Political News

మానాన్న‌కు న్యాయం ఎప్పుడు? : సునీత‌

మా నాన్న‌కు న్యాయం ఎప్పుడు జ‌రుగుతుంది? మాకు ఎప్పుడు న్యాయం ల‌భిస్తుంది? అని వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ మ‌ర్రెడ్డి సునీత ఆవేద‌న‌గా ప్ర‌శ్నించారు. నేడు (మార్చి 15) వివేకానంద‌రెడ్డి 6వ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని వివేకా స‌మాధి వ‌ద్ద ఆమె కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నివాళుల‌ర్పించా రు. ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన సునీత‌.. త‌న తండ్రి కేసులో బాధ్యులు ఎవ‌రో.. ఎక్క‌డున్నారో అంద‌రికీ తెలిసినా.. వారికి మాత్రం ఏమీ కావ‌డం లేద‌న్నారు.

“మా నాన్న హ‌త్య‌కు గురై.. న‌ష్ట‌పోయింది మేం. ఇప్పుడు కూడా కేసు ముందుకు సాగ‌క‌పోవ‌డంతో న‌ష్ట‌పోతోంది కూడా మేమే. పైగా బాధితుల‌మైన‌ మ‌మ్మ‌ల్ని నిందితులుగా చూపిస్తున్నారు” అని సునీత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వివేకా హ‌త్య‌పై ఎంత పోరాటం చేసినా.. త‌మ‌కు న్యాయం ల‌భించ‌డం లేద‌న్నారు. నిందితులు త‌ప్పించుకుంటున్నారా? అనేది కూడా ప్ర‌శ్న‌గా మారింద‌న్నారు. వ‌రుస‌గా సాక్షులు చ‌నిపోతున్నార‌ని.. దీనివెనుక ఏం జ‌రుగుతోందో కూడా అర్ధం కావ‌డం లేద‌న్నారు.

రాష్ట్ర‌ప్ర‌భుత్వం త‌మ కుటుంబానికి అండ‌గా నిల‌వాల‌ని సునీత వేడుకున్నారు. అయితే.. త‌మ తండ్రి త‌ర‌ఫున న్యాయం కోసం ఎంత వ‌ర‌కైనా పోరాటం చేస్తామ‌ని సునీత తెలిపారు. సీబీఐ మ‌ళ్లీ ఈ కేసును జీరో లెవిల్ నుంచి విచార‌ణ జ‌రిపించాల‌ని తాను కోరుతున్న‌ట్టు తెలిపారు. “హ‌త్యకు పురిగొల్పిన వారు క‌ళ్ల ముందే క‌నిపిస్తున్నారు. అయినా మాకు న్యాయం జ‌ర‌గ‌డం లేదు. అస‌లు ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌డం లేదు” అని సునీత వ్యాఖ్యానించారు.

ఏం జ‌రిగింది?

2019, మార్చి 15న వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ కేసు అనేక మ‌లుపులు తిరిగింది. సీబీఐ విచార‌ణ జ‌రిగినా.. కూడా ఈ కేసులో నిందితులు ఎవ‌రు అనేది ఇప్ప‌టి వ‌ర‌కు తేల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరికి సైతం బెదిరింపులు ఎదుర‌య్యాయి. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ కొన‌సాగుతూనే ఉంది. మ‌రి ఎప్ప‌టికి తేలుతుంద‌నేది ప్ర‌శ్న‌గామారింది.

This post was last modified on March 15, 2025 10:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

11 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

4 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

4 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago