ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమాగా హరిహర వీరమల్లు మీద క్రమంగా అంచనాలు ఊపందుకుంటున్నాయి. మూడేళ్ళ నిర్మాణం వల్ల హైప్ కొంచెం తక్కువగా ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నా వాళ్ళ ఊహలకు ఏ మాత్రం అందని రీతిలో విజువల్ గ్రాండియర్ ఉంటుందని యూనిట్ సభ్యులు ఊరిస్తున్నారు. ఇప్పటిదాకా రెండు పాటలు వచ్చేశాయి. మాట వినాలి గురుడా మాట వినాలి క్రమంగా ఎక్కుతుండగా, కొల్లగొట్టినాదిరో మాస్ ఆడియన్స్ కి నచ్చేస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ మూవీలో తను పోషిస్తున్న పంచమి పాత్రతో పాటు మరికొన్ని ముచ్చట్లు పంచుకుంది.
ఇంకొక్క పాటకు సంబంధించి కేవలం రెండు రోజుల షూట్ మాత్రమే నిధికి పెండింగ్ ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు మంచి డాన్స్ సీక్వెన్సులు ఇందులో ఉండబోతున్నాయి. వాటికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇంకా వదల్లేదు. గతంలో నిర్వహించిన వర్క్ షాప్ లో ప్రాక్టీస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇకపై టైం వేస్ట్ చేయడం లాంటివి ఉండవు. వీరమల్లు కోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది నిధి అగర్వాల్. పంచమి ఫ్లాట్ క్యారెక్టర్ కాదు. బోలెడు ట్విస్టులు, షేడ్స్, మలుపులు ఉంటాయి. రెండో భాగానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ఆల్రెడీ షూట్ చేయడం అయిపోయింది.
చూశారుగా పంచమి చెప్పుకునే కబుర్లు. మార్చి 28 విడుదల గురించి నిర్మాణ సంస్థ వైపు నుంచి మరోసారి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి నిధి చెప్పిన అప్డేట్స్ మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తనకు టాలీవుడ్ లో పెద్ద బ్రేక్ దక్కలేదు. అఖిల్ లాంటి స్టార్లతో చేసినా ఫలితం లేకపోయింది. హరిహర వీరమల్లు కోసం ఎక్కువ డేట్లు కేటాయించిన నిధి ఇది ఖచ్చితంగా పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉంది. ఇదే ఏడాది ప్రభాస్ తో జోడి కట్టిన ది రాజా సాబ్ విడుదల కానుండటం తనకు మరో మైలురాయి కానుంది. చూడాలి డబుల్ ధమాకా ఎలా ఉండబోతోందో.
This post was last modified on February 25, 2025 9:28 pm
సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్న కాంక్షతో వడివడిగా ముందుకు సాగుతున్న చంద్రబాబు.. అదే సమయంలో తాను తీసుకుంటున్న నిర్ణయాల్లో వచ్చే…
తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మరోమారు మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రత్యేకించి సీఎం ఎనుముల…
రెడ్డినేతలందు.. ఈ రెడ్డి వేరయా! అని అనిపిస్తున్నారు నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. హార్డ్ కోర్…
ఏపీ సీఎం చంద్రబాబు.. హిందువుల చిరకాల కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా హిందువులకు చెందిన ధార్మిక…
ఎదురుచూసి చూసి అలిసిపోయిన నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పేలా లేదు. గత…
అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకున్న ఓ బోటు ప్రమాదంలో భారత్ కు చెందిన ఇద్దరు చిన్నారులు గల్లంతు అయ్యారు. పిల్లల తల్లిదండ్రులు…