సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో సీరియస్గానే యాక్షన్ తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే.. వారిని ప్రశ్నించడం వరకు పరిమితం కావాలని, కానీ, వారి ఇంట్లో ఆడవాళ్లు ఏం తప్పులు చేశారని వారిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని ఆయన నిలదీశారు. అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడిన రేవంత్రెడ్డి.. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై స్పందించారు.
“నేను ప్రజాజీవితంలో ఉన్నా. నన్ను విమర్శించండి. కానీ, నా భార్య, నా బిడ్డ ఏం చేసిన్రు? వారిని ఎందుకు తిట్టాలి. అది కూడా బండ బూతులతోనా? ఇలాంటి వారు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. వీరు ఏం జర్నలిస్టులు? ఎవరో ముక్కు మొహం తెలియని వారు ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఇష్టాను సారం కామెంట్లు చేస్తే.. అది ఏం జర్నలిజం? వారు ఎలాంటి జర్నలిస్టులు?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించా రు. ఇలాంటి కామెంట్లు చదివినా.. విన్నా అన్నం కూడా తినాలని అనిపించడం లేదన్నారు.
“ఈ కామెంట్లు చేసిన వారికి ఒక్కటే చెబుతున్నా.. ఒక్కసారి నా పేరు తీసేసి మీరు మీ పేరు పెట్టుకోండి. అప్పుడు ఏమనిపిస్తుందో చూడండి” అని వ్యాఖ్యానించారు. భూభారతి పేరుతో తనపై వస్తున్న కామెంట్లు చదివేందుకు కూడా మనస్కరించడం లేదని అన్నారు. ఇలాంటి వారికి తోలు తీస్తానని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భూభారతి పేరుతో పేదల భూములను వారికే చెందేలా చేస్తున్న తన ప్రయత్నం తప్పా? అని ప్రశ్నించారు. దీనిని అడ్డు పెట్టుకుని తమపై విమర్శలు చేయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెయిడ్ ఆర్టిస్టులతో చేయిస్తున్న ఇలాంటి వీడియోలు అత్యంత దారుణంగా ఉంటున్నాయని సీఎం చెప్పారు. ఇలాంటివి చేయడానికి అసలు మనసు ఎలా వస్తోందని నిలదీశారు. సమస్యలు ఉంటే ఉండొ చ్చునని.. వాటిని హ్యాండిల్ చేయాల్సిన తీరు మాత్రం ఇలా కాదన్నారు. “ఇంతలేసి మాటలు మీ నోటికి ఎలా వస్తున్నాయి. మీరు మనుషులేనా? మీకు భార్య, పిల్లలు లేరా?” అని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
This post was last modified on March 15, 2025 7:37 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…