మొత్తంలో ఒప్పందం ప్రకారం కోత పడుతుంది. అందుకే అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఓజి బాలన్స్ కు సంబంధించిన ప్లాన్ మారుస్తున్నారని వినికిడి. ఇప్పటిదాకా పవన్ అవసరం లేని సీన్లు, ఎపిసోడ్లు అన్నీ పూర్తయ్యాయి. హీరోవి మాత్రమే కొన్ని పెండింగ్.
ఇదంతా నిజమైతే మాత్రం పవన్ అభిమానులకు 2025 స్పెషల్ గా ఉండిపోతుంది. ఎందుకంటే తక్కువ గ్యాప్ లో రెండు రిలీజులు చూసే ఛాన్స్ దక్కుతుంది. ఇవి అయిపోతే పవన్ కు సినిమాల పరంగా ఉండే ఒత్తిడి తగ్గిపోతుంది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కానీ అదేమంత అర్జెంట్ కాదు. పైగా రీమేక్ కావడంతో వేగంగానే పూర్తి చేయొచ్చు. గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం దర్శకుడు హరీష్ శంకర్ రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ఓజి సెప్టెంబర్ లో వస్తే ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్న ఇతర పెద్ద సినిమాలు ముందుకకో వెనక్కో మార్చుకునే అవకాశముంది. సైడివ్వకపోతే వాటికే రిస్కు మరి.
This post was last modified on March 29, 2025 4:18 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…