ఇంకుడు గుంత, పంట కుంట… వీటి పేర్లు వేరైనా…వీటి ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే. వాన నీటిని ఒడిసి పట్టి వర్షపు చుక్కలను ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకిపోయేలా చేసి… ఆ ప్రాంతంలో భూగర్బ జలాల పరిమాణాన్ని పెంచడమే వీటి ఉద్దేశ్యం. తొలి దానిని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. రెండో దానిని ఇప్పుడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాచుర్యంలోకి తీసుకు వస్తున్నారు. వెరసి నాటి చంద్రబాబు సంకల్పాన్ని ఇప్పుడు పవన్ తన భుజస్కందాలపైకి ఎత్తుకున్నారని చెప్పాలి.
1995-2004 మధ్యలో ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు… కరువు ప్రాంతమైన రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, తెలంగాణలోని మెట్ట ప్రాంతాల్లో భూగర్బ జలాల పరిమాణాన్ని పెంచేందుకు ఇంకుడు గుంతలను ప్రమోట్ చేశారు. చంద్రబాబు పిలుపుతో నాడు తెలుగు నేల వ్యాప్తంగా ఇంకుడు గుంతలు వేలు, లక్షలు, కోట్ల కొద్దీ ఏర్పాటయ్యాయి. రైతులు అయితే ఇంకుడు గుంతలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చంద్రబాబు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో చంద్రబాబు సంకల్పం మేరకు భూగర్భ జలాల పరిమాణం భారీగానే పెరిగిపోయింది.
ఇక ఇప్పుడు పంట కుంటల పేరిట పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. రాయలసీమ ముఖద్వారా కర్నూలుకు కూతవేటు దూరంలోని ఓర్వకల్లు మండలం పూడిచెర్ల పరిధిలో పంట కుంటలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఎంపిక చేసిన స్థలంలో పంట కుంటలకు పవన్ భూమి పూజ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్… పంట కుంటల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల మేర పంట కుంటలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగుతున్నామని ఆయన చెప్పారు. ఇది నిరంతర ప్ర్రక్రియగా కొనసాగాల్సి ఉందని కూడా ఆయన పిలుపునిచ్చారు. పంట కుంటల చుట్టూ ఆకు కూరలు, కూరగాయల మొక్కలను పెంచుకోవాలని పవన్ సూచించారు.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…