కేంద్ర మాజీ మంత్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు, ఏపీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన జనసేన ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదిక తన సోదరుడికి ఆయన అభినందనలతో పాటు ఆశీస్సులను అందించారు. ఈ సందర్భంగా నా తమ్ముడు అంటూ చిరంజీవి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభా వేదికపై నాగబాబు ప్రసంగానికి కాసేపు ముందుగా చిరంజీవి తన గ్రీటింగ్స్ సందేశాన్ని పోస్ట్ చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఎమ్మెల్సీగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తొలిసారి అడుగు పెట్టబోబుతన్న నా తమ్ముడు నాగేంద్ర బాబుకు నా అభినందనలు, ఆశీస్సులు అంటూ చిరంజీవి సదరు సందేశంలో పేర్కొన్నారు. ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ… వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని… వారి అబిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తున్నానని చిరు ఆకాంక్షించారు. నాగబాబును అభినందిస్తూ చిరంజీవి పోస్ట్ చేసిన ఈ సందేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిమిషాల వ్యవధిలోనే వేల కొద్ది వ్యూస్ దక్కాయి. ఈ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో రాకెట్ లా దూసుకుపోతోందని చెప్పక తప్పదు.
ఏపీలో ఇటీవలే ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదికార కూటమికి మొత్తం 5 సీట్లు దక్కగా.. వాటిలో ఓ స్థానాన్ని నాగబాబుకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఓ సీట్లలో నాగబాబుకే తొలుత సీటు కేటాయింపు జరిగింది. తొలుత నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ కల్యాణ్ భావించినా.. చంద్రబాబు సలహాతో ఎమ్మెల్సీతో పాటు కేబినెట్ లోకి నాగబాబు ఎంట్రీకి ఒప్పుకున్న సంగతి తెలిసింది. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోగా… ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా చట్టసభలోకి అడుగుపెట్టబోతున్నారు. త్వరలోనే ఆయన మంత్రిగానూ కొలువుదీరనున్నారు. ఇలాంటి సందర్భంలో చిరంజీవి గురి చూసి పార్టీ ఆవిర్భావ వేడుకలపై తన సోదరుడు ఉన్న సమయంలో ఆయనను అభినందిస్తూ సందేశం పంపడం గమనార్హం.
This post was last modified on March 14, 2025 7:08 pm
మామూలుగా ఒక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఆలస్యంగా రిలీజైతే కొంచెం బజ్ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘రాబిన్…
అతడు.. తెలుగు ప్రేక్షకులు అత్యంత మెచ్చిన చిత్రాల్లో ఇది ముందు వరసలోఉంటుందనడంలో సందేహం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్…
చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల వ్యవహార తీరుకు సంబంధించి చట్టాల్లోని నియమ నిబంధనలు పెద్దగా పనిచేయడం లేదు. చట్టాలను పక్కనపెట్టేస్తున్న కొందరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం బస్సు డ్రైవర్ గా అవతారం…
బాహుబలి తర్వాత సీక్వెల్ ట్రెండ్ అనేది ఎంత పాపులరయ్యిందో చూస్తున్నాం. కెజిఎఫ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లు దానికి మరింత…
క్రికెట్ పండగ వస్తోంది. మార్చి 22 నుంచి మే 25 దాకా రెండు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్…