బహు భాషా చిత్రాల నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి అడుగును విమర్శిస్తూ సాగుతున్న ప్రకాశ్ రాజ్… మోదీతో పాటు బీజేపీకి ఎవరు అనుకూలంగా స్పందించినా… వారిపై వెనువెంటనే ప్రతిస్పందిస్తున్నారు. తాజాాగా తమిళ ప్రజలు వ్యతిరేకిస్తున్న త్రిభాషా సిద్ధాంతంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. శుక్రవారం జనసేన 12వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మాట్లాడిన పవన్ త్రిభాషా సిద్ధాంతం సరికాదని… ఇంకా చెప్పాలంటే బహు భాషా సిద్ధాంతాన్ని అవలంబించాలని కూడా సూచించిన సంగతి తెలిసిందే.
పవన్ ప్రసంగాన్ని తెలుగు ప్రజలతో పాటుగా తమిళ, కన్నడ, మరాఠీలు సహా ప్రకాశ్ రాజ్ కూడా సాంతం విన్నట్టుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి పవన్ తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేసిన ప్రకాశ్ రాజ్… పవన్ వ్యాఖ్యలపై తనదైన శైలి ప్రతిస్పందనను తెలియజేశారు. ”మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం… ఇంకో భాషను ద్వేషించడం కాదు. ‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్” అని ఆయన తన పోస్టులో తెలియజేశారు. ఇదంతా బాగానేే ఉన్నా… పవన్ కు ఎవరైనా చెప్పడం ప్లీజ్ అనే ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు అయితే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
వాస్తవానికి టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ప్రకాశ్ రాజ్ బాగా దగ్గరగానే ఉంటారు. తన ప్రయాణం మెగా ఫ్యామిలీతోనే అన్నట్లుగా కూడా ఆయన సాగుతూ ఉంటారు. ఇటీవలి మా అసోసియేషన్ ఎన్నికల్లో మెగా మద్దతుతోనే ఆయన బరిలోకి దిగారు కూడా. అయితే ఆ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓడిపోయినా… మెగా ఫ్యామిలీకి దూరమైతే జరగలేదనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో మెగా బ్రదర్ అయిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రకాశ్ రాజ్ పోస్టు పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా పవన్ తమిళనాడ వెలుగు చూసిన సంస్కృతిని ప్రశ్నిస్తే… కర్ణాటకకు చెందిన ప్రకాశ్ రాజ్ స్పందించడం మరీ వింతగా ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
This post was last modified on March 15, 2025 11:29 am
‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…