Political News

వైఎస్సార్ పేరుతో కంటి ఆసుప‌త్రి.. విజ‌య‌మ్మ‌ను పిల‌వ‌ని జ‌గ‌న్‌!

వైసీపీ అధినేత‌, పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి రూ.10 కోట్లు ఖ‌ర్చు చేసి అత్యాధుని కంటి వైద్యశాల‌ను నిర్మించారు. దీనిని తాజాగా మ‌హాశివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న ప్రారంభించారు. తొలుత ఆయ‌న కంటి ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌రిమితంగానే వైఎస్ కుటుంబ స‌భ్యుల‌కు ఆహ్వానాలు అంద‌డం గ‌మ‌నార్హం. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ త‌న మాతృమూర్తి విజ‌య‌మ్మ‌ను పిల‌క‌పోవ‌డం స‌ర్వ‌త్రా విస్మ‌యానికి దారి తీసింది.

‘వైఎస్సార్ ఫౌండేష‌న్‌’ పేరుతో వైసీపీ ఆధ్వ‌ర్యంలో క‌డ‌ప‌లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. దీనికి పార్టీ స‌హా.. వైఎస్ కుటుంబ స‌భ్యులు.. ఇత‌ర దాత‌ల నుంచి కూడా.. నిధులు సేక‌రిస్తున్నారు. ఇలా వ‌చ్చిన నిధుల నుంచి రూ.10 కోట్లు వెచ్చించి.. పులివెందుల‌లో అత్యాధుని వైద్య సౌక‌ర్యాల‌తో స్థానికుల‌కు ఉప యోగ‌ప‌డేలా .. వైద్య ఆసుప‌త్రి నిర్మాణానికి రెండేళ్ల కింద‌ట వైసీపీ హ‌యాంలోనే శంకుస్థాప‌న చేశారు. ఇది పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో తాజాగా క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్ దీనిని ప్రారంభించారు.

తొలుత ఆయ‌న కంటి ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ‘అద్దాలు’ ప‌డ‌తాయ‌ని వైద్యులు చెప్పారు. అయితే.. లేజ‌ర్ ట్రీట్ మెంటు తీసుకుంటాన‌ని.. అద్దాలు అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ చెప్ప‌డంతో లేజ‌ర్ ట్రీట్ మెంటు కోసం వైద్యులు రిఫ‌ర్ చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున ఈ ఆసుప‌త్రికి వ‌చ్చి.. వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డంతోపాటు.. ఉచితంగా ఆప‌రేష‌న్ల‌కు కూడా నమోద‌య్యారు. ఈ ఆసుప‌త్రిలో కంటి ప‌రీక్ష‌ల నుంచి ఆప‌రేష‌న్ల వ‌రకు అన్నీ ఉచితంగా చేయ‌నున్న‌ట్టు వైద్యులు తెలిపారు.

ఇక‌, వైఎస్సార్ ఫౌండేష‌న్ పేరుతో నెల‌కొల్పిన ఈ ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వానికి కేవ‌లం జ‌గ‌న్ ఒక్క‌రే హాజ‌ర‌య్యారు. చివ‌ర‌కు ఆయ‌న మాతృమూర్తి వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌కు కూడా ఆహ్వానం అంద‌లేద‌ని సమాచారం. దీంతో ఆమె ఎక్క‌డా ఈ కార్య‌క్ర‌మంలో క‌నిపించ‌లేదు. మ‌రోవైపు వైఎస్ కుటుంబానికి చెందిన వారిలో చాలా త‌క్కువ మందే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

This post was last modified on February 26, 2025 8:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

2 hours ago

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

4 hours ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

6 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

6 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

7 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

7 hours ago