Political News

3.5 గంటల విచారణలో శ్యామల ఏం చెప్పారు?

బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. శ్యామలతో పాటుగా 8 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ వారికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరితో పాటు ఐదుగురు పోలీసుల విచారణకు హాజరయ్యారు. తాజాగా సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్యామల పోలీసుల విచారణకు హాజరయ్యారు.

బెట్టింగ్ యాప్ ల కేసులో పోలీసులు తనను ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భావనతో శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శ్యామల పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు… శ్యామలకు అరెస్టును నుంచి విముక్తి కల్పిస్తూ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు తన న్యాయవాదిని వెంటబెట్టుకుని సోమవారం ఉదయం శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపుగా 3.5 గంటల పాటు శ్యామలను పోలీసులు విచారించారు. ఆ తర్వాత ఆమెను పంపేశారు.

విచారణ సందర్బంగా శ్యామల సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించినట్లుగా సమాచారం. అంతేకాకుండా శ్యామల మొబైల్ ఫోన్ ను కూడా పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఇప్పటిదాకా ఎన్నిబెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేశారని శ్యామలను ప్రశ్నించారు. అంతేకాకుండా ఆ ప్రచారం ద్వారా బెట్టింగ్ యాప్ ల ద్వారా ఎంతమొత్తం ఆర్జించారన్న వివరాలను కూడా ఆమె నుంచి సేకరించారు. ఈ సందర్బంగా శ్యామల బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మీడియాతో మాట్లాడిన శ్యామల.. ప్రస్తుతానికి తానేమీ మాట్లాడలేనని తెలిపారు. పోలీసుల విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని ఆమె తెలిపారు.

This post was last modified on March 24, 2025 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago