Political News

వైఎస్సార్ పేరుతో కంటి ఆసుప‌త్రి.. విజ‌య‌మ్మ‌ను పిల‌వ‌ని జ‌గ‌న్‌!

వైసీపీ అధినేత‌, పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి రూ.10 కోట్లు ఖ‌ర్చు చేసి అత్యాధుని కంటి వైద్యశాల‌ను నిర్మించారు. దీనిని తాజాగా మ‌హాశివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న ప్రారంభించారు. తొలుత ఆయ‌న కంటి ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌రిమితంగానే వైఎస్ కుటుంబ స‌భ్యుల‌కు ఆహ్వానాలు అంద‌డం గ‌మ‌నార్హం. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ త‌న మాతృమూర్తి విజ‌య‌మ్మ‌ను పిల‌క‌పోవ‌డం స‌ర్వ‌త్రా విస్మ‌యానికి దారి తీసింది.

‘వైఎస్సార్ ఫౌండేష‌న్‌’ పేరుతో వైసీపీ ఆధ్వ‌ర్యంలో క‌డ‌ప‌లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. దీనికి పార్టీ స‌హా.. వైఎస్ కుటుంబ స‌భ్యులు.. ఇత‌ర దాత‌ల నుంచి కూడా.. నిధులు సేక‌రిస్తున్నారు. ఇలా వ‌చ్చిన నిధుల నుంచి రూ.10 కోట్లు వెచ్చించి.. పులివెందుల‌లో అత్యాధుని వైద్య సౌక‌ర్యాల‌తో స్థానికుల‌కు ఉప యోగ‌ప‌డేలా .. వైద్య ఆసుప‌త్రి నిర్మాణానికి రెండేళ్ల కింద‌ట వైసీపీ హ‌యాంలోనే శంకుస్థాప‌న చేశారు. ఇది పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో తాజాగా క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్ దీనిని ప్రారంభించారు.

తొలుత ఆయ‌న కంటి ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ‘అద్దాలు’ ప‌డ‌తాయ‌ని వైద్యులు చెప్పారు. అయితే.. లేజ‌ర్ ట్రీట్ మెంటు తీసుకుంటాన‌ని.. అద్దాలు అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ చెప్ప‌డంతో లేజ‌ర్ ట్రీట్ మెంటు కోసం వైద్యులు రిఫ‌ర్ చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున ఈ ఆసుప‌త్రికి వ‌చ్చి.. వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డంతోపాటు.. ఉచితంగా ఆప‌రేష‌న్ల‌కు కూడా నమోద‌య్యారు. ఈ ఆసుప‌త్రిలో కంటి ప‌రీక్ష‌ల నుంచి ఆప‌రేష‌న్ల వ‌రకు అన్నీ ఉచితంగా చేయ‌నున్న‌ట్టు వైద్యులు తెలిపారు.

ఇక‌, వైఎస్సార్ ఫౌండేష‌న్ పేరుతో నెల‌కొల్పిన ఈ ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వానికి కేవ‌లం జ‌గ‌న్ ఒక్క‌రే హాజ‌ర‌య్యారు. చివ‌ర‌కు ఆయ‌న మాతృమూర్తి వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌కు కూడా ఆహ్వానం అంద‌లేద‌ని సమాచారం. దీంతో ఆమె ఎక్క‌డా ఈ కార్య‌క్ర‌మంలో క‌నిపించ‌లేదు. మ‌రోవైపు వైఎస్ కుటుంబానికి చెందిన వారిలో చాలా త‌క్కువ మందే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

This post was last modified on February 26, 2025 8:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

1 hour ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago