Political News

సోము గారూ.. మీరు సూపరండీ

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించి ఏపీ శాఖకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. గతంలో అధ్యక్షులుగా ఉన్న వారికి భిన్నంగా సాగుతున్న సోము వీర్రాజు.. పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను సంపాదించుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పక తప్పదు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షాతారేకాలు వ్యక్తమవుతున్నాయి.

అయినా సోము వీర్రాజు తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటంటే.. తనను కలిసేందుకు వచ్చే వారు తమ వెంట తీసుకువచ్చే శాలువాలకు ఇకపై స్వస్తి చెప్పాలని ఆయన విజ్ఝప్తి చేశారు. నన్ను కలవడానికి వచ్చేవారు శాలువాలు తీసుకురావద్దని, వాటికి బదులుగా పేదలకు ఉపయోగడే వస్త్రాలు తీసుకురావాలని వీర్రాజు పార్టీ శ్రేణులకు సూచించారు. ‘నేటి నుండి పూర్తిస్థాయిలో శాలువాలు తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాను. నన్ను కలిసే సందర్భాల్లో గౌరవార్థంగా తీసుకొచ్చే శాలువాలకు బదులుగా పేదల సహాయం కొరకు ఉపయోగపడే వస్త్రాలు మాత్రమే తీసుకుని రావాల్సిందిగా కోరి ప్రార్ధిస్తున్నాను’ అని ఆయన ఓ విస్పష్ట ప్రకటనను విడుదల చేశారు.

ఈ దిశగా తాను తీసుకున్న ఈ నిర్ణయంపై మరింత వివరణ ఇచ్చిన వీర్రాజు ఏమన్నారంటే… ‘‘పేదల అవసరాలకు వీలుగా మనం వస్త్రదానం కూడా చేయొచ్చు. నిరూపయోగమైన శాలువాలతో వేల రూపాయల వృథా చేసే కార్యక్రమాన్ని నేటితో విరమించుకోవాల్సిందిగా నాయకులు, కార్యకర్తలందరికీ మనవి. పేదలకు పంచేందుకు వీలుగా ఉండే తువ్వాళ్లు, లుంగీలు, పంచలు లాంటి వస్త్రాలు పేదల సహాయార్థం స్వీకరించబడతాయి’ అని సోము వీర్రాజు సదరు ప్రకటనలో చెప్పారు. వీర్రాజు తీసుకున్న ఈ నిర్ణయం ఇతర నేతలు కూడా తీసుకుంటే ఎంత మంచి జరుగుతుందో కదా.

This post was last modified on October 29, 2020 12:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

40 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago