Political News

నారా లోకేష్ 2.0

దేశంలోని రాజకీయ నాయకుల్లో అత్యధికంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొన్న వాళ్లలో నారా లోకేష్ ఒకడు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని సోషల్ మీడియా జనాలు ఒక ఆడుకునేవాళ్లు. ఇప్పటికీ ఆడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్ అదే స్థాయిలో టార్గెట్ అయ్యాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టడం, మరీ లావుగా ఉండి యువతను ఇన్‌స్పైర్ చేసేలా లేకపోవడం, విషయ పరిజ్ఞానంలో వెనుకబడటం, అన్నింటికీ మించి వేదికల మీద మాట్లాడేటపుడు తడబాటు లోకేష్‌కు ప్రతికూలంగా మారాయి.

లోకేష్‌ను ఒక అసమర్థుడిలా ప్రొజెక్ట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేసేవాళ్లు నెటిజన్లు. అలాగే రాజకీయ ప్రత్యర్థులు కూడా లోకేష్‌ను ఎంతగా విమర్శించేవాళ్లో, ఎద్దేవా చేసేవాళ్లో తెలిసిందే.

ఐతే లాక్ డౌన్ టైంలో నారా లోకేష్ ఆత్మపరిశీలన చేసుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఈ మధ్య అతడిలో చాలా మార్పు కనిపిస్తోంది. తన లోపాలన్నింటినీ సవరించుకునే పనిలో పడ్డట్లే కనిపిస్తున్నాడు లోకేష్. ముందుగా తన అవతారాన్ని మార్చుకున్నాడు. బాగా సన్నబడి మామూలు స్థాయికి చేరాడు. భాష మీద పట్టు సాధించాడు. బెదురు పోయింది. స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అన్నింటికీ మించి జనాల్లో తిరుగుతున్నాడు.

ప్రజల ఆదరణ, ఆమోదం పొందాలంటే క్షేత్ర స్థాయిలో తిరగడానికి మించి మార్గం లేదని అతను గుర్తించినట్లే ఉంది. వరదలతో కష్టాలు పడుతున్న రైతుల కోసం పొలాల్లో తిరిగాడు. తరచుగా మీడియాతో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందులా అక్కడ తడబాటు కనిపించడం లేదు. మామూలు విషయాలు చెప్పడానికే ఇబ్బంది పడ్డ లోకేష్.. ఇప్పుడు వైకాపాపై సూటిగా విమర్శలు చేయగలుగుతున్నాడు. పంచ్‌లు వేస్తున్నాడు.

అన్నింటికీ మించి హైలైట్ ఏంటంటే.. తాజాగా ఒక ప్రెస్ మీట్లో తాను చెప్పాల్సింది అంతా చెప్పేశాక మీడియావాళ్లు ప్రశ్నలు వేయమని ఒకటికి రెండుసార్లు తనే రెట్టించి అడిగాడు. ‘‘నేను జగన్ లాగా పారిపోను. ప్రశ్నలేయండి’’ అంటూ ఏపీ సీఎంకు గట్టి పంచే వేశాడు లోకేష్. చంద్రబాబు వారసుడిలో ఈ మార్పు తెలుగుదేశం వర్గాల్లో ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.

This post was last modified on October 24, 2020 6:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సెకండ్ ఇన్నింగ్స్….బాలయ్య సరైన మాట

మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…

8 hours ago

కూలీ ఆలోచిస్తోంది….45 వస్తానంటోంది

బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…

9 hours ago

తమ్ముడు త్వరగా రావడం సేఫేనా

నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్…

10 hours ago

రష్మిక కష్టపడింది ఈ మాత్రం దానికా

టాలీవుడ్ శ్రీవల్లిగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్లు యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాలతో…

11 hours ago

విశాఖలో లోకేశ్… జై షాతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ వీక్షణ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం…

12 hours ago

రాజధాని లేకున్నా… విశాఖలో ‘రియల్’ బూమ్

ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…

13 hours ago