Political News

జ‌గ‌న్‌ను లైట్ తీసుకున్న వైసీపీ నేత‌లు!

జ‌గ‌న్ మాటంటే శాస‌నంగా.. ల‌క్ష‌ణ రేఖ‌లు భావించే వైసీపీ నాయ‌కులు.. ఇటీవ‌లి ప‌రిణామాల క్ర‌మంలో ఆయ‌న మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవ‌రి మాటా విన‌కుండా.. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు న‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్‌..పార్టీ నాయ‌కుల‌ను ముంచేశార‌న్న వాద‌న వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు కూడా.. అసెంబ్లీకి వెళ్లే విష‌యం నుంచి స‌ర్కారుపై పోరాడే వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ ఏక‌ప‌క్షంగానే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి వంటివారు.. ఈ విష‌యాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఒక‌రిద్ద‌రు మాత్రం న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్త‌న్నారు. మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి జ‌గ‌న్ వైఖ‌రి మార‌లేద‌న్న‌ది.. పార్టీలోనే ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి గుంటూరు, ఉమ్మ‌డి కృష్ణాజిల్లాల్లో వైసీపీ పోటీ చేయ‌లేదు. వాస్త‌వానికి ఇక్క‌డ పోటీ పెట్టాల‌ని ఆది నుంచి నాయ‌కులు కోరారు.

కానీ, జ‌గ‌న్ ఎవ‌రి మాటా విన‌లేదు. పైగా.. ఎన్నిక‌ల‌కు నాలుగురోజుల ముందు.. పీడీఎఫ్ అభ్య‌ర్థి కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావుకు వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ గ్రాడ్యుయేట్లు అంద‌రూ.. తమ ఓటును ల‌క్ష్మ‌ణ‌రావుకు వేయాల‌ని ఆయ‌న సూచించారు. అంతేకాదు.. ఒక్కొక్క‌రు మ‌రో మూడు ఓట్లు వేయించా లని కూడా ఆయ‌న దిశానిర్దేశం చేశారు. జ‌గ‌న్‌ ఆదేశాల‌కు అంద‌రూ త‌ల‌లూపారు. ల‌క్ష్మ‌ణ‌రావును గెలిపించే బాధ్య‌త‌ను తీసుకుంటామ‌నిచెప్పారు.

కానీ, తీరా గురువారం ఎన్నికల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యాక‌.. వైసీపీ ప‌ట్ట‌భ‌ద్రులు ఎవ‌రూ కూడా బూతుల వ‌ద్ద క‌నిపించ‌లేదు. అంతేకాదు.. అసలు చాలా మంది కీల‌క నాయ‌కుల ఫోన్లు కూడా మూగ‌బో యాయి. అంటే స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ చెప్పింది.. వారు విన‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. జ‌గ‌న్ ఎంత చెప్పినా.. ప‌నిచేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వారంతా లైట్ తీసుకున్నారు. ఎక్క‌డ పోలింగ్ బూతును ప‌రిశీలించినా.. మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యానికి కేవ‌లం టీడీపీ సానుకూలురు.. కూట‌మి పార్టీ సానుకూలురే ఎక్కువ‌గా క‌నిపించిన‌ట్టు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

Satya

Recent Posts

మహా కామెంట్స్… ‘రావు బహదూర్’పై ఎటాక్

సెలబ్రెటీలు స్టేజ్‌ల మీద మాట్లాడేటపుడు.. ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు ఏం మాట్లాడుతున్నామో కాస్త స్పృహతో ఉండడం ఎంతో అవసరం. ఈ సోషల్…

17 minutes ago

పొరపాట్లు కాదు… తప్పులు చేస్తున్న హృతిక్

పొరపాట్లు అంటే ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. కానీ అదే పనిగా రిపీట్ చేస్తే దాన్ని తప్పు అంటారు. బాలీవుడ్…

52 minutes ago

ప్రకాష్ రాజ్ కు కందుల దుర్గేశ్ వార్నింగ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పై చాలాకాలంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి…

55 minutes ago

127 కట్స్ చెప్పారు… నేరుగా ఓటీటీలోకి

సెన్సార్ బోర్డు ఈ మధ్య సినిమాలకు ఎంత పెద్ద అడ్డంకిగా మారుతోందో తెలిసిందే. మరీ అన్యాయంగా కట్స్ చెబుతుండడం.. మామూలు సన్నివేశాలకు…

1 hour ago

ఈవీవీ పెద్ద కొడుకు తిరిగొచ్చాడు

లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ తన ఇద్దరు కొడుకుల విషయంలో చేసిన ప్లానింగ్ వేరు. కానీ జరిగింది వేరు. ఇద్దరిలో పెద్ద కొడుకు…

2 hours ago

ఒవైసీ విద్యాసంస్థ‌ల‌ను మూసేస్తారా?

హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ‌ల‌కు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇదేస‌మ‌యంలో ప్ర‌భుత్వంపైనా…

2 hours ago