జగన్ మాటంటే శాసనంగా.. లక్షణ రేఖలు భావించే వైసీపీ నాయకులు.. ఇటీవలి పరిణామాల క్రమంలో ఆయన మాటను పెద్దగా పట్టించుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవరి మాటా వినకుండా.. గత ఎన్నికల్లో తనకు నచ్చినట్టు వ్యవహరించిన జగన్..పార్టీ నాయకులను ముంచేశారన్న వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా.. అసెంబ్లీకి వెళ్లే విషయం నుంచి సర్కారుపై పోరాడే వరకు కూడా.. జగన్ ఏకపక్షంగానే నిర్ణయం తీసుకుంటున్నారని నాయకులు చెబుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటివారు.. ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఒకరిద్దరు మాత్రం నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తన్నారు. మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి జగన్ వైఖరి మారలేదన్నది.. పార్టీలోనే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణాజిల్లాల్లో వైసీపీ పోటీ చేయలేదు. వాస్తవానికి ఇక్కడ పోటీ పెట్టాలని ఆది నుంచి నాయకులు కోరారు.
కానీ, జగన్ ఎవరి మాటా వినలేదు. పైగా.. ఎన్నికలకు నాలుగురోజుల ముందు.. పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు వైసీపీ మద్దతు ఇస్తోందని చెప్పుకొచ్చారు. వైసీపీ గ్రాడ్యుయేట్లు అందరూ.. తమ ఓటును లక్ష్మణరావుకు వేయాలని ఆయన సూచించారు. అంతేకాదు.. ఒక్కొక్కరు మరో మూడు ఓట్లు వేయించా లని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. జగన్ ఆదేశాలకు అందరూ తలలూపారు. లక్ష్మణరావును గెలిపించే బాధ్యతను తీసుకుంటామనిచెప్పారు.
కానీ, తీరా గురువారం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యాక.. వైసీపీ పట్టభద్రులు ఎవరూ కూడా బూతుల వద్ద కనిపించలేదు. అంతేకాదు.. అసలు చాలా మంది కీలక నాయకుల ఫోన్లు కూడా మూగబో యాయి. అంటే స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీనిని బట్టి.. జగన్ చెప్పింది.. వారు వినలేదన్న వాదన వినిపిస్తోంది. జగన్ ఎంత చెప్పినా.. పనిచేయకపోవడం గమనార్హం. వారంతా లైట్ తీసుకున్నారు. ఎక్కడ పోలింగ్ బూతును పరిశీలించినా.. మధ్యాహ్నం 1 గంట సమయానికి కేవలం టీడీపీ సానుకూలురు.. కూటమి పార్టీ సానుకూలురే ఎక్కువగా కనిపించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…
వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్…
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…