జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయోగాలు.. జనసేన నాయకులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సాధారణంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి, పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ, పార్టీ కార్యక్రమాలు సహా.. ఇతర పదవుల విషయంలో తాను ఎంపిక చేసుకున్న వారికి పవన్ అవకాశం కల్పిస్తున్నారు. దీంతో కేడర్ మాట ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో గత ఏడాది ఎన్నిక ల్లో పార్టీ విజయం కోసం కృషి చేసినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకుని పది మాసాలు అయినప్పటికీ.. పార్టీలో కీలక పదవులను ఇప్పటికీ భర్తీ చేయలేదు. మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ను పీఏసీ చైర్మన్ నుంచి తప్పించి.. మరో కీలక నేతకు అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. ఆ మేరకు ప్రచారం కూడా జరిగింది. కానీ, అలా చేయలేదు. పైగా.. ఆయననే కొనసాగిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. అటు ప్రభుత్వంలోనూ.. ఇటు పార్టీలోనూ.. నాదెండ్ల చక్రం తిప్పుతున్నారు.
దీంతో ఈ పదవిని ఆశించిన కీలక నాయకులు, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, బూత్ స్థాయిలో పార్టీని నిలబెట్టేందుకు.. ఎక్కడా ప్రయత్నాలు చేస్తున్న దాఖలా కూడా కనిపించడం లేదు. ఇది కూడా.. క్షేత్రస్థాయిలో జెండా మోస్తున్నవారిని నిరాశ కలిగిస్తున్న అంశం. అదేవిధంగా పార్టీని ప్రక్షాళన చేయాలని.. పదవులను కల్పించాలని కొన్నాళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై కూడా జనసేన అధినేత ప్రయత్నం చేయడం లేదు.
మరీ ముఖ్యంగా ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కేవలం 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లోనే పార్టీ మనుగడ కనిపిస్తోంది. కానీ, వచ్చే ఎన్నికల నాటిని నాయకులను పెంచుకునేందుకు నియోజకవర్గాల్లో బలాన్ని పెంచుకునేందుకు జనసేననానిప్రయత్నాలు సాగించకపోవడం గమనార్హం. కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీలు మాత్రం క్షేత్రస్థాయిలో పార్టీలను పుంజుకునేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడం, జనసేన తరఫున ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో సేనలు అల్లాడుతున్నాయి.
This post was last modified on March 21, 2025 3:46 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…