గడచిన కొన్ని రోజులుగా తెలుగు మీడియా సర్కిళ్లలో ఓ అంశం మీద ఆసక్తికర చర్చ నడుస్తోంఃది. టీడీపీ అనుకూల మీడియాగా ముద్ర పడిన ఏబీఎన్ ఆంధ్రజ్మోతి ఛానెల్ లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు పర్వతనేని వెంకట కృష్ణ ఆ ఛానెల్ నుంచి తప్పుకున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అటు ఏబీఎన్ గానీ, ఇటు రాదాకృష్ణ గానీ నోరు మెదపలేదు. వాస్తవంగా ఇది వారి వ్యక్తిగత, సొంత వ్యవహారం కాబట్టి… వారు దీనిని బయటపెట్టాల్సిన అవసరం కూడా లేదు గానీ… ఓ ప్రముఖ మీడియా, అందులో పనిచేసే ఓ ప్రముఖ జర్నలిస్టు వ్యవహారం కావడంతో ఈ విషయంపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది.
ఏబీఎన్ లో డీబేట్ పేరిట జరిగే చర్చా కార్యక్రమం ఆ ఛానెల్ కు హైలెట్ ప్రోగ్రామే. ఈ ప్రోగ్రాంను వెంకటకృష్ణ నడిపిన తీరు కూడా అమోఘమనే చెప్పాలి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల ద్వారా ఆయా విషయాలను రాబట్టడంలో వెంకట కృష్ణ తనదైన శైలి చతురతను ప్రదర్శించే నైపుణ్యం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుందని చెప్పాలి. అంతేకాకుండా ఏబీఎన్ చెప్పాలనుకున్న అంశాన్ని ఆ లైన్ మేరకే కొనసాగేలా కూడా ఆయన షోను నిర్వహించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఉన్నట్టుండి ఆ షోలో వెంకట కృష్ణ ప్లేస్ లో మరో జర్నలిస్టు మంగళవారం నాటి ప్రోమోలో కనిపించారు. బుధవారం నాటి షోలో ఏకంగా ఆ కొత్త జర్నలిస్టు ప్రత్యక్షమైపోయారు కూదా.
ఇలా వెంకట కృష్ణ హోస్ట్ గా ప్రసారం అవుతున్న షోలో ఆయన కాకుండా వేరే జర్నలిస్టు కనిపించగానే…అరెరే వెంటక కృస్ణ ఏబీఎన్ ను వదిలేశారా? అంటూ అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి వెంకట కృష్ణ ఏబీఎన్ ను వీడే దిశగా చాలా రోజుల క్రితమే సంస్థకు చెప్పేశారని, నోటీస్ పీరియడ్ ముగిసేదాకా ఆ సంస్థలో కొనసాగుతున్నారని జర్నలిస్టు సర్కిళ్లలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలు నిజమేనన్నట్లుగా ఆయన స్థానంలో కొత్త జర్నలిస్టు ఏబీఎన్ తెరపై ప్రత్యక్షమయ్యారు. ఇదిలా ఉంటే… ఏధో ఓ కొత్త ఛానెల్ ప్రారంభం అవుతుండగా సదరు మీడియా హూస్ తో కలిసి పనిచేసేందుకు వెంకట కృష్ణ ఏబీఎన్ ను వదులుకున్నారని సమాచారం. అయితే ఆ కొత్త మీడియా ఎవరిదన్న విషయం మాత్రం తెలియరాలేదు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…