Political News

మానాన్న‌కు న్యాయం ఎప్పుడు? : సునీత‌

మా నాన్న‌కు న్యాయం ఎప్పుడు జ‌రుగుతుంది? మాకు ఎప్పుడు న్యాయం ల‌భిస్తుంది? అని వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ మ‌ర్రెడ్డి సునీత ఆవేద‌న‌గా ప్ర‌శ్నించారు. నేడు (మార్చి 15) వివేకానంద‌రెడ్డి 6వ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని వివేకా స‌మాధి వ‌ద్ద ఆమె కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నివాళుల‌ర్పించా రు. ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన సునీత‌.. త‌న తండ్రి కేసులో బాధ్యులు ఎవ‌రో.. ఎక్క‌డున్నారో అంద‌రికీ తెలిసినా.. వారికి మాత్రం ఏమీ కావ‌డం లేద‌న్నారు.

“మా నాన్న హ‌త్య‌కు గురై.. న‌ష్ట‌పోయింది మేం. ఇప్పుడు కూడా కేసు ముందుకు సాగ‌క‌పోవ‌డంతో న‌ష్ట‌పోతోంది కూడా మేమే. పైగా బాధితుల‌మైన‌ మ‌మ్మ‌ల్ని నిందితులుగా చూపిస్తున్నారు” అని సునీత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వివేకా హ‌త్య‌పై ఎంత పోరాటం చేసినా.. త‌మ‌కు న్యాయం ల‌భించ‌డం లేద‌న్నారు. నిందితులు త‌ప్పించుకుంటున్నారా? అనేది కూడా ప్ర‌శ్న‌గా మారింద‌న్నారు. వ‌రుస‌గా సాక్షులు చ‌నిపోతున్నార‌ని.. దీనివెనుక ఏం జ‌రుగుతోందో కూడా అర్ధం కావ‌డం లేద‌న్నారు.

రాష్ట్ర‌ప్ర‌భుత్వం త‌మ కుటుంబానికి అండ‌గా నిల‌వాల‌ని సునీత వేడుకున్నారు. అయితే.. త‌మ తండ్రి త‌ర‌ఫున న్యాయం కోసం ఎంత వ‌ర‌కైనా పోరాటం చేస్తామ‌ని సునీత తెలిపారు. సీబీఐ మ‌ళ్లీ ఈ కేసును జీరో లెవిల్ నుంచి విచార‌ణ జ‌రిపించాల‌ని తాను కోరుతున్న‌ట్టు తెలిపారు. “హ‌త్యకు పురిగొల్పిన వారు క‌ళ్ల ముందే క‌నిపిస్తున్నారు. అయినా మాకు న్యాయం జ‌ర‌గ‌డం లేదు. అస‌లు ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌డం లేదు” అని సునీత వ్యాఖ్యానించారు.

ఏం జ‌రిగింది?

2019, మార్చి 15న వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ కేసు అనేక మ‌లుపులు తిరిగింది. సీబీఐ విచార‌ణ జ‌రిగినా.. కూడా ఈ కేసులో నిందితులు ఎవ‌రు అనేది ఇప్ప‌టి వ‌ర‌కు తేల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరికి సైతం బెదిరింపులు ఎదుర‌య్యాయి. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ కొన‌సాగుతూనే ఉంది. మ‌రి ఎప్ప‌టికి తేలుతుంద‌నేది ప్ర‌శ్న‌గామారింది.

This post was last modified on March 15, 2025 10:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

4 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

5 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

6 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

6 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

7 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

7 hours ago