Political News

గ్రేట్… యూపీలో తెలుగు సైన్ బోర్డులు

ఉత్తరాది అంటే దక్షిణాదికి పడదు. అదే సమయంలో దక్షిణాది అంటే ఉత్తరాదికి పడదు. హిందీ అంటే తమిళులకు పడదు. కన్నడ అంటే మరాఠాలకు అస్సలు పడదు. అయినా కూడా అందరూ కలిసే భారత్ లో నివసిస్తున్నారు. ఎప్పుడో అనుకోని పరిస్థితుల్లో కొందరు ఆకతాయిల కారణంగా ఈ తరహా విబేధాలు పొడచూపుతున్నాయి గానీ.. దేశంలో అన్ని ప్రాంతాల మధ్య సోదర భావం వెల్లి విరుస్తోంది. అందుకు నిదర్శనం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో సాక్షాత్కరించింది. దేశ రాజకీయాలను శాసిస్తున్న యూపీలాంటి రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడికక్కడ తెలుగు సూచిక బోర్డులు కనిపిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ అంటేనే..వారణాసి, కేదార్ నాథ్, ప్రయాగ్ రాజ్ లాంటి ప్రసిద్ధ ఆలయాలకు ప్రసిద్ధి. అక్కడికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా వెళుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో అందరూ హిందీ, ఇంగ్లీష్ చదువు తెలిసిన వారే ఉండరు కదా. మరి అటు హిందీ, ఇటు ఇంగ్లీష్ రాని ప్రయాణికులు దారి కనుక్కోవడం ఎలా? కనిపించిన వారందరినీ అడుక్కుంటూ మరీ వెళ్లాలా? ఇదే ఆలోచన వచ్చిందో, ఏమో తెలియదు గానీ… మహాకుంభమేళాను పురస్కరించుకుని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు పలు కీలక చర్యలు చేపట్టింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు యూపీలో ప్రవేశించినా.. ప్రసిద్ధ ప్రదేశాలకు దారి చూపేలా ప్రత్యేకంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది.

ఈ దిశగా ఏర్పాటు చేసిన తెలుగు సూచిక బోర్డులు బుధవారం వెలుగు చూశాయి. అయితే సరిగ్గా బుధవారమే ప్రయాగ్ రాజ్ కేంద్రంగా పరమ పవిత్రంగా కొనసాగిన మహాకుంభమేళా ముగిసిపోయింది. కుంభమేళా చివరి రోజున భక్తులు అదిక సంఖ్యలో వస్తారని అంచనా వేసిన యోగీ సర్కారు…మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తెలుగు నేల నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లిన ఎవరో భక్తులు… అక్కడ తెలుగులో రాసిన ఉన్న సైన్ బోర్డులను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

This post was last modified on February 26, 2025 7:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

28 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

42 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago