Political News

‘పవన్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ’ – జగన్

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై స్పందించిందుకు అంటూ బుధవారం మీడియా ముందుకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ తన పాత పాటనే పాడేశారు. బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని అలా అలా చెప్పేసిన జగన్… తనకు సభలో ఎందుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు? అంటూ కూటమి సర్కారును నిలదీశారు. ఈ సందర్భంగా గతంలో తాను వినిపించిన వాదనలనే జగన్ బుదవారం కూడా మరోమారు వినిపించారు. సభలో ఉన్నవి రెండే రెండు పక్షాలు.. అందులో ఒకటి అధికార పక్షం కాగా… రెండోది విపక్షమని… విపక్షంలో ఉన్నది వైసీపీ ఒక్కటేనని… ఆ ఒక్క విపక్షానికి ప్రదాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కూడా జగన్ వాదించారు.

ఈ సందర్భంగా ఓ కొత్త అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. గతంలో చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను తానే ఇచ్చానని కూడా జగన్ అన్నారు. నాడు టీడీపీకి వచ్చింది 23 ఎమ్మెల్యే సీట్లేనని గుర్తు చేసిన జగన్…వారిలో ఓ ఐదుగురు పక్కకెళ్లి కూర్చుంటామని తనతో చెప్పారన్నారు. ఇక వైసీపీ నేతలైతే… ఓ 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేస్తామని చెప్పారన్నారు. అయితే తానే వద్దని వారించానని కూడా జగన్ అన్నారు. ఈ లెక్కన చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను తానే ఇచ్చినట్టే కదా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఆ పదవిని ఇచ్చి.. సభలో ఎంతసేపు కావాలంటే అంత సేపు మాట్టాడాలని చంద్రబాబును కోరానన్నారు. కావాలంటే తన ప్రసంగాలు పరిశీలించాలని కూడా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక జనసేనా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం చివరలో పవన్ గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. ఓట్ల శాతంతో కాకుండా సీట్ల ఆధారంగానే ప్రధాన ప్రతిపక్ష హోదా నిర్దేశితమవుతుందని… ఓట్ల శాతం ఆదారంగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలని పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వేగంగా స్పందించిన జగన్.. పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. అంతటితో ఆగని జగన్… జీవిత కాలంలో ఆయన తొలి సారి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు అంటూ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ పేరు విన్నంతనే ముఖం చిట్లించేసిన జగన్… ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూడా పవన్ పేరును వినడమే తనకు ఇబ్బందిగా ఉందన్న భానవ వచ్చేలా హావభావాలను వ్యక్తం చేశారు.

This post was last modified on March 5, 2025 2:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

55 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago