సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో కార్తీ మార్కెట్ కి తిరిగి జీవం పోసింది కూడా ఈ బ్లాక్ బస్టరే. కేవలం ఒక రాత్రిలో జరిగే సంఘటనలు తీసుకుని పీక్స్ హీరోయిజం చూపించిన తీరుకి ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. ఏకంగా విజయ్ లాంటి స్టార్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడంటే అది ఖైదీ ప్రభావమే. అందుకే ఆ క్లాసిక్ అంటే అభిమానులకు తగని మక్కువ. అయితే ఆ సినిమాలో చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. ముఖ్యంగా కార్తీ ఎందుకు జైలుకొచ్చాడనే పాయింట్. ఇవన్నీ సీక్వెల్ లో చూపిస్తానని లోకేష్ చెబుతూ వచ్చాడు.
రజనీకాంత్ కూలి తర్వాత ఖైదీ 2నే మొదలవుతుందని చెన్నై వర్గాలు గతంలో ఉటంకించాయి. తాజా అప్డేట్ ప్రకారం ఇప్పుడీ సీక్వెల్ 2026 ఏప్రిల్ కి వాయిదా వేశారట. అంటే దీనికన్నా ముందు మరో సినిమా తీస్తాడానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సూర్యతో రోలెక్స్ ఏమైనా పట్టాలు ఎక్కిస్తాడానే డౌట్ కూడా వస్తోంది. క్లారిటీ ఏంటంటే కూలి ఈ దసరా లేదా దీపావళికి రిలీజవుతుంది. ఆ తర్వాత లోకేష్ కొంచెం బ్రేక్ తీసుకుంటాడు. అంటే డిసెంబర్ దాకా అనుకుందాం. కొత్త స్క్రిప్ట్ మొదలుపెట్టినా దానికో ఆరు నెలలు పైనే కావాలి. అంటే అటు ఇటుగా ఏప్రిల్ వచ్చేస్తుంది.
సో ఖైదీ 2నే నెక్స్ట్ అనే క్లారిటీ వస్తున్నట్టేగా. రోలెక్స్ కి ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే రెట్రో అయిపోయింది. 45వ సినిమా ఇంకా సగమే అయ్యింది. వెట్రిమారన్ వడివాసల్ కోసం సూర్య ఎక్కువ సమయం త్యాగం చేయాల్సి ఉంటుంది. వీటి మధ్యలో రోలెక్స్ అవ్వని పని. పోనీ విక్రమ్ 2 అనుకుంటే అటు కమల్ హాసన్ కూడా బిజీగా ఉన్నారు. సో ఖైదీ 2కి రూట్ క్లియర్ గా ఉందనేది ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఖచ్చితంగా ఇదే మొదలవుతుందా లేక లోకేష్ మనసు మారుతుందా అనేది వేచి చూడాలి. విపరీతమైన అంచనాలు మోస్తున్న కూలి కనక బ్లాక్ బస్టర్ అయితే లోకేష్ పేరు దేశం దాటి మారుమ్రోగడం ఖాయం.
This post was last modified on March 14, 2025 7:43 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…