Political News

జగన్ కు కర్ణాటక మఠం ఆహ్వానం.. విషయం ఏంటంటే?

వైసీపీ అధినేత వై ఎస్ జగన మోహన్ రెడ్డి కి గురువారం ఓ ప్రత్యేక ఆహ్వానం అందింది. ఎక్కడో కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నందీపుర పీఠం నుంచి ఈ ఆహ్వానం అందింది. ఇందుకోసం నందీపుర పీఠాధిపతులు నేరుగా అమరావతి పరిధిలోని తాడేపల్లి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. ఏప్రిల్ లో తమ పీఠం నిర్వహించనున్న శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం భూమిపూజకు హాజరు కావాలని వారు జగన్ ను ఆహ్వానించారు. గతంలో విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి వద్దకు జగన్ తరచుగా వెళ్లేవారు. మొన్నటి ఎన్నికలు ముగిసిన తర్వాత స్వరూప నందేంద్ర హిమాలయాలకు వెళ్లిపోయారు. దీంతో శారదా పీఠానికి జగన్ వెళ్లడం లేదు.

కర్ణాటకలోని విజయనగర జిల్లా కేంద్రంగా నందీపుర పీఠం కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 30 న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం భూమిపూజకు వారు ముహూర్తం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పీఠం పీఠాధిపతులు జగన్ ను కోరారు. ఈ మేరకు జగన్‌కు పీఠాధిపతులు మహేశ్వర స్వామీజీ (నందీపుర పుణ్యక్షేత్రం), పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్ళి), జడేశ్వర తాత (శక్తి పీఠం, వీరాపుర), కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్‌, సండూర్‌)లు ఆహ్వానపత్రిక అందజేశారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కడంతో జగన్ సహా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. అదే సమయంలో జగన్ కూడా ఎక్కువ సమయం కర్ణాటక రాజధాని బెంగళూరులోని తన విలాసవంతమైన ప్యాలస్ లో ఉంటున్నారు. అవసరం ఉన్నప్పుడు అమరావతికి వస్తున్న జగన్ ఆ తర్వాత నేరుగా బెంగళూరు వెళుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని పలువురు రాజకీయ ప్రముఖుల ఇళ్లల్లో జరుగుతున్న కార్యక్రమాలకు కూడా హాజరు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కు నందీపుర పీఠం ఆహ్వానం అందడం విశేషం.

This post was last modified on March 6, 2025 1:22 pm

Share
Show comments
Published by
Satya
Tags: YS Jagan

Recent Posts

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

2 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

3 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

3 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

4 hours ago

సింగర్ చిన్మ‌యిపై కేసు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే త‌మిళ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యిపై కేసు న‌మోదైంది. ఎక్స్‌లో ఆమె చేసిన…

4 hours ago

అన్నయ్య రూటులోనే బేబీ హీరో రిస్కు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ…

5 hours ago