Political News

అదేంటీ… సభకు రాకుండానే ప్రశ్నలు వేస్తున్నారా?

ఏపీ అసెంబ్లీలో ఓ వింత పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీకి సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే సభలో అధికార కూటమి పక్షాన్ని మినహాయిస్తే… మిగిలింది ఒకే ఒక్క విపక్షం అయిన తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ హోదా వచ్చే దాకా సభకు వచ్చేది లేదని ఆయన ఆదిలోనే తేల్చేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒక సారి… ఆ తర్వాత నిర్ణీత రోజుల్లోగా సభకు రాకపోతే సస్పెన్షన్ వేటు పడుతుందన్న భావనతో ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారు. ఆ తర్వాత వారు సభకే రావడం లేదు. అయినా గానీ… ఆయా అంశాలపై సభలో అధికార పక్షానికి వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నలు సంధించడం ప్రజా ప్రతినిధులుగా వైసీపీ సభ్యులది గురుతర బాధ్యతే. అయితే ఆ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం, వాటిని పరిష్కరించే దిశగా అధికార పక్షంపై ఒత్తిడి తీసుకు రావడం, ఆయా శాఖల మంత్రులపై మరిన్ని ప్రశ్నలు సంధించి… ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాల్సిన గురుతర బాధ్యత కూడా వారిపై ఉంది కదా. తొలి బాధ్యతను నెరవేరుస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు రెండో బాధ్యతను మాత్రం విస్మరిస్తున్నారనే చెప్పాలి. ప్రశ్నలు అడిగిన సభ్యులు సభకు హాజరు కాకపోతే… ఆయా ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చేసి మంత్రులు కూడా చేతులు దులుపుకునే అవకాశాలే ఎక్కువ కదా. అంటే.. ఆయా సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది కదా.

ఇలాంటి ఘటనే సోమవారం నాటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టీడీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో కీలకమైన రవాణా శాఖతో పాటు యువజన, క్రీడల శాఖ మంత్రిగానూ కొనసాగుతున్నారు. రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని ఏదో శాఖకు సంబంధించిన ప్రశ్నను వైసీపీకి చెందిన ఓ సభ్యుడు సంధించారు. ఆ ప్రశ్న సోమవారం నాటి సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. అయితే ప్రశ్నను సంధించిన సభ్యుడు సభలో లేకపోవడంతో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేసినట్టుగా భావిస్తున్నామంటూ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు తదుపరి ప్రశ్నకు వెళ్లిపోయారు. అంతేకాకుండా ప్రశ్నించిన సభ్యుడు సభకు రాలేదని, ఇకపై వస్తారో, రారో కూడా తెలియదని కూడా రాజు ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఫలితంగా సదరు ప్రశ్న ఏ అంశానికి సంబంధించినది అన్న విషయం కూడా జనానికి తెలియకుండా పోయింది.

This post was last modified on March 17, 2025 12:27 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

14 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

25 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

41 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

1 hour ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago