Political News

ఆశావ‌హుల ప‌రిస్థితి ఏంటి? టీడీపీలో ఆగ్ర‌వేశాలు!

ఏపీ కూట‌మి పార్టీలు మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల‌ను పంచేసుకున్నాయి. ఈ నెల 20న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబందించి సోమ‌వారం నామినేష‌న్ల ఘ‌ట్టం పూర్తి కానుంది. దీంతో ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను టీడీపీ-3, జ‌న‌సేన‌-1, బీజేపీ-1 పంచుకున్నాయి. ఈమేర‌కు ఆయా పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి(బీజేపీ త‌ప్ప‌). అయితే.. వాస్త‌వానికి జ‌న‌సేన ప‌రిస్థితి ఎలా ఉన్నా.. టీడీపీలో మాత్రం ఈ ఎంపిక‌పై ఆశావ‌హులు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా కొంద‌రు ఫోన్లు స్విచ్చాప్ చేసుకుని అధిష్టానంపై మౌన నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఆశావ‌హుల విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన వారిలో చాలా మంది ఉన్నారు. వీరంతా.. బ‌ల‌మైన నాయ‌కులు కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. అప్ప‌ట్లో సీట్లు త్యాగం చేసిన వారికి చంద్ర‌బాబు స్వ‌యంగా ఎమ్మెల్సీ హామీ కూడా ఇచ్చార‌న్న ప్ర‌చారం ఉంది.ఇది వాస్త‌వం కూడా. అయితే.. నెల‌లు గ‌డిచిపోతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని వారు వాపోతున్నారు. మైల‌వ‌రం నుంచి పోటీ చేయాల్సిన మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావును చంద్ర‌బాబు చివ‌రి నిమిషంలో త‌ప్పించారు.

ఈ టికెట్‌ను వైసీపీ నుంచి వ‌చ్చిన నాయ‌కుడు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌కు కేటాయించారు. ఈ స‌మ‌యంలోనే దేవినేనికి ఎమ్మెల్సీ ఆఫ‌ర్ ఇచ్చార‌ని అంటారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దిశ‌గా చంద్ర‌బాబు ప‌నిచేయ‌లేదు. ఇక‌, కీల‌క‌మైన పిఠాపురం నియోజక‌వ‌ర్గంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను గెలిపించుకునేందుకు కృషి చేసిన ఎస్‌వీఎస్ వ‌ర్మ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. ఆయ‌న కూడా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారంలోకి కూడా దిగిపోయారు. రేపు మాపో నామినేష‌న్ కూడా వేస్తార‌ని అనుకున్న స‌మ‌యంలో అనూహ్యంగా ఆ టికెట్‌ను ప‌వ‌న్ కు కేటాయించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు కూడా న్యాయం చేయ‌లేద‌ని వ‌ర్మ వ‌ర్గం నిప్పులు క‌క్కుతోంది.

ఇక‌, కీల‌క‌మైన మ‌రో నియోజ‌క‌వ‌ర్గం తిరువూరు. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఎస్సీ సామాజిక వ‌ర్గానికి కేటాయించిన ఈ స్థానం నుంచి మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ పోటీకి సిద్ధ‌మ‌య్యారు. కానీ, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అనూహ్యంగా ఆయ‌న‌ను త‌ప్పించిన చంద్ర‌బాబు ఎక్క‌డో గుంటూరు నుంచి తీసుకువ‌చ్చిన కొలిక‌పూడి శ్రీనివాస‌రావుకు ఇచ్చారు. ఈ క్ర‌మంలో జ‌వ‌హ‌ర్‌కు ఎమ్మెల్సీ సీటు ఇస్తామ‌న్నారు. కానీ, ఆయ‌న‌కు కూడా ఇవ్వ‌లేదు. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, కోడెల శివ‌ప్ర‌సాద్ కుటుంబానికి కూడా ఎమ్మెల్సీ సీటు ఇస్తామ‌న్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేక‌పోయారు. సో.. ఇప్పుడు వీరంతా ఆగ్ర‌వేశాలు క‌క్కుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 10, 2025 9:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

23 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

60 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago