Political News

పవన్ ‘త్రిభాష’ కామెంట్లపై ప్రకాశ్ రాజ్ కౌంటర్

బహు భాషా చిత్రాల నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి అడుగును విమర్శిస్తూ సాగుతున్న ప్రకాశ్ రాజ్… మోదీతో పాటు బీజేపీకి ఎవరు అనుకూలంగా స్పందించినా… వారిపై వెనువెంటనే ప్రతిస్పందిస్తున్నారు. తాజాాగా తమిళ ప్రజలు వ్యతిరేకిస్తున్న త్రిభాషా సిద్ధాంతంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. శుక్రవారం జనసేన 12వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మాట్లాడిన పవన్ త్రిభాషా సిద్ధాంతం సరికాదని… ఇంకా చెప్పాలంటే బహు భాషా సిద్ధాంతాన్ని అవలంబించాలని కూడా సూచించిన సంగతి తెలిసిందే.

పవన్ ప్రసంగాన్ని తెలుగు ప్రజలతో పాటుగా తమిళ, కన్నడ, మరాఠీలు సహా ప్రకాశ్ రాజ్ కూడా సాంతం విన్నట్టుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి పవన్ తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేసిన ప్రకాశ్ రాజ్… పవన్ వ్యాఖ్యలపై తనదైన శైలి ప్రతిస్పందనను తెలియజేశారు. ”మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం… ఇంకో భాషను ద్వేషించడం కాదు. ‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్” అని ఆయన తన పోస్టులో తెలియజేశారు. ఇదంతా బాగానేే ఉన్నా… పవన్ కు ఎవరైనా చెప్పడం ప్లీజ్ అనే ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు అయితే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

వాస్తవానికి టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ప్రకాశ్ రాజ్ బాగా దగ్గరగానే ఉంటారు. తన ప్రయాణం మెగా ఫ్యామిలీతోనే అన్నట్లుగా కూడా ఆయన సాగుతూ ఉంటారు. ఇటీవలి మా అసోసియేషన్ ఎన్నికల్లో మెగా మద్దతుతోనే ఆయన బరిలోకి దిగారు కూడా. అయితే ఆ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓడిపోయినా… మెగా ఫ్యామిలీకి దూరమైతే జరగలేదనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో మెగా బ్రదర్ అయిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రకాశ్ రాజ్ పోస్టు పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా పవన్ తమిళనాడ వెలుగు చూసిన సంస్కృతిని ప్రశ్నిస్తే… కర్ణాటకకు చెందిన ప్రకాశ్ రాజ్ స్పందించడం మరీ వింతగా ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

This post was last modified on March 15, 2025 11:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

42 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago