Political News

అదేంటీ… సభకు రాకుండానే ప్రశ్నలు వేస్తున్నారా?

ఏపీ అసెంబ్లీలో ఓ వింత పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీకి సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే సభలో అధికార కూటమి పక్షాన్ని మినహాయిస్తే… మిగిలింది ఒకే ఒక్క విపక్షం అయిన తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ హోదా వచ్చే దాకా సభకు వచ్చేది లేదని ఆయన ఆదిలోనే తేల్చేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒక సారి… ఆ తర్వాత నిర్ణీత రోజుల్లోగా సభకు రాకపోతే సస్పెన్షన్ వేటు పడుతుందన్న భావనతో ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారు. ఆ తర్వాత వారు సభకే రావడం లేదు. అయినా గానీ… ఆయా అంశాలపై సభలో అధికార పక్షానికి వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నలు సంధించడం ప్రజా ప్రతినిధులుగా వైసీపీ సభ్యులది గురుతర బాధ్యతే. అయితే ఆ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం, వాటిని పరిష్కరించే దిశగా అధికార పక్షంపై ఒత్తిడి తీసుకు రావడం, ఆయా శాఖల మంత్రులపై మరిన్ని ప్రశ్నలు సంధించి… ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాల్సిన గురుతర బాధ్యత కూడా వారిపై ఉంది కదా. తొలి బాధ్యతను నెరవేరుస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు రెండో బాధ్యతను మాత్రం విస్మరిస్తున్నారనే చెప్పాలి. ప్రశ్నలు అడిగిన సభ్యులు సభకు హాజరు కాకపోతే… ఆయా ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చేసి మంత్రులు కూడా చేతులు దులుపుకునే అవకాశాలే ఎక్కువ కదా. అంటే.. ఆయా సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది కదా.

ఇలాంటి ఘటనే సోమవారం నాటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టీడీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో కీలకమైన రవాణా శాఖతో పాటు యువజన, క్రీడల శాఖ మంత్రిగానూ కొనసాగుతున్నారు. రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని ఏదో శాఖకు సంబంధించిన ప్రశ్నను వైసీపీకి చెందిన ఓ సభ్యుడు సంధించారు. ఆ ప్రశ్న సోమవారం నాటి సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. అయితే ప్రశ్నను సంధించిన సభ్యుడు సభలో లేకపోవడంతో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేసినట్టుగా భావిస్తున్నామంటూ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు తదుపరి ప్రశ్నకు వెళ్లిపోయారు. అంతేకాకుండా ప్రశ్నించిన సభ్యుడు సభకు రాలేదని, ఇకపై వస్తారో, రారో కూడా తెలియదని కూడా రాజు ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఫలితంగా సదరు ప్రశ్న ఏ అంశానికి సంబంధించినది అన్న విషయం కూడా జనానికి తెలియకుండా పోయింది.

This post was last modified on March 17, 2025 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago