Political News

జ‌గ‌న్‌ను లైట్ తీసుకున్న వైసీపీ నేత‌లు!

జ‌గ‌న్ మాటంటే శాస‌నంగా.. ల‌క్ష‌ణ రేఖ‌లు భావించే వైసీపీ నాయ‌కులు.. ఇటీవ‌లి ప‌రిణామాల క్ర‌మంలో ఆయ‌న మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవ‌రి మాటా విన‌కుండా.. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు న‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్‌..పార్టీ నాయ‌కుల‌ను ముంచేశార‌న్న వాద‌న వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు కూడా.. అసెంబ్లీకి వెళ్లే విష‌యం నుంచి స‌ర్కారుపై పోరాడే వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ ఏక‌ప‌క్షంగానే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి వంటివారు.. ఈ విష‌యాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఒక‌రిద్ద‌రు మాత్రం న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్త‌న్నారు. మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి జ‌గ‌న్ వైఖ‌రి మార‌లేద‌న్న‌ది.. పార్టీలోనే ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి గుంటూరు, ఉమ్మ‌డి కృష్ణాజిల్లాల్లో వైసీపీ పోటీ చేయ‌లేదు. వాస్త‌వానికి ఇక్క‌డ పోటీ పెట్టాల‌ని ఆది నుంచి నాయ‌కులు కోరారు.

కానీ, జ‌గ‌న్ ఎవ‌రి మాటా విన‌లేదు. పైగా.. ఎన్నిక‌ల‌కు నాలుగురోజుల ముందు.. పీడీఎఫ్ అభ్య‌ర్థి కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావుకు వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ గ్రాడ్యుయేట్లు అంద‌రూ.. తమ ఓటును ల‌క్ష్మ‌ణ‌రావుకు వేయాల‌ని ఆయ‌న సూచించారు. అంతేకాదు.. ఒక్కొక్క‌రు మ‌రో మూడు ఓట్లు వేయించా లని కూడా ఆయ‌న దిశానిర్దేశం చేశారు. జ‌గ‌న్‌ ఆదేశాల‌కు అంద‌రూ త‌ల‌లూపారు. ల‌క్ష్మ‌ణ‌రావును గెలిపించే బాధ్య‌త‌ను తీసుకుంటామ‌నిచెప్పారు.

కానీ, తీరా గురువారం ఎన్నికల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యాక‌.. వైసీపీ ప‌ట్ట‌భ‌ద్రులు ఎవ‌రూ కూడా బూతుల వ‌ద్ద క‌నిపించ‌లేదు. అంతేకాదు.. అసలు చాలా మంది కీల‌క నాయ‌కుల ఫోన్లు కూడా మూగ‌బో యాయి. అంటే స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ చెప్పింది.. వారు విన‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. జ‌గ‌న్ ఎంత చెప్పినా.. ప‌నిచేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వారంతా లైట్ తీసుకున్నారు. ఎక్క‌డ పోలింగ్ బూతును ప‌రిశీలించినా.. మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యానికి కేవ‌లం టీడీపీ సానుకూలురు.. కూట‌మి పార్టీ సానుకూలురే ఎక్కువ‌గా క‌నిపించిన‌ట్టు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on February 27, 2025 1:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ మంట‌లు పుట్టించేస్తున్న త‌మ‌న్నా

ఒక‌ప్పుడు ఐటెం సాంగ్స్ అంటే అందుకోసమే కొంద‌రు భామ‌లుండేవారు. వాళ్లే ఆ పాట‌లు చేసేవారు. కానీ గ‌త ద‌శాబ్ద కాలంలో…

2 hours ago

మళ్లీ టాలీవుడ్‌కు రాధికా ఆప్టే

బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…

4 hours ago

కదిలిస్తున్న ‘మంచు’ వారి వీడియో

మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…

5 hours ago

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తా!

"ఈ రోజు నుంచే.. ఈ క్ష‌ణం నుంచే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా. జ‌గ‌న్…

5 hours ago

శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల…

5 hours ago

సుందరకాండకు సమస్యలు ఎందుకొచ్చాయి

నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…

7 hours ago