ఏపీలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. గురువారం ఉదయం ఈ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ జరగనుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లంతా ఉపాధ్యాయులే కావడంతో అదేమంత సాధారణ జనానికి పెద్దగా సంబంధం లేని వ్యవహారమే. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు (డిగ్రీ పూర్తి చేసిన వారు) తమ ఓటు హక్కు వినియోంచుకుంటారు. అయితే ఈ గ్రాడ్యుయేట్లు కూడా తమకు ఎక్కడ ఓటు హక్కు ఉంటే అక్కడే వినియోగించుకోవాల్సి ఉంటుంది. సరే.. ఇప్పుడు ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా స్థానం ఒకటి కాగా… ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన స్థానం మరొకటి.
ఈ లెక్కన రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు మంగళగిరి పరిధిలోనే నివాసం ఉంటున్నారు కదా. వారిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు.. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ లు ఉండవల్లి పరిధిలో ఉంటున్నారు. వారిద్దరికీ అక్కడే ఓటు హక్కు ఉంది. చంద్రబాబు ఎంకామ్ చదవగా… లోకేశ్ కూడా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈ లెక్కన వీరిద్దరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన వారి కిందే లెక్క. గురువారం నాటి పోలింగ్ లో వీరిద్దరూ.. తాడేపల్లిలోని గాదె రామయ్య, సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఏర్పాటు కానున్న పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.
ఇక అధికార కూటమిలో మరో కీలక పార్టీ అయిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మంగళగిరి పరిధిలోనే ఉంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ అక్కడే తన ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ చదివింది ఇంటర్ వరకే కావడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఓటు హక్కు లేదు. దీంతో ఆయన ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మంగళగిరి పరిధిలోని తాడేపల్లిలోనే ఉంటున్నారు. అయితే ఏళ్ల తరబడి జగన్ ఎక్కడ ఉంటున్నా… తన ఓటు హక్కు మాత్రం తన సొంతూరు పులివెందులలోనే కొనసాగించుకుంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన జగన్ కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నా… ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాల్సిన అవసరం లేదు.
This post was last modified on February 25, 2025 5:58 pm
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…