Political News

కూటమి ‘కర్ర పెత్తనం’ మంచిదేనన్న వెంకయ్య

ఇప్పుడంతా సోషల్ మీడియాదే పెత్తనం. మంచి చేయాలన్నా… చెడు చేయాలన్నా కూడా సోషల్ మీడియా నిమిషాల్లోనే చేసేస్తోంది. మంచి కంటే కూడా చెడు ఈ మీడియా ద్వారా వేగంగా విస్తరిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులను ఎలా పడితే అలా మార్చి చూపడం కూడా ఇట్టే సాధ్యమవుతోంది. ఇక రాజకీయాల్లో అయితే నేతల వ్యక్తిత్వ హననం సోషల్ మీడియా ద్వారా ఓ రేంజిలో సాగుతోంది. దీనిపై ఏపీలోని కూటమి సర్కారు… నిజంగానే కర్ర పెత్తనం చెలాయిస్తోంది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు కనిపిస్తే… ఏపీ పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే చాలా అరెస్టులు జరగగా… ఇంకా చాలా అరెస్టులు తప్పవంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూటమి సర్కారు కర్ర పెత్తనం ఎంతవరకు సబబు అంటూ న్యూట్రల్ జనాల్లో కొందరు.. దుర్మార్గం అంటూ విపక్ష వైసీపీ… దాని అనుబంధ మీడియాలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అదే సమయంలో మరి సోషల్ మీడియాను కంట్రోల్ చేయకుంటే ఇంకెంత నష్టం జరుగుతుందో తెలుసా? అంటూ కూటమి వర్గాలు వాదించుకుంటున్నాయి. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సాగుతున్న ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కూడా లేదు.

ఈ క్రమంలో రాజకీయాల నుంచి పదవీ విరమణ చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం విశాఖ కేంద్రంగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పేరిట రాసిన పుస్తకావిష్కరణ సభకు వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వికృత క్రీడలను ప్రస్తావించిన వెంకయ్య… కూటమి సర్కారు కర్ర పెత్తనాన్ని సమర్ధించేలా సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియా ఇప్పుడు విజృంభిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. తొలుత మంచికి మాత్రమే పరిమితమైన సోషల్ మీడియా ఆ తర్వాత చెడుకు కూడా తోడ్పాటు అందిస్తోందన్నారు. ఇలాంటి సోషల్ మీడియాను కంట్రోల్ చేద్దామని కేంద్ర ప్రభుత్వం ఏదో చేద్దామని భావిస్తే… అందరూ గగ్గోలు పెడుతున్నారనని ఆయన అన్నారు. మరి కంట్రోల్ లేకుంటే సోషల్ మీడియా ద్వారా ఎంతటి ముప్పు ఉంటుందో తెలుసా? అంటూ ప్రశ్నించిన వెంకయ్య… ఏపీలో చోటుచేసుకున్న ఉదంతాలే అందుకు నిదర్శనమని తెలిపారు. ఏపీలో సోషల్ మీడియాలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. దాని ఫలితంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఆసక్తికరమేనన్నారు.

సోషల్ మీడియాను ఇష్టారాజ్యంగా వాడిన వారిలో కొందరు ఇప్పుడు ఆ పరిణామాలను చవిచూస్తున్నారని ఆయన అన్నారు. అదేమంటే ఎవరో చెబితే చేశానంటూ కొందరు చెబుతున్నారన్న వెంకయ్య… ఎవరో చెబితే ఏది పడితే అది చేయడానికి వారి బుద్ధి ఏమైందని కూడా ప్రశ్నించారు. మొత్తంగా సోషల్ మీడియాను అయినా ఇంకేదైనా కంట్రోల్ లోనే ఉండాలన్న వెంకయ్య… అది చెడుకు దారి తీస్తే దండించాల్సిన యంత్రాంగం కూడా అవసరమేనని తేల్చి చెప్పారు.

Satya

Recent Posts

శ్రీనగర్.. ఈ ఏడాది సమ్మర్ విన్నర్.. ఎంత భారీగా ఫ్లైట్ జర్నీలంటే?

ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…

3 minutes ago

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

2 hours ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

6 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

7 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

9 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

9 hours ago