Political News

ఆశావ‌హుల ప‌రిస్థితి ఏంటి? టీడీపీలో ఆగ్ర‌వేశాలు!

ఏపీ కూట‌మి పార్టీలు మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల‌ను పంచేసుకున్నాయి. ఈ నెల 20న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబందించి సోమ‌వారం నామినేష‌న్ల ఘ‌ట్టం పూర్తి కానుంది. దీంతో ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను టీడీపీ-3, జ‌న‌సేన‌-1, బీజేపీ-1 పంచుకున్నాయి. ఈమేర‌కు ఆయా పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి(బీజేపీ త‌ప్ప‌). అయితే.. వాస్త‌వానికి జ‌న‌సేన ప‌రిస్థితి ఎలా ఉన్నా.. టీడీపీలో మాత్రం ఈ ఎంపిక‌పై ఆశావ‌హులు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా కొంద‌రు ఫోన్లు స్విచ్చాప్ చేసుకుని అధిష్టానంపై మౌన నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఆశావ‌హుల విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన వారిలో చాలా మంది ఉన్నారు. వీరంతా.. బ‌ల‌మైన నాయ‌కులు కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. అప్ప‌ట్లో సీట్లు త్యాగం చేసిన వారికి చంద్ర‌బాబు స్వ‌యంగా ఎమ్మెల్సీ హామీ కూడా ఇచ్చార‌న్న ప్ర‌చారం ఉంది.ఇది వాస్త‌వం కూడా. అయితే.. నెల‌లు గ‌డిచిపోతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని వారు వాపోతున్నారు. మైల‌వ‌రం నుంచి పోటీ చేయాల్సిన మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావును చంద్ర‌బాబు చివ‌రి నిమిషంలో త‌ప్పించారు.

ఈ టికెట్‌ను వైసీపీ నుంచి వ‌చ్చిన నాయ‌కుడు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌కు కేటాయించారు. ఈ స‌మ‌యంలోనే దేవినేనికి ఎమ్మెల్సీ ఆఫ‌ర్ ఇచ్చార‌ని అంటారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దిశ‌గా చంద్ర‌బాబు ప‌నిచేయ‌లేదు. ఇక‌, కీల‌క‌మైన పిఠాపురం నియోజక‌వ‌ర్గంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను గెలిపించుకునేందుకు కృషి చేసిన ఎస్‌వీఎస్ వ‌ర్మ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. ఆయ‌న కూడా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారంలోకి కూడా దిగిపోయారు. రేపు మాపో నామినేష‌న్ కూడా వేస్తార‌ని అనుకున్న స‌మ‌యంలో అనూహ్యంగా ఆ టికెట్‌ను ప‌వ‌న్ కు కేటాయించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు కూడా న్యాయం చేయ‌లేద‌ని వ‌ర్మ వ‌ర్గం నిప్పులు క‌క్కుతోంది.

ఇక‌, కీల‌క‌మైన మ‌రో నియోజ‌క‌వ‌ర్గం తిరువూరు. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఎస్సీ సామాజిక వ‌ర్గానికి కేటాయించిన ఈ స్థానం నుంచి మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ పోటీకి సిద్ధ‌మ‌య్యారు. కానీ, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అనూహ్యంగా ఆయ‌న‌ను త‌ప్పించిన చంద్ర‌బాబు ఎక్క‌డో గుంటూరు నుంచి తీసుకువ‌చ్చిన కొలిక‌పూడి శ్రీనివాస‌రావుకు ఇచ్చారు. ఈ క్ర‌మంలో జ‌వ‌హ‌ర్‌కు ఎమ్మెల్సీ సీటు ఇస్తామ‌న్నారు. కానీ, ఆయ‌న‌కు కూడా ఇవ్వ‌లేదు. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, కోడెల శివ‌ప్ర‌సాద్ కుటుంబానికి కూడా ఎమ్మెల్సీ సీటు ఇస్తామ‌న్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేక‌పోయారు. సో.. ఇప్పుడు వీరంతా ఆగ్ర‌వేశాలు క‌క్కుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 10, 2025 9:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

17 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

13 hours ago