Political News

జ‌గ‌న్‌ను లైట్ తీసుకున్న వైసీపీ నేత‌లు!

జ‌గ‌న్ మాటంటే శాస‌నంగా.. ల‌క్ష‌ణ రేఖ‌లు భావించే వైసీపీ నాయ‌కులు.. ఇటీవ‌లి ప‌రిణామాల క్ర‌మంలో ఆయ‌న మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవ‌రి మాటా విన‌కుండా.. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు న‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్‌..పార్టీ నాయ‌కుల‌ను ముంచేశార‌న్న వాద‌న వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు కూడా.. అసెంబ్లీకి వెళ్లే విష‌యం నుంచి స‌ర్కారుపై పోరాడే వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ ఏక‌ప‌క్షంగానే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి వంటివారు.. ఈ విష‌యాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఒక‌రిద్ద‌రు మాత్రం న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్త‌న్నారు. మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి జ‌గ‌న్ వైఖ‌రి మార‌లేద‌న్న‌ది.. పార్టీలోనే ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి గుంటూరు, ఉమ్మ‌డి కృష్ణాజిల్లాల్లో వైసీపీ పోటీ చేయ‌లేదు. వాస్త‌వానికి ఇక్క‌డ పోటీ పెట్టాల‌ని ఆది నుంచి నాయ‌కులు కోరారు.

కానీ, జ‌గ‌న్ ఎవ‌రి మాటా విన‌లేదు. పైగా.. ఎన్నిక‌ల‌కు నాలుగురోజుల ముందు.. పీడీఎఫ్ అభ్య‌ర్థి కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావుకు వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ గ్రాడ్యుయేట్లు అంద‌రూ.. తమ ఓటును ల‌క్ష్మ‌ణ‌రావుకు వేయాల‌ని ఆయ‌న సూచించారు. అంతేకాదు.. ఒక్కొక్క‌రు మ‌రో మూడు ఓట్లు వేయించా లని కూడా ఆయ‌న దిశానిర్దేశం చేశారు. జ‌గ‌న్‌ ఆదేశాల‌కు అంద‌రూ త‌ల‌లూపారు. ల‌క్ష్మ‌ణ‌రావును గెలిపించే బాధ్య‌త‌ను తీసుకుంటామ‌నిచెప్పారు.

కానీ, తీరా గురువారం ఎన్నికల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యాక‌.. వైసీపీ ప‌ట్ట‌భ‌ద్రులు ఎవ‌రూ కూడా బూతుల వ‌ద్ద క‌నిపించ‌లేదు. అంతేకాదు.. అసలు చాలా మంది కీల‌క నాయ‌కుల ఫోన్లు కూడా మూగ‌బో యాయి. అంటే స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ చెప్పింది.. వారు విన‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. జ‌గ‌న్ ఎంత చెప్పినా.. ప‌నిచేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వారంతా లైట్ తీసుకున్నారు. ఎక్క‌డ పోలింగ్ బూతును ప‌రిశీలించినా.. మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యానికి కేవ‌లం టీడీపీ సానుకూలురు.. కూట‌మి పార్టీ సానుకూలురే ఎక్కువ‌గా క‌నిపించిన‌ట్టు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on February 27, 2025 1:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

43 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago