వైసీపీకి ఒక దశ-దిశ అంటూ.. లేకుండా పోతోందా? అంటే.. ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఒక సామాజిక వర్గానికి న్యాయం మరో సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారన్న వాదన బలంగా ఎస్సీ వర్గాల్లో వినిపిస్తోంది. మాల సామాజిక వర్గానికి ఈ పార్టీ పరిమితం అవుతున్న సంకేతాలు వస్తున్నాయి. మాదిగ సామాజిక వర్గం నుంచి వస్తున్న విమర్శలను పార్టీ పట్టించుకోకపోవడం.. అన్ని విధాలా ఇబ్బందిగా మారిపోయింది.
ఎస్సీ వర్గీకరణపై వైసీపీ ఒక పంథాను ఎంచుకోకపోవడం.. మాదిగ నేతలతో మాదిగలనే తిట్టించడం వంటివి.. ఎస్సీల్లో చిచ్చుకు కారణంగా మారుతున్నాయి. దీనిపై మంద కృష్ణ మాదిగ బాగానే వైసీపీ ని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై సమాదానం చెప్పకుండా పార్టీ నేతలు తప్పించుకుంటున్నారన్న భావన కూడా వ్యక్తమవుతోంది. ఎస్సీల విషయం ఇలా ఉంటే.. ఇక, ముస్లిం సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకునే విషయంలోనూ వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.
రంజాన్ను పురస్కరించుకుని వైసీపీ భారీ ఎత్తున విజయవాడలో ఇఫ్తార్ విందు ఇచ్చింది. దీనికి జగన్ హాజరయ్యారు. అయితే.. ఆయన ఈ సందర్భంగా ముస్లింల నుంచివచ్చిన పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు విషయంలో ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయన దాటవేత ధోరణినే అవలంభించారు. ఇది ముస్లిం వర్గాలను ఇబ్బందికి గురి చేసింది. ఆది నుంచి ముస్లింలు తమ వెంటే ఉన్నారని చెప్పిన జగన్.. గత ఎన్నికల్లోవారి మద్దతు కోల్పోయారన్నది వాస్తవం.
పైగా.. ఇప్పుడు వక్ఫ్ బిల్లు విషయంలోనూ ఆయన ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్న సంకేతాలు వస్తు న్నాయి. తాజాగా కేంద్రంతో వైసీపీ ఎంపీలు..(రాజ్యసభ, లోక్సభలోని సభ్యులు) వక్ఫ్ బిల్లుకు మద్దుతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. కారణాలు ఏవైనా.. కేంద్రంతో లడాయి పెట్టుకునేందుకు వైసీపీ సాహసించలేక పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్లింలు కూడా వైసీపీ వ్యూహాలను పరిశీలిస్తున్నాయి. పైకి బాగుందని అంటున్నా.. గతంలో ట్రిపుల్ తలాక్కు, ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లుకు కూడా వైసీపీ మద్దుతగా వ్యవహరించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…