జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను ప్రభావితం చేసిన ఎందరెందరో ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ… వారితో తన అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ సాగారు. ఏపీ కేంద్రంగానే రాజకీయం చేస్తున్న తాను… తనలోని తెలంగాణ మూలాలను ఎన్నటికీ మరువలేనని ఆయన అన్నారు. ఈ క్రమంలో ప్రముఖ కవి దాశరథి రంగాచార్యను గుర్తు చేసుకున్న పవన్.. తెలంగాణకు చెందిన ఓ కవి రచనలను చదివే తాను పెరిగానని, రాజకీయంగా ప్రభావితం అయ్యానని తెలిపారు. తనపై దాశరథి రచనల ప్రభావం ఎంతగానో ఉందని ఆయన చెప్పారు.
ఇక ఆ తర్వాత ప్రజా కవి గద్దర్ ను గుర్తు చేసుకున్న పవన్… తనలోని రాజకీయ స్పృహను అందరికంటే ముందుగా గుర్తించింది గద్దరేనని గుర్తు చేసుకున్నారు. తాను నటించిన ఖుషీ సినిమాలోని ఓ పాటను చూసిన గద్దర్… తన సోదరుడు చిరంజీవి వద్దకు వచ్చి మరీ తనను కలవాలని కోరినట్లుగా గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తనను కలిసిన గద్దర్… ఆ సినిమా, అందులో ఆయనను కట్టిపడేసిన పాట… అందులో తాను చూపించిన దేశ భక్తి, దేశంపై తనకున్న వల్లమాలిన అభిమానం గురించి గద్దర్ ఆసక్తికరంగా వివరించారన్నారు. నాటి నుంచే గద్దర్ తో తన పరిచయం ఏర్పడి అలా ఏళ్ల తరబడి కొనసాగిందన్నారు. చివరకు గద్దర్ తనకు సోదరుడిగా మారిపోయారని కూడా పవన్ చెప్పారు.
ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీపతి రాములు గురించి పవన్ ప్రస్తావించారు. అంతేకాకుండా సభకు హాజరైన రాములును ఆయన వేదిక మీదకు పిలిపించి మరీ ఘనంగా సత్కరించారు. తనలోని రాజకీయ పరిణతిని తన సినిమాల్లోనే గుర్తించిన రాములు… నాడు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తున్నా… తనతో బేటీ కోసం ఆయన హైదరాబాద్ వచ్చారని… తనతో బేటీకి చాలా యత్నించారని…చివరకు తనతో సమావేశమై తనలోని సామాజిక స్పృహను తెలియజెప్పారన్నారు.
అంతేకాకుండా రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించగా… తనకు ఇంకా అంత పరిణతి రాలేదని, వచ్చినప్పుడు చూద్దామని చెప్పానన్నారు. ఆ తర్వాత వీలున్నప్పుడల్లా తనను కలిసిన రాములు… రాజకీయ ప్రవేశంపైనే మాట్లాడేవారన్నారు. ఇక తన రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైన సమయంలో రాములుకు ఆ విషయాన్ని చెప్పానని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాములు తనతో టచ్ లోనే ఉంటున్నారని తెలిపారు. అయితే ఏనాడూ తన నుంచి రాములు ఏమీ ఆశించలేదన్న పవన్… తాను ఓడినప్పుడు కూడా తనలో ఆత్మ స్థైర్యాన్ని నూరిపోశారన్నారు. నిత్యం తనకు మార్గదర్శిగా నిలిచిన రాములుకు అసలు జనసేనతోనే సంబంధం లేదని కూడా పవన్ చెప్పుకొచ్చారు.
This post was last modified on March 15, 2025 12:22 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…