Political News

వృథా నీటిని వాడుకుంటే మీకేంటి నొప్పి?: చంద్ర‌బాబు

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య జ‌ల యుద్ధంలో కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకుంది. గ‌త రెండు రోజులుగా ఢిల్లీలోనే తిష్ఠ‌వేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ చేప‌డుతున్న బ‌న‌క‌చ‌ర్ల‌(క‌ర్నూలు జిల్లా) ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశారు. దీనిని ఎలాంటి అనుమ‌తులు లేకుండా నిర్మించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. దీనివ‌ల్ల త‌మ‌కు నీరు త‌గ్గిపోతుంద‌ని.. కాబ‌ట్టి ఏపీ చేప‌డుతున్న బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని ఆయ‌న కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి పాటిల్‌కు విన్న‌వించారు. దీనిపై ఆయ‌న సానుకూలంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం. దీనికితోడు ప‌లువురు తెలంగాణ మంత్రులు కూడా ఏపీ జ‌ల‌వ‌న‌రుల‌పై విమ‌ర్శ‌లు చేశారు.

ఆయా అంశాల‌పై గ‌త రెండు రోజులుగా మౌనం వ‌హించిన ఏపీ ప్ర‌భుత్వం తాజాగా స్పందించింది. మంగ‌ళ‌వారం రాత్రి సీఎం చంద్ర బాబు ఈ విష‌యాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల‌ను ఉద్దేశించి ఆయ‌న ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. ‘స‌ముద్రంలోకి వృథాగా పోయే నీటిని మేం వాడుకుంటే మీకు నొప్పేంటి?’ అని సూటిగా ప్ర‌శ్నించారు. అంతేకాదు.. “మీరు కావాలంటే వాడుకోండి. కానీ, స‌ముద్రంలోకి వృథాగా పోతే చూస్తూ ఊరుకుంటారా? వృథా జ‌లాల‌ను త‌రలించి.. వాడుకుంటే త‌ప్పేంటి? అవ‌స‌ర‌మైతే.. మీరూ వాడుకోవ‌చ్చు. స‌ముద్రంలో పోతున్న జ‌లాల‌ను క‌రువు పీడిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తామ‌ని చెబితే.. కొంద‌రు బాధ‌ప‌డిపోతున్నారు(రేవంత్ స‌హా మంత్రులు)” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

అంద‌రూ బాగుండాలి!

ఏపీ ప్ర‌జ‌లు, ఏపీ ప్ర‌భుత్వం కూడా.. తెలుగు వారు ఎక్క‌డున్న బాగుండాల‌ని కోరుకుంటార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. అందుకే గ‌తంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టును క‌ట్టిన‌ప్పుడు కూడా తాము మాట్లాడ‌లేద‌న్నారు. కాళేశ్వ‌రాన్ని క‌ట్టి మంచి ప‌నిచేశార‌ని ఆనాడు భావించిన‌ట్టు తెలిపారు. గోదావ‌రి న‌ది ఒక్క‌టే తెలుగు వారికి జ‌ల ప్ర‌దాయ‌నిగా ఉంద‌న్న సీఎం.. ఈ న‌దిపై ఎన్ని ప్రాజెక్టులైనా క‌ట్టుకోవాల‌ని తెలంగాణ‌కు సూచించారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును నిర్మించ‌డం ద్వారా స‌ముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని క‌రువు ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌న్న‌దే త‌మ అభిప్రాయ‌మ‌ని.. ఎవ‌రినీ ముంచాల‌న్న‌ది త‌మ ఉద్దేశం కాద‌ని తేల్చి చెప్పారు. దీనికి ఎందుకో బాధ‌ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

రెండూ.. రెండు క‌ళ్లు!

“ఏపీ, తెలంగాణ రెండు క‌ళ్లు అని నేనే గ‌తంలోనే చెప్పా. ఇప్పుడు కూడా అదే మాట‌కు నిల‌బ‌డుతున్నా. రెండు రాష్ట్రాల తెలుగు వారు బాగుండాల‌న్న‌దే మా విధానం. మీరూ నీటిని వాడుకోండి. మేమూ వాడుకుంటాం. తెలుగువారు ఎక్క‌డున్నా బాగుంటారు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌జ‌ల నీటిని ఏపీ తీసేసుకుంటోంద‌ని చేస్తున్న వ్యాఖ్య‌లు అర్థ‌ర‌హిత‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఎప్పుడూ తెలంగాణ‌కు అన్యాయం చేయాల‌ని భావించ‌డం లేద‌న్నారు. రెండు రాష్ట్రాల్లోనూ క‌రువు ప్రాంతాలు ఉన్నాయ‌ని.. ఎవ‌రు ముందుకు వ‌చ్చినా మిగులుజ‌లాలు, వృథా జ‌లాల‌ను వినియోగించుకుని రాష్ట్రాల‌ను బాగు చేసుకుంటే బాగుంటుంద‌ని తేల్చి చెప్పారు. కాగా. దీనిపై తెలంగాణ ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on March 5, 2025 9:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

43 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago