Political News

జగన్ ది సీక్రసీ… బాబుది ఓపెన్ టాప్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో వరుస భేటీలు వేశారు. ఈ భేటీల్లో రాష్ట్రానికి సంబంధించి కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించాల్సిన అంశాలను సమగ్రంగా ప్రస్తావించడంతో పాటుగా వాటికి సంబంధించిన వినతి పత్రాలను కూడా చంద్రబాబు మంత్రుల చేతుల్లో పెట్టారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర అంశం కనిపించింది.

ఏ కేంద్ర మంత్రి వద్దకు వెళ్లినా చంద్రబాబు ఒంటరిగా వెళ్లనే లేదు. తన పార్టీతో పాటుగా కూటమి పార్టీలకు చెందిన కేంద్ర మంత్రులతో పాటుగా కూటమి ఎంపీలను వెంటబెట్టుకుని ఆయన కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర మంత్రులతో చర్చల సందర్భంగానూ వారంతా చంద్రబాబు వెంటే… భేటీల్లో పాలుపంచుకున్నారు. ఏదో అలా ఫొటోలకు ఫోజులిచ్చి చర్చల సమయంలో బయటకు వెళ్లడానికి బదులుగా ఆయా భేటీల్లో స్వయంగా పాలుపంచుకున్నారు. దీని వెనుక చంద్రబాబుకు ఓ వ్యూహం ఉన్నట్లు సమాచారం. తాను అమరావతి వెళ్లిపోయినా… ఢిల్లీలోనే ఉండే కూటమి ఎంపీలు, మంత్రులు…ఆయా అంశాలపై సమయం వచ్చినప్పుడల్లా కేంద్రం పెద్దలకు గుర్తు చేస్తూ సాగే అవకాశం ఉంటుంది కదా. అందుకే చంద్రబాబు తన భేటీల్లో పార్టీ నేతలు కూడా ఉండేలా చూసుకుంటున్నారు.

ఇక 2019 నుంచి ఐదేళ్ల పాటు ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సీఎం హోదాలో చాలా సార్లే ఢిల్లీ వెళ్లారు. ప్రదాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ అయ్యారు. అయితే ఈ భేటీల్లో ఒక్కటంటే… ఒక్క భేటీలోనూ జగన్ వెంట ఆయన పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు గానీ… తనకు అత్యంత నమ్మకస్తుడైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సహా రాజ్యసభ సభ్యులు గానీ కనిపించలేదు. కేంద్ర మంత్రుల ఇళ్ల వద్దకు జగన్ వెంట వెళ్లారేమో గానీ… మంత్రులతో బేటీల్లో మాత్రం వారు పాలుపంచుకున్న దాఖలా కనిపించలేదు. ఈ కారణంగానే జగన్ బీజేపీ పెద్దల వద్ద సాగిలపడ్డారని వైరి వర్గాలు ఆయనపై ఆరోపణలు గుప్పించేవి. అయితే ఇప్పుడు చంద్రబాబు తనదైన ఓపెన్ పాలసీతో ఆ తరహా ఆరోపణలకే ఆస్కారం ఇవ్వడం లేదు.

Satya

Recent Posts

తెలుగు కుర్రాడికి రజినీ సినిమాలో ఛాన్స్

తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…

8 hours ago

ఓజీ-2: పవన్ మారాలి… సుజీతూ మారాలి

అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్‌కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…

9 hours ago

రెహమాన్ కంబ్యాక్ జరిగిందా లేదా

పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…

11 hours ago

నా చేతులు నా ఇష్టం అంటే చేతులు విరుగుతాయి

ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…

11 hours ago

ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు వీర‌మ‌ర‌ణం

గ‌త ఏడాది మేలో జ‌రిగిన ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు సైనికులు వీర‌మ‌ర‌ణం చెందిన‌ట్టు కేంద్రం తాజాగా వెల్ల‌డించింది. దాదాపు 13…

12 hours ago

వారణాసి మాట మార్చే ఛాన్స్ లేనట్టే

రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…

12 hours ago