Political News

జ‌గ‌న్‌ను లైట్ తీసుకున్న వైసీపీ నేత‌లు!

జ‌గ‌న్ మాటంటే శాస‌నంగా.. ల‌క్ష‌ణ రేఖ‌లు భావించే వైసీపీ నాయ‌కులు.. ఇటీవ‌లి ప‌రిణామాల క్ర‌మంలో ఆయ‌న మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవ‌రి మాటా విన‌కుండా.. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు న‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్‌..పార్టీ నాయ‌కుల‌ను ముంచేశార‌న్న వాద‌న వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు కూడా.. అసెంబ్లీకి వెళ్లే విష‌యం నుంచి స‌ర్కారుపై పోరాడే వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ ఏక‌ప‌క్షంగానే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి వంటివారు.. ఈ విష‌యాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఒక‌రిద్ద‌రు మాత్రం న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్త‌న్నారు. మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి జ‌గ‌న్ వైఖ‌రి మార‌లేద‌న్న‌ది.. పార్టీలోనే ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి గుంటూరు, ఉమ్మ‌డి కృష్ణాజిల్లాల్లో వైసీపీ పోటీ చేయ‌లేదు. వాస్త‌వానికి ఇక్క‌డ పోటీ పెట్టాల‌ని ఆది నుంచి నాయ‌కులు కోరారు.

కానీ, జ‌గ‌న్ ఎవ‌రి మాటా విన‌లేదు. పైగా.. ఎన్నిక‌ల‌కు నాలుగురోజుల ముందు.. పీడీఎఫ్ అభ్య‌ర్థి కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావుకు వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ గ్రాడ్యుయేట్లు అంద‌రూ.. తమ ఓటును ల‌క్ష్మ‌ణ‌రావుకు వేయాల‌ని ఆయ‌న సూచించారు. అంతేకాదు.. ఒక్కొక్క‌రు మ‌రో మూడు ఓట్లు వేయించా లని కూడా ఆయ‌న దిశానిర్దేశం చేశారు. జ‌గ‌న్‌ ఆదేశాల‌కు అంద‌రూ త‌ల‌లూపారు. ల‌క్ష్మ‌ణ‌రావును గెలిపించే బాధ్య‌త‌ను తీసుకుంటామ‌నిచెప్పారు.

కానీ, తీరా గురువారం ఎన్నికల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యాక‌.. వైసీపీ ప‌ట్ట‌భ‌ద్రులు ఎవ‌రూ కూడా బూతుల వ‌ద్ద క‌నిపించ‌లేదు. అంతేకాదు.. అసలు చాలా మంది కీల‌క నాయ‌కుల ఫోన్లు కూడా మూగ‌బో యాయి. అంటే స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ చెప్పింది.. వారు విన‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. జ‌గ‌న్ ఎంత చెప్పినా.. ప‌నిచేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వారంతా లైట్ తీసుకున్నారు. ఎక్క‌డ పోలింగ్ బూతును ప‌రిశీలించినా.. మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యానికి కేవ‌లం టీడీపీ సానుకూలురు.. కూట‌మి పార్టీ సానుకూలురే ఎక్కువ‌గా క‌నిపించిన‌ట్టు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on February 27, 2025 1:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

58 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

2 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago