ముందు వచ్చేది హరిహర వీరమల్లునే అయినా అభిమానులు ఎదురు చూస్తోంది మాత్రం ఓజి కోసమనేది ఓపెన్ సీక్రెట్. డిప్యూటీ సిఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ దీని నినాదంతో హోరెత్తిస్తున్నారు. ఒకదశలో పవన్ అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భాలు చాలానే కనిపిస్తున్నాయి. ఓజి గోల ఆపమంటూ ఆయనే వేడుకున్నా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఓజిని పూర్తి చేసి హమ్మయ్య అనుకోవాలని పవన్ భావిస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఏప్రిల్, మే నెలలో వీలుని బట్టి తగినన్ని డేట్లు ఇచ్చి త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేలా చూడాలని నిర్మాతకు సమాచారమిచ్చారట.
దానికి తగ్గట్టే దర్శకుడు సుజిత్, నిర్మాత డివివి దానయ్యలు సెప్టెంబర్ రిలీజ్ సాధ్యాసాధ్యాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు టాక్. ఒకవేళ అన్నీ అనుకూలంగా జరిగిపోతే ఓజి దర్శనం త్వరగానే ఉంటుంది. దీనివెనుక ఇంకో కారణం ఉంది. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఓటిటి డీల్ ప్రకారం ఓజి ఈ ఏడాదిలోనే థియేట్రికల్ రిలీజ్ జరిగిపోవాలి. లేదంటే ముందు ఇస్తామన్న భారీ మొత్తంలో ఒప్పందం ప్రకారం కోత పడుతుంది. అందుకే అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఓజి బాలన్స్ కు సంబంధించిన ప్లాన్ మారుస్తున్నారని వినికిడి. ఇప్పటిదాకా పవన్ అవసరం లేని సీన్లు, ఎపిసోడ్లు అన్నీ పూర్తయ్యాయి. హీరోవి మాత్రమే కొన్ని పెండింగ్.
ఇదంతా నిజమైతే మాత్రం పవన్ అభిమానులకు 2025 స్పెషల్ గా ఉండిపోతుంది. ఎందుకంటే తక్కువ గ్యాప్ లో రెండు రిలీజులు చూసే ఛాన్స్ దక్కుతుంది. ఇవి అయిపోతే పవన్ కు సినిమాల పరంగా ఉండే ఒత్తిడి తగ్గిపోతుంది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కానీ అదేమంత అర్జెంట్ కాదు. పైగా రీమేక్ కావడంతో వేగంగానే పూర్తి చేయొచ్చు. గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం దర్శకుడు హరీష్ శంకర్ రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ఓజి సెప్టెంబర్ లో వస్తే ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్న ఇతర పెద్ద సినిమాలు ముందుకకో వెనక్కో మార్చుకునే అవకాశముంది. సైడివ్వకపోతే వాటికే రిస్కు మరి.
This post was last modified on March 29, 2025 4:18 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…