Political News

ప‌వ‌న్ ప్ర‌యోగాలు.. సైనికుల ప‌రేషాన్లు..!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న ప్ర‌యోగాలు.. జ‌న‌సేన నాయ‌కుల‌కు ఇబ్బందిగా మారుతున్నాయి. సాధార‌ణంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి, పార్టీలో ఉన్న‌వారికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ, పార్టీ కార్య‌క్ర‌మాలు స‌హా.. ఇత‌ర ప‌దవుల విష‌యంలో తాను ఎంపిక చేసుకున్న వారికి ప‌వ‌న్ అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. దీంతో కేడ‌ర్ మాట ఎలా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో గ‌త ఏడాది ఎన్నిక ల్లో పార్టీ విజ‌యం కోసం కృషి చేసిన‌వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వాస్త‌వానికి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం పంచుకుని ప‌ది మాసాలు అయిన‌ప్ప‌టికీ.. పార్టీలో కీల‌క ప‌ద‌వుల‌ను ఇప్ప‌టికీ భ‌ర్తీ చేయ‌లేదు. మంత్రిగా ఉన్న నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను పీఏసీ చైర్మ‌న్ నుంచి త‌ప్పించి.. మ‌రో కీల‌క నేత‌కు అప్ప‌గిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. ఆ మేర‌కు ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ, అలా చేయ‌లేదు. పైగా.. ఆయ‌న‌నే కొన‌సాగిస్తున్న‌ట్టు సంకేతాలు ఇచ్చారు. అటు ప్ర‌భుత్వంలోనూ.. ఇటు పార్టీలోనూ.. నాదెండ్ల చ‌క్రం తిప్పుతున్నారు.

దీంతో ఈ ప‌ద‌విని ఆశించిన కీల‌క నాయ‌కులు, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, బూత్ స్థాయిలో పార్టీని నిల‌బెట్టేందుకు.. ఎక్క‌డా ప్ర‌య‌త్నాలు చేస్తున్న దాఖ‌లా కూడా క‌నిపించ‌డం లేదు. ఇది కూడా.. క్షేత్ర‌స్థాయిలో జెండా మోస్తున్న‌వారిని నిరాశ క‌లిగిస్తున్న అంశం. అదేవిధంగా పార్టీని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని.. ప‌దవుల‌ను క‌ల్పించాల‌ని కొన్నాళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై కూడా జ‌న‌సేన అధినేత ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు.

మ‌రీ ముఖ్యంగా ప్ర‌స్తుతం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్ల‌మెంటు స్థానాల్లో కేవ‌లం 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు స్థానాల్లోనే పార్టీ మ‌నుగ‌డ క‌నిపిస్తోంది. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల నాటిని నాయ‌కుల‌ను పెంచుకునేందుకు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లాన్ని పెంచుకునేందుకు జ‌న‌సేన‌నానిప్ర‌య‌త్నాలు సాగించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కూట‌మిలో భాగ‌స్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీలు మాత్రం క్షేత్ర‌స్థాయిలో పార్టీల‌ను పుంజుకునేలా చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం, జ‌న‌సేన త‌ర‌ఫున ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌డ‌క‌పోవ‌డంతో సేన‌లు అల్లాడుతున్నాయి.

This post was last modified on March 21, 2025 3:46 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

2 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

5 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

5 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

6 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

6 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

7 hours ago