Political News

ఇవన్నీ సెట్ చేశాకే.. ఎవరి ఊళ్లకు వారిని పంపిస్తారట

ఇంటర్వ్యూకు వచ్చి ఒకరు.. ఎగ్జామ్ కు వచ్చి మరొకరు.. ఫంక్షన్ కు వచ్చి ఇంకొకరు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. దేశంలోని లక్షలాది మంది లాక్ డౌన్ పుణ్యమా అని ఊరు కాని ఊళ్లో చిక్కుకుపోవటం తెలిసిందే.

ఇంటికి దూరంగా.. ఇన్నేసి రోజులు ఉండని ఎంతోమంది ఇబ్బందిగా ఉన్నా.. తప్పనిసరిగా తమకేమాత్రం అనుకూలంగా లేని చోట్ల ఉండిపోవాల్సిన దుస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉపాధి కోసం ఒకరాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లే వేలాదిమంది వలసకూలీలు..కార్మికుల పరిస్థితి మరింత దారుణం.

వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్లకు వెళ్లలేక.. అలా అని ఉన్నచోట ఉండలేక.. ఉపాధి లేక.. ఆకలితో పడుతున్న పాట్లు అన్నిఇన్నికావు. ఇలాంటి కష్టాలు ఇంకెన్నిరోజులు భగవంతుడా? అన్న ప్రశ్నకు కేంద్రం తాజాగా స్పందించింది. ఎవరి ఊళ్లకు వారు వెళ్లేందుకు వీలుగా అనుమతులు ఇవ్వటంతో పాటు.. అందుకు తగ్గ కసరత్తుల్ని రాష్ట్రాల్ని షురూ చేయమంది.

ఇప్పటికిప్పుడు ప్రజారవాణా (విమానాలు.. రైళ్లు.. బస్సులు) నడిచే వీలు లేని వేళ.. ప్రత్యేక ఏర్పాట్లు చేయటం ద్వారా ఊళ్లకు తరలించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇంతకూ.. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని వారి స్వస్థలాలకు ఎలా చేరుస్తారు? అందుకు తగ్గ కసరత్తు ఎలా జరగనుంది? ఏ ప్రాతిపదికన ఊళ్లకు పంపేలా అధికారులు నిర్ణయం తీసుకుంటారు? లాంటి ప్రశ్నలకు కచ్ఛితమైన సమాధానాలు లేవు.

అయితే.. ఇలాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. కాకుంటే.. ఊళ్లకు తరలించే వారి విషయంలో కొన్ని విషయాల్లో ఏం చేయాలన్న అంశంపై క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి. వేరే ఊళ్లకు వెళ్లేందుకు అనుమతించే వారిని ముందుగా స్క్రీనింగ్ చేస్తారు. కరోనా లక్షణాలు కనిపించని వారినే ప్రయాణానికి అనుమతిస్తారు. రవాణాకు బస్సుల్ని మాత్రమే ఉపయోగిస్తారు.
ప్రయాణానికి ముందుగా బస్సుల్ని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తారు. సీట్లలో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటారు.

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కూలీలు.. వలస కార్మికులు.. ఇతరులు వెళ్లటానికి వీలుగా వారు ప్రయాణించే మార్గంలోని రాష్ట్రాల వారు సహకారం అందించాలి. తమ గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత స్థానిక అధికారులు.. వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి.. వారందరిని హోం క్వారంటైన్ చేయాలి. అలా కాదనుకుంటే.. అందరికి పూర్తిస్థాయి క్వారంటైన్ కేంద్రాలకు పంపి.. అక్కడ వారిపై నిఘా పెట్టాలని. వారి ఆరోగ్యాన్ని తరచూ పరిశీలించాలి. క్వారంటైన్ గడువు పూర్తి అయ్యాక వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించాలి.

కేంద్రం ప్రయాణాలకు అనుమతి ఇచ్చినా.. మిగిలిన ఏర్పాట్లు జరగటానికి.. ఎవరు ఏయే ప్రాంతాలకు వెళ్లాలన్న విషయాన్ని తేల్చేందుకు.. అందుకు తగ్గ రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన నియమావళిని రానున్న రెండు..మూడు రోజుల్లో విడుదల చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on April 30, 2020 10:47 am

Share

Recent Posts

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

38 minutes ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

8 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

9 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

9 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

10 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

12 hours ago