Political News

జ‌గ‌న్‌ను లైట్ తీసుకున్న వైసీపీ నేత‌లు!

జ‌గ‌న్ మాటంటే శాస‌నంగా.. ల‌క్ష‌ణ రేఖ‌లు భావించే వైసీపీ నాయ‌కులు.. ఇటీవ‌లి ప‌రిణామాల క్ర‌మంలో ఆయ‌న మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవ‌రి మాటా విన‌కుండా.. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు న‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్‌..పార్టీ నాయ‌కుల‌ను ముంచేశార‌న్న వాద‌న వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు కూడా.. అసెంబ్లీకి వెళ్లే విష‌యం నుంచి స‌ర్కారుపై పోరాడే వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ ఏక‌ప‌క్షంగానే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి వంటివారు.. ఈ విష‌యాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఒక‌రిద్ద‌రు మాత్రం న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్త‌న్నారు. మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి జ‌గ‌న్ వైఖ‌రి మార‌లేద‌న్న‌ది.. పార్టీలోనే ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి గుంటూరు, ఉమ్మ‌డి కృష్ణాజిల్లాల్లో వైసీపీ పోటీ చేయ‌లేదు. వాస్త‌వానికి ఇక్క‌డ పోటీ పెట్టాల‌ని ఆది నుంచి నాయ‌కులు కోరారు.

కానీ, జ‌గ‌న్ ఎవ‌రి మాటా విన‌లేదు. పైగా.. ఎన్నిక‌ల‌కు నాలుగురోజుల ముందు.. పీడీఎఫ్ అభ్య‌ర్థి కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావుకు వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ గ్రాడ్యుయేట్లు అంద‌రూ.. తమ ఓటును ల‌క్ష్మ‌ణ‌రావుకు వేయాల‌ని ఆయ‌న సూచించారు. అంతేకాదు.. ఒక్కొక్క‌రు మ‌రో మూడు ఓట్లు వేయించా లని కూడా ఆయ‌న దిశానిర్దేశం చేశారు. జ‌గ‌న్‌ ఆదేశాల‌కు అంద‌రూ త‌ల‌లూపారు. ల‌క్ష్మ‌ణ‌రావును గెలిపించే బాధ్య‌త‌ను తీసుకుంటామ‌నిచెప్పారు.

కానీ, తీరా గురువారం ఎన్నికల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యాక‌.. వైసీపీ ప‌ట్ట‌భ‌ద్రులు ఎవ‌రూ కూడా బూతుల వ‌ద్ద క‌నిపించ‌లేదు. అంతేకాదు.. అసలు చాలా మంది కీల‌క నాయ‌కుల ఫోన్లు కూడా మూగ‌బో యాయి. అంటే స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ చెప్పింది.. వారు విన‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. జ‌గ‌న్ ఎంత చెప్పినా.. ప‌నిచేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వారంతా లైట్ తీసుకున్నారు. ఎక్క‌డ పోలింగ్ బూతును ప‌రిశీలించినా.. మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యానికి కేవ‌లం టీడీపీ సానుకూలురు.. కూట‌మి పార్టీ సానుకూలురే ఎక్కువ‌గా క‌నిపించిన‌ట్టు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on February 27, 2025 1:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

22 minutes ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

5 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

7 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

11 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

12 hours ago