Political News

జగన్ కు కర్ణాటక మఠం ఆహ్వానం.. విషయం ఏంటంటే?

వైసీపీ అధినేత వై ఎస్ జగన మోహన్ రెడ్డి కి గురువారం ఓ ప్రత్యేక ఆహ్వానం అందింది. ఎక్కడో కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నందీపుర పీఠం నుంచి ఈ ఆహ్వానం అందింది. ఇందుకోసం నందీపుర పీఠాధిపతులు నేరుగా అమరావతి పరిధిలోని తాడేపల్లి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. ఏప్రిల్ లో తమ పీఠం నిర్వహించనున్న శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం భూమిపూజకు హాజరు కావాలని వారు జగన్ ను ఆహ్వానించారు. గతంలో విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి వద్దకు జగన్ తరచుగా వెళ్లేవారు. మొన్నటి ఎన్నికలు ముగిసిన తర్వాత స్వరూప నందేంద్ర హిమాలయాలకు వెళ్లిపోయారు. దీంతో శారదా పీఠానికి జగన్ వెళ్లడం లేదు.

కర్ణాటకలోని విజయనగర జిల్లా కేంద్రంగా నందీపుర పీఠం కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 30 న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం భూమిపూజకు వారు ముహూర్తం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పీఠం పీఠాధిపతులు జగన్ ను కోరారు. ఈ మేరకు జగన్‌కు పీఠాధిపతులు మహేశ్వర స్వామీజీ (నందీపుర పుణ్యక్షేత్రం), పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్ళి), జడేశ్వర తాత (శక్తి పీఠం, వీరాపుర), కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్‌, సండూర్‌)లు ఆహ్వానపత్రిక అందజేశారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కడంతో జగన్ సహా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. అదే సమయంలో జగన్ కూడా ఎక్కువ సమయం కర్ణాటక రాజధాని బెంగళూరులోని తన విలాసవంతమైన ప్యాలస్ లో ఉంటున్నారు. అవసరం ఉన్నప్పుడు అమరావతికి వస్తున్న జగన్ ఆ తర్వాత నేరుగా బెంగళూరు వెళుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని పలువురు రాజకీయ ప్రముఖుల ఇళ్లల్లో జరుగుతున్న కార్యక్రమాలకు కూడా హాజరు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కు నందీపుర పీఠం ఆహ్వానం అందడం విశేషం.

This post was last modified on March 6, 2025 1:22 pm

Share
Show comments
Published by
Satya
Tags: YS Jagan

Recent Posts

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 seconds ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

8 minutes ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

35 minutes ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

1 hour ago

అస్సీలో అంత మ్యాటర్ ఉందంటారా

గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…

3 hours ago

టాక్సిక్ ఇష్టం మనోళ్లకే ఎక్కువ ఉంది

ఇటీవలే విడుదలైన టాక్సిక్ టీజర్ మీద పాజిటివ్, నెగటివ్ రెండు రకాల రియాక్షన్లు సోషల్ మీడియాలో కనిపించాయి. వయొలెన్స్ ఎక్కువయ్యిందని…

4 hours ago