ఉత్తరాది అంటే దక్షిణాదికి పడదు. అదే సమయంలో దక్షిణాది అంటే ఉత్తరాదికి పడదు. హిందీ అంటే తమిళులకు పడదు. కన్నడ అంటే మరాఠాలకు అస్సలు పడదు. అయినా కూడా అందరూ కలిసే భారత్ లో నివసిస్తున్నారు. ఎప్పుడో అనుకోని పరిస్థితుల్లో కొందరు ఆకతాయిల కారణంగా ఈ తరహా విబేధాలు పొడచూపుతున్నాయి గానీ.. దేశంలో అన్ని ప్రాంతాల మధ్య సోదర భావం వెల్లి విరుస్తోంది. అందుకు నిదర్శనం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో సాక్షాత్కరించింది. దేశ రాజకీయాలను శాసిస్తున్న యూపీలాంటి రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడికక్కడ తెలుగు సూచిక బోర్డులు కనిపిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ అంటేనే..వారణాసి, కేదార్ నాథ్, ప్రయాగ్ రాజ్ లాంటి ప్రసిద్ధ ఆలయాలకు ప్రసిద్ధి. అక్కడికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా వెళుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో అందరూ హిందీ, ఇంగ్లీష్ చదువు తెలిసిన వారే ఉండరు కదా. మరి అటు హిందీ, ఇటు ఇంగ్లీష్ రాని ప్రయాణికులు దారి కనుక్కోవడం ఎలా? కనిపించిన వారందరినీ అడుక్కుంటూ మరీ వెళ్లాలా? ఇదే ఆలోచన వచ్చిందో, ఏమో తెలియదు గానీ… మహాకుంభమేళాను పురస్కరించుకుని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు పలు కీలక చర్యలు చేపట్టింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు యూపీలో ప్రవేశించినా.. ప్రసిద్ధ ప్రదేశాలకు దారి చూపేలా ప్రత్యేకంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది.
ఈ దిశగా ఏర్పాటు చేసిన తెలుగు సూచిక బోర్డులు బుధవారం వెలుగు చూశాయి. అయితే సరిగ్గా బుధవారమే ప్రయాగ్ రాజ్ కేంద్రంగా పరమ పవిత్రంగా కొనసాగిన మహాకుంభమేళా ముగిసిపోయింది. కుంభమేళా చివరి రోజున భక్తులు అదిక సంఖ్యలో వస్తారని అంచనా వేసిన యోగీ సర్కారు…మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తెలుగు నేల నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లిన ఎవరో భక్తులు… అక్కడ తెలుగులో రాసిన ఉన్న సైన్ బోర్డులను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
This post was last modified on February 26, 2025 7:51 pm
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…