బహు భాషా చిత్రాల నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి అడుగును విమర్శిస్తూ సాగుతున్న ప్రకాశ్ రాజ్… మోదీతో పాటు బీజేపీకి ఎవరు అనుకూలంగా స్పందించినా… వారిపై వెనువెంటనే ప్రతిస్పందిస్తున్నారు. తాజాాగా తమిళ ప్రజలు వ్యతిరేకిస్తున్న త్రిభాషా సిద్ధాంతంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. శుక్రవారం జనసేన 12వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మాట్లాడిన పవన్ త్రిభాషా సిద్ధాంతం సరికాదని… ఇంకా చెప్పాలంటే బహు భాషా సిద్ధాంతాన్ని అవలంబించాలని కూడా సూచించిన సంగతి తెలిసిందే.
పవన్ ప్రసంగాన్ని తెలుగు ప్రజలతో పాటుగా తమిళ, కన్నడ, మరాఠీలు సహా ప్రకాశ్ రాజ్ కూడా సాంతం విన్నట్టుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి పవన్ తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేసిన ప్రకాశ్ రాజ్… పవన్ వ్యాఖ్యలపై తనదైన శైలి ప్రతిస్పందనను తెలియజేశారు. ”మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం… ఇంకో భాషను ద్వేషించడం కాదు. ‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్” అని ఆయన తన పోస్టులో తెలియజేశారు. ఇదంతా బాగానేే ఉన్నా… పవన్ కు ఎవరైనా చెప్పడం ప్లీజ్ అనే ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు అయితే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
వాస్తవానికి టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ప్రకాశ్ రాజ్ బాగా దగ్గరగానే ఉంటారు. తన ప్రయాణం మెగా ఫ్యామిలీతోనే అన్నట్లుగా కూడా ఆయన సాగుతూ ఉంటారు. ఇటీవలి మా అసోసియేషన్ ఎన్నికల్లో మెగా మద్దతుతోనే ఆయన బరిలోకి దిగారు కూడా. అయితే ఆ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓడిపోయినా… మెగా ఫ్యామిలీకి దూరమైతే జరగలేదనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో మెగా బ్రదర్ అయిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రకాశ్ రాజ్ పోస్టు పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా పవన్ తమిళనాడ వెలుగు చూసిన సంస్కృతిని ప్రశ్నిస్తే… కర్ణాటకకు చెందిన ప్రకాశ్ రాజ్ స్పందించడం మరీ వింతగా ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
This post was last modified on March 15, 2025 11:29 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…