ఇంకుడు గుంత, పంట కుంట… వీటి పేర్లు వేరైనా…వీటి ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే. వాన నీటిని ఒడిసి పట్టి వర్షపు చుక్కలను ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకిపోయేలా చేసి… ఆ ప్రాంతంలో భూగర్బ జలాల పరిమాణాన్ని పెంచడమే వీటి ఉద్దేశ్యం. తొలి దానిని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. రెండో దానిని ఇప్పుడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాచుర్యంలోకి తీసుకు వస్తున్నారు. వెరసి నాటి చంద్రబాబు సంకల్పాన్ని ఇప్పుడు పవన్ తన భుజస్కందాలపైకి ఎత్తుకున్నారని చెప్పాలి.
1995-2004 మధ్యలో ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు… కరువు ప్రాంతమైన రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, తెలంగాణలోని మెట్ట ప్రాంతాల్లో భూగర్బ జలాల పరిమాణాన్ని పెంచేందుకు ఇంకుడు గుంతలను ప్రమోట్ చేశారు. చంద్రబాబు పిలుపుతో నాడు తెలుగు నేల వ్యాప్తంగా ఇంకుడు గుంతలు వేలు, లక్షలు, కోట్ల కొద్దీ ఏర్పాటయ్యాయి. రైతులు అయితే ఇంకుడు గుంతలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చంద్రబాబు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో చంద్రబాబు సంకల్పం మేరకు భూగర్భ జలాల పరిమాణం భారీగానే పెరిగిపోయింది.
ఇక ఇప్పుడు పంట కుంటల పేరిట పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. రాయలసీమ ముఖద్వారా కర్నూలుకు కూతవేటు దూరంలోని ఓర్వకల్లు మండలం పూడిచెర్ల పరిధిలో పంట కుంటలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఎంపిక చేసిన స్థలంలో పంట కుంటలకు పవన్ భూమి పూజ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్… పంట కుంటల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల మేర పంట కుంటలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగుతున్నామని ఆయన చెప్పారు. ఇది నిరంతర ప్ర్రక్రియగా కొనసాగాల్సి ఉందని కూడా ఆయన పిలుపునిచ్చారు. పంట కుంటల చుట్టూ ఆకు కూరలు, కూరగాయల మొక్కలను పెంచుకోవాలని పవన్ సూచించారు.
This post was last modified on March 22, 2025 2:53 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…