సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో కార్తీ మార్కెట్ కి తిరిగి జీవం పోసింది కూడా ఈ బ్లాక్ బస్టరే. కేవలం ఒక రాత్రిలో జరిగే సంఘటనలు తీసుకుని పీక్స్ హీరోయిజం చూపించిన తీరుకి ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. ఏకంగా విజయ్ లాంటి స్టార్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడంటే అది ఖైదీ ప్రభావమే. అందుకే ఆ క్లాసిక్ అంటే అభిమానులకు తగని మక్కువ. అయితే ఆ సినిమాలో చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. ముఖ్యంగా కార్తీ ఎందుకు జైలుకొచ్చాడనే పాయింట్. ఇవన్నీ సీక్వెల్ లో చూపిస్తానని లోకేష్ చెబుతూ వచ్చాడు.
రజనీకాంత్ కూలి తర్వాత ఖైదీ 2నే మొదలవుతుందని చెన్నై వర్గాలు గతంలో ఉటంకించాయి. తాజా అప్డేట్ ప్రకారం ఇప్పుడీ సీక్వెల్ 2026 ఏప్రిల్ కి వాయిదా వేశారట. అంటే దీనికన్నా ముందు మరో సినిమా తీస్తాడానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సూర్యతో రోలెక్స్ ఏమైనా పట్టాలు ఎక్కిస్తాడానే డౌట్ కూడా వస్తోంది. క్లారిటీ ఏంటంటే కూలి ఈ దసరా లేదా దీపావళికి రిలీజవుతుంది. ఆ తర్వాత లోకేష్ కొంచెం బ్రేక్ తీసుకుంటాడు. అంటే డిసెంబర్ దాకా అనుకుందాం. కొత్త స్క్రిప్ట్ మొదలుపెట్టినా దానికో ఆరు నెలలు పైనే కావాలి. అంటే అటు ఇటుగా ఏప్రిల్ వచ్చేస్తుంది.
సో ఖైదీ 2నే నెక్స్ట్ అనే క్లారిటీ వస్తున్నట్టేగా. రోలెక్స్ కి ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే రెట్రో అయిపోయింది. 45వ సినిమా ఇంకా సగమే అయ్యింది. వెట్రిమారన్ వడివాసల్ కోసం సూర్య ఎక్కువ సమయం త్యాగం చేయాల్సి ఉంటుంది. వీటి మధ్యలో రోలెక్స్ అవ్వని పని. పోనీ విక్రమ్ 2 అనుకుంటే అటు కమల్ హాసన్ కూడా బిజీగా ఉన్నారు. సో ఖైదీ 2కి రూట్ క్లియర్ గా ఉందనేది ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఖచ్చితంగా ఇదే మొదలవుతుందా లేక లోకేష్ మనసు మారుతుందా అనేది వేచి చూడాలి. విపరీతమైన అంచనాలు మోస్తున్న కూలి కనక బ్లాక్ బస్టర్ అయితే లోకేష్ పేరు దేశం దాటి మారుమ్రోగడం ఖాయం.
This post was last modified on March 14, 2025 7:43 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…