Political News

ఏబీఎన్ ను వెంకటకృష్ణ వీడారా..?

గడచిన కొన్ని రోజులుగా తెలుగు మీడియా సర్కిళ్లలో ఓ అంశం మీద ఆసక్తికర చర్చ నడుస్తోంఃది. టీడీపీ అనుకూల మీడియాగా ముద్ర పడిన ఏబీఎన్ ఆంధ్రజ్మోతి ఛానెల్ లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు పర్వతనేని వెంకట కృష్ణ ఆ ఛానెల్ నుంచి తప్పుకున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అటు ఏబీఎన్ గానీ, ఇటు రాదాకృష్ణ గానీ నోరు మెదపలేదు. వాస్తవంగా ఇది వారి వ్యక్తిగత, సొంత వ్యవహారం కాబట్టి… వారు దీనిని బయటపెట్టాల్సిన అవసరం కూడా లేదు గానీ… ఓ ప్రముఖ మీడియా, అందులో పనిచేసే ఓ ప్రముఖ జర్నలిస్టు వ్యవహారం కావడంతో ఈ విషయంపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది.

ఏబీఎన్ లో డీబేట్ పేరిట జరిగే చర్చా కార్యక్రమం ఆ ఛానెల్ కు హైలెట్ ప్రోగ్రామే. ఈ ప్రోగ్రాంను వెంకటకృష్ణ నడిపిన తీరు కూడా అమోఘమనే చెప్పాలి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల ద్వారా ఆయా విషయాలను రాబట్టడంలో వెంకట కృష్ణ తనదైన శైలి చతురతను ప్రదర్శించే నైపుణ్యం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుందని చెప్పాలి. అంతేకాకుండా ఏబీఎన్ చెప్పాలనుకున్న అంశాన్ని ఆ లైన్ మేరకే కొనసాగేలా కూడా ఆయన షోను నిర్వహించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఉన్నట్టుండి ఆ షోలో వెంకట కృష్ణ ప్లేస్ లో మరో జర్నలిస్టు మంగళవారం నాటి ప్రోమోలో కనిపించారు. బుధవారం నాటి షోలో ఏకంగా ఆ కొత్త జర్నలిస్టు ప్రత్యక్షమైపోయారు కూదా.

ఇలా వెంకట కృష్ణ హోస్ట్ గా ప్రసారం అవుతున్న షోలో ఆయన కాకుండా వేరే జర్నలిస్టు కనిపించగానే…అరెరే వెంటక కృస్ణ ఏబీఎన్ ను వదిలేశారా? అంటూ అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి వెంకట కృష్ణ ఏబీఎన్ ను వీడే దిశగా చాలా రోజుల క్రితమే సంస్థకు చెప్పేశారని, నోటీస్ పీరియడ్ ముగిసేదాకా ఆ సంస్థలో కొనసాగుతున్నారని జర్నలిస్టు సర్కిళ్లలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలు నిజమేనన్నట్లుగా ఆయన స్థానంలో కొత్త జర్నలిస్టు ఏబీఎన్ తెరపై ప్రత్యక్షమయ్యారు. ఇదిలా ఉంటే… ఏధో ఓ కొత్త ఛానెల్ ప్రారంభం అవుతుండగా సదరు మీడియా హూస్ తో కలిసి పనిచేసేందుకు వెంకట కృష్ణ ఏబీఎన్ ను వదులుకున్నారని సమాచారం. అయితే ఆ కొత్త మీడియా ఎవరిదన్న విషయం మాత్రం తెలియరాలేదు.

This post was last modified on February 26, 2025 8:54 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

3 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

7 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

11 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

11 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

12 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

12 hours ago