ఇంకుడు గుంత, పంట కుంట… వీటి పేర్లు వేరైనా…వీటి ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే. వాన నీటిని ఒడిసి పట్టి వర్షపు చుక్కలను ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకిపోయేలా చేసి… ఆ ప్రాంతంలో భూగర్బ జలాల పరిమాణాన్ని పెంచడమే వీటి ఉద్దేశ్యం. తొలి దానిని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. రెండో దానిని ఇప్పుడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాచుర్యంలోకి తీసుకు వస్తున్నారు. వెరసి నాటి చంద్రబాబు సంకల్పాన్ని ఇప్పుడు పవన్ తన భుజస్కందాలపైకి ఎత్తుకున్నారని చెప్పాలి.
1995-2004 మధ్యలో ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు… కరువు ప్రాంతమైన రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, తెలంగాణలోని మెట్ట ప్రాంతాల్లో భూగర్బ జలాల పరిమాణాన్ని పెంచేందుకు ఇంకుడు గుంతలను ప్రమోట్ చేశారు. చంద్రబాబు పిలుపుతో నాడు తెలుగు నేల వ్యాప్తంగా ఇంకుడు గుంతలు వేలు, లక్షలు, కోట్ల కొద్దీ ఏర్పాటయ్యాయి. రైతులు అయితే ఇంకుడు గుంతలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చంద్రబాబు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో చంద్రబాబు సంకల్పం మేరకు భూగర్భ జలాల పరిమాణం భారీగానే పెరిగిపోయింది.
ఇక ఇప్పుడు పంట కుంటల పేరిట పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. రాయలసీమ ముఖద్వారా కర్నూలుకు కూతవేటు దూరంలోని ఓర్వకల్లు మండలం పూడిచెర్ల పరిధిలో పంట కుంటలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఎంపిక చేసిన స్థలంలో పంట కుంటలకు పవన్ భూమి పూజ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్… పంట కుంటల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల మేర పంట కుంటలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగుతున్నామని ఆయన చెప్పారు. ఇది నిరంతర ప్ర్రక్రియగా కొనసాగాల్సి ఉందని కూడా ఆయన పిలుపునిచ్చారు. పంట కుంటల చుట్టూ ఆకు కూరలు, కూరగాయల మొక్కలను పెంచుకోవాలని పవన్ సూచించారు.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…