Political News

వంశీకి డబుల్ షాక్… రెండో బెయిల్ పిటిషన్ కొట్టివేత

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు శుక్రవారం డబుల్ షాక్ తగిలింది. దళిత యువకుడు కిడ్నాప్, బెదిరింపుల కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో బెయిల్ ఇవ్వాలంటూ వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు గురువారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. తాజాగా శక్రవారం ఈ కేసుతోనే లింకున్న రెండో కేసులోనూ వంశీ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో వంశీకి వరుస రోజుల్లోనే డబుల్ షాక్ తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో వైసీపీ గాలిని తట్టుకుని మరీ వంశీ గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల కారణంగా తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన టీడీపీకి దూరం జరిగిన వంశీ… వైసీపీకి దగ్గరయ్యారు. నాటి సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం టీడీపీ అదినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన వంశీ… టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి గరయ్యారు. ఒకానొక సందర్భంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ తన అనుచరులను పంపి ధ్వంసం చేయించారన్న ఆరోపణలూ బలంగా వినిపించాయి. ఈ వ్యవహారంపైనే వంశీపై కేసు నమోదు కాగా… కేసును మాఫీ చేయించుకునేందుకు ప్లాన్ వేసి వంశీ అడ్డంగా బుక్కైైపోయారు.

కిడ్నాప్, బెదిరింపుల కేసులో బెయిల్ ఇవ్వాలంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై శక్రవారం విజయవాడ ఎస్సీ,ఎస్టీ కోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే ఈ కేసులో వంశీని పోలీసులు రిమాండ్ లోకి తీసుకుని దాదాపుగా వారం రోజుల పాట విచారణ చేపట్టారని, సదరు విచారణకు వంశీ పూర్తిగా సహకరించారని… ఈ నేపథ్యంలో ఈకేసులో కొత్తగా తెలిసే అంశాలేమీ లేవని ఆయన న్యాయవాదులు తెలిపారు. అంతేకాకుండా అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకుని వంశీకి బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే వంశీకి బెయిల్ ఇస్తే… కిడ్నాప్ అయిన దళిత యువకుడు సత్యవర్థన్ కు ప్రాణ హానీ ఉందని, ఈ కారణంగా వంశీకి బెయిల్ ఇవ్వవద్దని సత్యవర్థన్ న్యాయవాదులు కోరారు. ఇరు వాదనలు విన్న కోర్టు… వంశీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

This post was last modified on March 28, 2025 7:26 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

26 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago