Political News

పవన్ ప్రసంగంతో ఉప్పొంగిన చిరంజీవి!

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని చిత్రాడలో జయకేతనం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేదికపై నుంచి పవన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు తమిళనాడు,కర్ణాటక, మహారాష్ట్రల ప్రజలు కూడా రాత్రి పొద్దుపోయేదాకా టీవీ తెరలకే అతుక్కుపోయారు. వారిలో పవన్ సోదరుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఈ వేడుకల్లో చిరు నేరుగా పాల్గొనకున్నా.. సభను సాంతం ఆయన లైవ్ లో వీక్షించారు. పవన్ స్పీచ్ ను చూసి ఆయన ఉప్పొంగిపోయారు.

పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించిన తీరు నిజంగానే అందరినీ ఆకట్టుకుంది. ఎక్కడ కూడా తడబడకుండా.. ఆయా అంశాలపై లోతైన విశ్లేషణతో ఆయన చేసిన ప్రసంగం.. ఎంతో పరిణతి సాధించిన నేతను పవన్ లో చూపించింది. ఈ ప్రసంగాన్ని సాంతం విన్న చిరంజీవి… పవన్ అలా తన ప్రసంగాన్ని ముగించారో, లేదో… ఇలా సోషల్ మీడియాను తెరచిన చిరు… పవన్ ప్రసంగం తనను ఎంతలా మెస్మరైజ్ చేసిందన్న విషయాన్ని తెలియజేశారు. మై డియర్ బ్రదర్ అంటూ ఆ సందేశాన్ని ప్రారంభించిన చిరంజీవి…జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్రముగ్ధుడినయ్యాను అంటూ చిరు తన మనసులోని మాటను బయటపెట్టారు.

అంతటితోనే ఆగని చిరంజీవి… సబకు వచ్చిన అశేష జన సంద్రం మాదిరే తన మనసు కూడా ఉప్పొంగిందని కూడా చిరు పేర్కొన్నారు. ఈ ప్రసంగం వింటే.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు వచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందని కూడా చిరు తన సందేశంలో ప్రస్తావించారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్రను నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నానంటూ… తన సోదరుడికి చిరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. జన సైనికులందరికీ చిరు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పోస్ట్ అయిన ఈ సందేశం శనివారం ఉదయానికి కూడా వైరల్ గానే కొనసాగుతోంది.

This post was last modified on March 15, 2025 10:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago