Political News

‘జయకేతనం’తో జనసేన రేంజి ఎల్లలు దాటినట్టే!

ఏపీలో అధికార కూటమిలోని కీలక భాగస్వామి జనసేన శుక్రవారంతో 11 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని చిత్రాడలో శుక్రవారం జనసేన ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగేందుకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభకు పవన్ కల్యాణ్ ‘జయకేతనం’ అనే పేరు పెట్టారు. జనసేన.. జయకేతనం… ప్రాసతో కూడిన రీసౌండ్ శుక్రవారం ఏపీని ఓ ఊపు ఊపేయనుందని చెప్పక తప్పదు.

జనసేన ప్రస్తుతానికి ఓ ప్రాంతీయ పార్టీ కిందే లెక్క. అయితే దేశంలో ఏ ఒక్క పార్టీకి సాధ్యం కాని రీతిలో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన భారత ఎన్నికల చరిత్రలో ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. దేశ చరిత్రలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన పార్టీ ఇప్పటిదాకా లేదనే చెప్పాలి. సమీప భవిష్యత్తులో ఆ తరహా సత్తా చాటే పార్టీ కూడా లేదని కూడా చెప్పాలి. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఉత్సాహంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను జనసేన అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది.

జయకేతనం ఏర్పాట్లు చూస్తే… జనసేన తాను ఓ ప్రాంతీయ పార్టీ అన్న భావనలో లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదో ఓ జాతీయ స్థాయి పార్టీనో… లేదంటే కేంద్రంలో రికార్డు మెజారిటీతో అధికారాన్ని అందుకున్న పార్టీలో నిర్వహించే స్థాయిలో జయకేతనానికి జనసేన ఏర్పాట్లు చేస్తోందని చెప్పక తప్పదు. జనసేన ఆవిర్భావ వేడుక ఏర్పాట్ల గురించిన వివరాల్లోకి వెళితే… వాహనాల పార్కింగ్ కోసం ఏకంగా 5 ప్రాంతాలను తీర్చిదిద్దారు. సభకు వచ్చే వారి క్షేమం కోసం 14 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచిన జనసేన.. ఏకంగా 7 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ సౌకర్యాలు అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు అవుతున్నాయి.

ఇక సభకు వచ్చే జన సైనికులు, సామాన్య ప్రజలు, పవన్ కల్యాణ్ అభిమానుల కోసం మంచి నీళ్లతో పాటు మజ్జిగను అందించేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సభకు హాజరయ్యే వారందరినీ కడుపు నిండా భోజనం పెట్టే ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. వీటన్నింటినీ నిత్యం పర్యవేక్షిస్తున్న పవన్… సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల పండ్లను అందించాలని సూచించారట. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో లభ్యమయ్యే పండ్లను సభకు వచ్చే వారికి అందించనున్నారు. మొత్తంగా జయకేతనంతో జనసేన రేంజి నిజంగానే ఎల్లలు దాటడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on March 13, 2025 10:52 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

29 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago