వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై సుప్రీంకోర్టు జరుపుతున్న విచారణలో ఏపీ ప్రభుత్వం మంగళవారం ఓ అదనపు అఫిడివిట్ ను దాఖలు చేసింది. అందలో కడప ఎంపీగా కొనసాగతున్నవైఎస్ అవినాశ్ రెడ్డి…ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించారని సదరు అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ కేసును తప్పుదోవ పట్టించే దిశగా అవినాశ్ రెడ్డి ఎలాంటి చర్యలకు పాల్పడ్డారన్న విషయాలను ఏపీ ప్రభుత్వం సమగ్రంగా కోర్టు ముందు ఉంచింది.
2019 ఎన్నికలకు ముందు పులివెందులలోని తన ఇంటిలోనే వివేకా దారుణ హత్యకు గురయ్యారు. నాడు టీడీపీ అధికారంలో వైసీపీ విపక్షంలో ఉంది. తన బాబాయి హత్యపై సీబీఐ చేత దర్యాప్త చేయించాలని డిమాండ్ చేసిన జగన్.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ డిమాండ్ ను పక్కనపెట్టేశారన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే వివేకా కుమార్తె సునీత న్యాయ పోరాటంతో ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీబీఐ ఎట్టకేలకు రంగంలోకి దిగింది. అయితే సిబీఐ దర్యాప్తును తప్పుదారి పట్టిస్తూ ఎంపీ హోదాలో అవినాశ్ రెడ్డి వ్యవహరించారట. ఈ విషయాన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తన అదనపు అఫిడవిట్ లో సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
తన అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం ఏమని చెప్పిందన్న విషయానికి వస్తే… వివేకా హత్య కేసు దర్యాప్తును ఎంపీ అవినాశ్ రెడ్డి తప్పుదోవ పట్టించారని… అవినాశ్ రెడ్ది ఆదేశాలతోనే సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలపై సీబీఐ అధికారి రాంసింగ్ కేసులు నమోదు చేశారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ చర్య ద్వారా వివేకా హత్య కేసు దర్యాప్తును తారుమారు చేసేందుకు అవినాశ్ యత్నించారని ఆరోపించింది. తండ్రి హంతకులను కనిపెట్టేందుకు కష్టపడుతున్న సునీత, ఆమె భర్తలపైనే ఈ కేసులో ఇరికించాలని చూశారని పేర్కొంది. ఈ విషయం బయటపడటంతో రాంసింగ్ పై కేసు నమోదు కాగా… ఆ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రాజు ప్రొఫెషనల్ గా విచారణ చేపట్టలేదని తెలిపింది.
రాంసింగ్ ను విచారించే విషయంలోనూ ఎంపీ అవినాశ్ రెడ్డి కలగజేసుకున్నారని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్ లో తెలిపింది. విచారణాధికారిగా ఉన్న రాజును అవినాశ్ రెడ్డి బెదిరించారని…దీనిని రాజు స్వయంగా అంగీకరించారని తెలిపింది. ఇలా విచారణాధికారులనే అవినాశ్ రెడ్డి బెదిరించిన వ్యవహారంలో ఏఎస్పీగా పనిచేసిన పదవీ విరమణ పొందిన రాజేశ్వర్ రెడ్డి, మరో సీనియర్ పోలీసు అధికారి రామకృష్ణారెడ్డిలేనని కూడా ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇంత పకడ్బందీగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో అవినాశ్ రెడ్డికి ఇబ్బందులు తప్పేలా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 25, 2025 10:06 pm
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ఇక ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటపడే అవకాశాలే లేదన్న…
దేశంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి యువతులకు లభించిన స్వేచ్ఛే కారణమని ఇటీవల ఓ కోర్టు వ్యాఖ్యానించి.. చేతులు కాల్చుకుంది. ఇదేసమయంలో ప్రతిష్టాత్మక…
ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత నేతలే కన్ను కప్పేస్తున్నారు. గతంలో వైసీపీ నాయకులు అక్రమాలు చేశారని.. అన్యాయాలు చేశారని.. పదే…
భవిష్యత్తు గురించిన ఆలోచన అవసరమే. దీనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. పైగా.. భవిష్యత్తుపై పక్కా లక్ష్యం కూడా ఉండాలి.…
బాలకృష్ణ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రత్యేకతను సంతరించుకున్న ఆదిత్య 369 వచ్చే నెల…
రేపు విడుదల కాబోతున్న ఎల్2 ఎంపురాన్ దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ కి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. వంద కోట్లకు పైగా…