దివంగత ఎన్టీఆర్ నటన గురించి ఎంత చెప్పినా.. వేనేళ్ల పొగిడినా తక్కువే. ఆయన నటనకు మరింత అద్దం పట్టిన పాత్ర `దానవీరశూరకర్ణ` సినిమాలోని దుర్యోధనుడి పాత్ర. దీనిలో `ఏమంటివేమంటివి..` అంటూ సాగే.. డైలాగ్(దీనిని తిరుపతి వెంకటకవులు రాశారని అంటారు) ఎంతో ఫేమస్. సినిమా మొత్తం ఒక ఎత్తయితే.. అన్నగారి నోటి నుంచి గంగా ప్రవాహం మాదిరిగా దూసుకు వచ్చిన ఈ ఒక్క డైలాగ్ మరో ఎత్తు. ఆ డైలాగు.. చాలా కాలం పాటు సామాన్యుల నోట నానుడిగా మారిపోయింది.
తాజాగా ఇదే డైలాగుతో అదరగొట్టారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అచ్చం అలనాటి అన్నగారి వేష ధారణలో స్టేజ్పై ఆయన పలికించిన ఈ డైలాగు భావయుక్తంగా.. వినసొంపుగా అందరి నీ ఆకట్టుకుంది. పాండవపక్షానికి-కౌరవ పక్షానికీ మధ్య విలు విద్య, ఇతర విద్యల్లో పోటీ జరిగినప్పుడు.. సూత సుతడైన కర్ణుడు.. అర్జునుడితో విలు విద్య పోటీలో పాల్గొనేందుకు సిద్ధమవుతాడు. అప్పుడు ఇరు పక్షాలకు ఆచార్యుడైన ద్రోణుడు.. కర్ణుడిని అవమానించి.. ఆయన కులాన్ని ప్రస్తావిస్తాడు.
`కుల హీనుడు ఈ పరీక్షలో పాల్గొనేందుకు అర్హుడు కాద`ని తేలుస్తాడు ద్రోణుడు. ఈ సమయంలో దుర్యోధ నుడు తీవ్ర ఆగ్రహంతో తమ జాతి మొత్తం ఎలా సంకరమైందో వివరించే ఈ డైలాగు.. దాన వీర శూరకర్ణ సినిమాలో అత్యంత కీలకమైన స్థానం పొందింది. దీనిని ఆర్ ఆర్ ఆర్.. తాజాగారక్తి కట్టించారు. విజయవాడలోని ఎన్ కన్వెన్షన్లో గురువారం సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జరిగిన సాంస్కృతిక పోటీల్లో ఆర్ ఆర్ ఆర్ దుర్యోధనుడిగా ఏకపాత్రాభినయం చేశారు.
ఆయన డైలాగులకు ముగ్ధులైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇతర సభ్యులు, స్పీకర్ అయ్యన్న చప్పట్లతో హోరెత్తించారు. తమ తమ సీట్లలో నుంచి పైకిలేచి నిలబడి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆర్ ఆర్ ఆర్లో పొలిటికల్ ఫైర్తో పాటు.. కళా పోషణ కూడా ఉందని ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంలు వ్యాఖ్యానించడం విశేషం.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…